NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / #ModiKaParivar : 'లాలూ' ఎఫెక్ట్.. సోషల్ మీడియాలో బీజేపీ 'మోదీ కా పరివార్' ప్రచారం 
    తదుపరి వార్తా కథనం
    #ModiKaParivar : 'లాలూ' ఎఫెక్ట్.. సోషల్ మీడియాలో బీజేపీ 'మోదీ కా పరివార్' ప్రచారం 
    #ModiKaParivar : 'లాలూ' ఎఫెక్ట్.. సోషల్ మీడియాలో బీజేపీ 'మోదీ కా పరివార్' ప్రచారం

    #ModiKaParivar : 'లాలూ' ఎఫెక్ట్.. సోషల్ మీడియాలో బీజేపీ 'మోదీ కా పరివార్' ప్రచారం 

    వ్రాసిన వారు Stalin
    Mar 04, 2024
    07:24 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కుటుంబం లేదని ఆదివారం అన్న మాటలు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది.

    ఆదివారం పాట్నలో తేజస్వీ యాదవ్ చేపట్టిన 'జన్ విశ్వాస్ మహా ర్యాలీ'లోలాలూ ఈ వ్యాఖ్యలు చేశారు.

    లాలూ యాదవ్ ఆ మాటలు అన్న ఒకరోజు తర్వాత.. బీజేపీ అగ్రనాయకులు మోదీ మద్దుతుగా సోషల్ మీడియా వేదికగా కౌంటర్స్ ఇస్తున్నారు.

    ట్విట్టర్(ఎక్స్) హ్యాండిల్స్‌లో వారి పేరు పక్కన 'మోదీ కా పరివార్ (#ModiKaParivar) ' అని జత చేసి.. తామంతా మోదీ కుటుంబమే అన్న మెసేజ్‌ను ఇస్తున్నారు.

    అమిత్ షా, యూపీ సీఎం యోగి, నడ్డా లాంటి ముఖ్య నాయకులు తమ ప్రొఫైల్‌లో 'మోదీ కా పరివార్' అనే నినాదాన్ని చేర్చుకున్నారు.

    మోదీ

    140 కోట్లమంది నా కుటుంబ సభ్యులే: మోదీ

    ప్రధాని మోదీ కూడా సోమవారం లాలూ ఆరోపణకు దీటుగా బదులిస్తూ, అవినీతి, బంధుప్రీతి, బుజ్జగింపు రాజకీయాల్లో ఇండియా కూటమి నేతలు మునిగితేలుతున్నట్లు పేర్కొన్నారు.

    ఆదిలాబాద్‌లో ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ.. 140 కోట్ల మంది దేశప్రజలు నా కుటుంబమని, ఎవరూ లేని వారు కూడా మోదీకి చెందినవారన్నారు.

    ఇదిలా ఉంటే, లోక్‌సభ ఎన్నికల వేళ.. బీజేపీ ఇచ్చిన 'మోదీ కా పరివార్' నినాదం.. 2019 నాటి ఎన్నికల సంఘటనను గుర్తుకు తెలుస్తుంది.

    2019 ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ మోదీని ఉద్దిశించి 'చౌకీదార్ చోర్ హై' అన్నారు.

    దానికి కౌంటర్‌గా బీజేపీ నేతలు "మై భీ చౌకీదార్ హూన్' అంటూ తమ సోషల్ మీడియా హ్యాండిల్స్ మార్చారు.

    మోదీ

    ట్రెండింగ్‌లో #మోదీ కా పరివార్ 

    ప్రధాని మోదీ మద్దతుదారులు, కేంద్రమంత్రులు, బీజేపీ అగ్రనేతలు సోషల్ మీడియాలో తమ ప్రొఫైల్‌లలో 'మోదీ కా పరివార్' అని రాయడంతో ఇది ట్రెండింగ్ లిస్టులో చేరిపోయింది.

