NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / కేసీఆర్ ఎన్డీఏలో చేరుతానన్నారు.. నేను ఒప్పుకోలేదు: నిజామాబాద్ సభలో ప్రధాని మోదీ 
    తదుపరి వార్తా కథనం
    కేసీఆర్ ఎన్డీఏలో చేరుతానన్నారు.. నేను ఒప్పుకోలేదు: నిజామాబాద్ సభలో ప్రధాని మోదీ 
    కేసీఆర్ ఎన్డీఏలో చేరుతానన్నారు.. నేను ఒప్పుకోలేదు: నిజామాబాద్ సభలో ప్రధాని మోదీ

    కేసీఆర్ ఎన్డీఏలో చేరుతానన్నారు.. నేను ఒప్పుకోలేదు: నిజామాబాద్ సభలో ప్రధాని మోదీ 

    వ్రాసిన వారు Stalin
    Oct 03, 2023
    06:31 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    నిజామాబాద్‌లో బీజేపీ నిర్వహించిన భారీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రసంగం చేశారు. రాష్ట్రంలోని అధికార పార్టీ అయిన బీఆర్ఎస్, కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

    తెలంగాణ కుటుంబ పాలనకు అడ్డగా మారిపోయిందని విమర్శంచారు. బీఆర్ఎస్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని లూటీ స్వామ్యంగా మార్చేసిందన్నారు.

    తెలంగాణలో మొత్తం అధికారం ఒక కుటుంబం వద్దే కేంద్రీకృతమైనట్లు మోదీ పేర్కొన్నారు.

    కుటుంబ పాలన వల్ల ఎక్కువ నష్టం యవతకే జరుగుతుందన్నారు.

    తెలంగాణలో కుటుంబ పాలన వల్ల కేసీఆర్‌, ఆయన కొడుకు, కూతురు, అల్లుడు మాత్రమే లబ్ధిపొందుతున్నారని దుయ్యబట్టారు.

    తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఫలాలకు కేసీఆర్ ప్రభుత్వం మాత్రమే అనుభవిస్తోందని మోదీ అన్నారు.

     మోదీ

    నా కళ్లలోకి చూసే ధైర్య కేసీఆర్‌కు లేదు: మోదీ 

    నిజామాబాద్ సభలో కేసీఆర్‌పై మోదీ కీలక విమర్శలు చేశారు. వందశాతం నిజం మాట్లాడేందుకు తాను ఇక్కడికి వచ్చినట్లు మోదీ పేర్కొన్నారు.

    తన కళ్లల్లోకి చూసే ధైర్యం కేసీఆర్‌కు లేదని ప్రధాని మోదీ ఘాటు స్పందించారు.

    జీహెచ్‌ఎంసీ ఎన్నికల తర్వాత కేసీఆర్‌ దిల్లీకి వచ్చినట్లు, ఎన్డీఏలో చేరతానని తనను అడిగారని మోదీ చెప్పారు.

    అలసిపోయానని, కేటీఆర్‌కు రాష్ట్ర బాధ్యతలు అప్పగిస్తానని కేసీఆర్ తనతో అన్నారని మోదీ వివరించారు.

    అయితే తాను ఇది రాచరికం కాదని చెప్పానని మోదీ అన్నారు. అధికారంలో ఎవరు ఉండాలనేది ప్రజలే నిర్ణయిస్తానని తాను కేసీఆర్‌కు చెప్పినట్లు వెల్లడించారు.

    మోదీ

    ఇద్దరం గుజరాతీలమే: మోదీ

    తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని ప్రధాని మోదీ మరోసారి స్పష్టం చేశారు.

    నాడు గుజరాత్‌కు చెందిన సర్దార్‌ పటేల్‌ నిజాం పాలన నుంచి తెలంగాణకు విముక్తి కల్పించారని అన్నారు.

    ఇప్పుడు మరో గుజరాతీ అయిన తాను తెలంగాణ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు చేప్పారు.

    తెలంగాణలో పసుపు బోర్డు, గిరిజన సెంట్రల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.

    తెలంగాణలో టాలెంట్‌కు కొదవలేదన్నారు. కరోనా కాలంలో ప్రపంచానికి కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చిన ఘనత తెలంగాణకే దక్కుతుందని మోదీ అన్నారు.

    నేడు ప్రారంభించిన ఎన్టీపీసీ వల్ల తెలంగాణకే ఎక్కువ ఉపయోగం జరగుతుందన్నారు.

