
MOD: ఆర్మీ చీఫ్కు కేంద్రం ప్రత్యేక అధికారాలు
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్తాన్తో ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న సమయంలో భారత రక్షణ శాఖ కీలకంగా అడుగులు వేస్తోంది.
దేశంలో భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
ఈ నేపథ్యంలో,రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఢిల్లీలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS), త్రివిధ దళాల అధిపతులు పాల్గొన్న ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని ఇవాళ నిర్వహించారు.
ఈ భేటీలో దేశంలో నెలకొన్న పరిస్థితులపై సమగ్రంగా చర్చించడంతో పాటు, భద్రతను మరింత పటిష్ఠంగా చేయాలన్న ఉద్దేశంతో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఈ సమీక్ష సమావేశంలో దేశవ్యాప్తంగా ఉన్న32 టెరిటోరియల్ ఆర్మీ బటాలియన్లపై కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఇందులో భాగంగా,14టెరిటోరియల్ ఆర్మీ బటాలియన్లను వెంటనే విధుల్లోకి దింపాలని నిర్ణయించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఆర్మీ చీఫ్కు ప్రత్యేక అధికారాలు
BREAKING 🚨
— Shiv Aroor (@ShivAroor) May 9, 2025
MoD activated 14 Infantry Battalions of the Territorial Army for deployment across Northern, Western and Eastern Commands till 2028. For heightened readiness and strategic reinforcement. (⚠️Public gazette notification, not classified) pic.twitter.com/FpOwNcNRhO
వివరాలు
అత్యవసర సేవల కోసం సిద్దం
పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని వీరిని అత్యవసరంగా సేవల కోసం సిద్దం చేయనున్నారు.
టెరిటోరియల్ ఆర్మీ (TA) అంటే, ఇది భారత సైన్యానికి అవసరమైన సేవలు అందించే పార్ట్ టైమ్ వాలంటీర్లతో కూడిన రిజర్వ్ దళం.
ఇందులో అధికారులు, జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్లు, నాన్ కమిషన్డ్ ఆఫీసర్లు, ఇతర సిబ్బంది సభ్యులుగా ఉంటారు.
వీరందరూ భారత సైన్యంలో ఉన్న సర్వీసు సభ్యులతో సమానమైన ర్యాంక్లు కలిగి ఉండటం విశేషం.
అయితే, వీరు సైనిక సేవలతో పాటు తమ పౌర జీవితాల్లో తమ వృత్తులను కొనసాగించే అవకాశాన్ని కూడా కలిగి ఉంటారు.