    సంబిత్ పాత్ర, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అనురాగ్ ఠాకూర్, పీయూష్ గోయల్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వంటి చాలా మంది బీజేపీ నేతలు, దేశవ్యాప్తంగా ప్రధాని మోదీని ఇష్టపడే వ్యక్తులు తమ ఎక్స్-బయోలో 'మోదీ కా పరివార్'ను జత చేశారు.

    ఒకరకంగా చెప్పాలంటే.. మోదీని విమర్శించడానికి లాలూ ప్రసాద్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు.. ఇప్పుడు బీజేపీ కీలక అస్త్రంగా మారడం గమనార్హం.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    లాలూ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన మోదీ 

    मेरा भारत- मेरा परिवार !

    आज पूरा देश एक सुर में कह रहा है-
    मैं हूं मोदी का परिवार ! pic.twitter.com/KvOUoSePJc

    — Narendra Modi (@narendramodi) March 4, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    లాలూ ప్రసాద్ యాదవ్
    నరేంద్ర మోదీ
    బీజేపీ
    తాజా వార్తలు

    తాజా

    KKR vs RCB : బెంగళూరులో మ్యాచ్ రద్దు.. కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ

    లాలూ ప్రసాద్ యాదవ్

    జాబ్ స్కామ్ కేసు: రబ్రీ దేవిని ప్రశ్నించిన సీబీఐ అధికారులు సీబీఐ
    జాబ్ స్కామ్ కేసు: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌పై సీబీఐ ప్రశ్నల వర్షం సీబీఐ
    IRCTC scam: లాలూ అనుచరులు, బంధువుల ఇళ్లపై ఈడీ దాడులు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌/ఈడీ
    ల్యాండ్ ఫర్ జామ్ స్కామ్ కేసు: తేజస్వి యాదవ్‌కు సీబీఐ సమన్లు తేజస్వీ యాదవ్

    నరేంద్ర మోదీ

    Kejriwal: ఈడీ విచారణకు మరోసారి డుమ్మా కొట్టనున్నఅరవింద్ కేజ్రీవాల్ అరవింద్ కేజ్రీవాల్
     LK Advani: బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీకి 'భారతరత్న' భారతరత్న
    PM Modi : కింగ్ చార్లెస్ III త్వరగా కోలుకోవాలి.. ప్రధాని మోదీ ఆకాంక్ష  భారతదేశం
    PM Modi: వచ్చే ఆరేళ్లలో భారత ఇంధన రంగంలో 67 బిలియన్ డాలర్ల పెట్టుబడులు: ప్రధాని మోదీ  ప్రధాన మంత్రి

    బీజేపీ

    BJP: లోక్‌సభ ఎన్నికలపై బీజేపీ ఫోకస్.. ఫిబ్రవరి 4 నుంచి 'గావో చలో అభియాన్'  లోక్‌సభ
    అయోధ్య రామమందిరం ప్రత్యక్ష ప్రసారాలపై తమిళనాడు సర్కార్ నిషేధం: నిర్మలా సీతారామన్  తమిళనాడు
    Rahul Gandhi: అసోంలో రాహుల్ గాంధీ యాత్ర.. ఒక షరతు విధించిన సీఎం హిమంత శర్మ  రాహుల్ గాంధీ
    Bharat Ratna: 'భారతరత్న' అవార్డును ఇప్పటి వరకు ఎంతమందికి ఇచ్చారో తెలుసా?  భారతరత్న

    తాజా వార్తలు

    Anant Ambani: ప్రీ వెడ్డింగ్ వేడుకలను అందుకే జామ్‌నగర్‌లో జరుపుకుంటున్నా: అనంత్ అంబానీ  అనంత్ అంబానీ
    Missouri: నోటీసులు ఇచ్చేందుకు వచ్చిన పోలీసులు, కోర్టు సిబ్బందిపై కాల్పులు.. ఇద్దరు మృతి  అమెరికా
    Maharashtra: 'ఇండియా' కూటమి పొత్తు ఖారారు.. 18స్థానాల్లో కాంగ్రెస్ పోటీ మహారాష్ట్ర
    LPG Cylinder Price: భారీగా గ్యాస్ సిలిండర్ ధర  గ్యాస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025