    మోదీ

    మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్‌ కాకుండా కాంగ్రెస్ కుట్ర చేసింది: మోదీ

    దేశం మొత్తం కాంగ్రెస్‌ను తిరస్కరించినట్లు మోదీ పేర్కొన్నారు. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బీఆర్‌ఎస్‌ నేతలే డబ్బులు అందజేశాని విమర్శించారు.

    మహిళా బిల్లుపై కూడా మోదీ మాట్లాడారు. ప్రతిపక్షాల ఇండియా కూటమి, కాంగ్రెస్‌ పార్టీ మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్‌ కాకుండా కుట్ర చేసినట్లు మోదీ ఆరోపించారు.

    ఒకవైపు బిల్లుకు మద్దతు తెలుపుతూనే, మరోవైపు కుట్రలు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

    చివరికి గత్యంతరం లేక కాంగ్రెస్ పార్టీ మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇచ్చినట్లు మోదీ అన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ
    నిజామాబాద్
    బీజేపీ
    తెలంగాణ

    తాజా

    Rains: నేడు ఏపీలో అక్కడక్కడ భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక ఆంధ్రప్రదేశ్
    Gayatri : ప్రముఖ గాయని కన్నుమూత అస్సాం/అసోం
    Dadasaheb Phalke: ఫాల్కే బయోపిక్‌పై క్లారిటీ.. రాజమౌళి కాదు, ఆమిర్‌ టీమ్‌ మాత్రమే సంప్రదించింది టాలీవుడ్
    Hyderabad Metro: నేటి నుంచి మెట్రో ఛార్జీల్లో పెంపు.. ప్రయాణికులకు అదనపు భారం మెట్రో స్టేషన్

    నరేంద్ర మోదీ

    రష్యా వాహన తయారీదారులకు పుతిన్ మేక్ ఇన్ ఇండియా ఉదాహరణ వ్లాదిమిర్ పుతిన్
    జీ20 సదస్సులో విధులు నిర్వహించిన పోలీసులతో ప్రధాని మోడీ డిన్నర్  జీ20 సదస్సు
    మోదీ అధ్యక్షత బీజేపీ కీలక సమావేశం.. ఎన్నికలపై చర్చ బీజేపీ
    సనాతన ధర్మాన్ని అంతం చేయాలని విపక్ష ఇండియా కోరుకుంటోంది: నరేంద్ర మోదీ సనాతన ధర్మం

    నిజామాబాద్

    నిజామాబాద్‌పై చంద్రబాబు ఫోకస్: మరో భారీ బహిరంగ సభకు ప్లాన్ చంద్రబాబు నాయుడు
    హైదరాబాద్‌లో విషాదం: వీధికుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు మృతి హైదరాబాద్
    నిజామాబాద్‌: మెడికల్ కాలేజీ హాస్టల్ గదిలో ఉరేసుకుని విద్యార్థి ఆత్మహత్య భారతదేశం
    నిజామాబాద్ ఉగ్రవాద కుట్ర కేసు: పీఎఫ్‌ఐ వెపన్ ట్రైనర్‌ను అరెస్టు చేసిన ఎన్ఐఏ  ఎన్ఐఏ

    బీజేపీ

    5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ ఫోకస్: నేడు పార్టీ ఎన్నికల కమిటీ సమావేశం అసెంబ్లీ ఎన్నికలు
    ఛత్తీస్‌గఢ్‌ బీజేపీ కురువృద్ధుడు, మాజీ మంత్రి లీలారామ్ భోజ్వానీ కన్నుమూత ఛత్తీస్‌గఢ్
    జై శ్రీరామ్ పేరుతో ప్రజలను చంపుతున్నారు: పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ  జమ్ముకశ్మీర్
    అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ రంగం సిద్ధం.. ఆ 2 రాష్ట్రాల అభ్యర్థుల తొలి జాబితా విడుదల  భారతదేశం

    తెలంగాణ

    TSRTC: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత వైఫై సేవలు  టీఎస్ఆర్టీసీ
    తెలంగాణలో కాంగ్రెస్‌-సీపీఐ చర్చలు సఫలం.. సీపీఐ, సీపీఎంలకు ఎన్ని టిక్కెట్లో తెలుసా  కాంగ్రెస్
    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం కమిటీలను ఏర్పాటు చేయనున్న బీజేపీ బీజేపీ
    తెలంగాణలో 5 రోజులు దంచికొట్టనున్న వర్షాలు.. ఎల్లో అలెర్ట్ జారీ భారీ వర్షాలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025