Page Loader
Odisha: ఒడిశా కొత్త ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాఝీ
Odisha: ఒడిశా కొత్త ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాంఝీ

Odisha: ఒడిశా కొత్త ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాఝీ

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 11, 2024
06:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఒడిశా తదుపరి ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాఝీని చేయాలని భారతీయ జనతా పార్టీ నిర్ణయించింది. ఒడిశా సీఎం ఎంపిక కోసం బీజేపీ హైకమాండ్ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్,పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవ్‌లను పరిశీలకులుగా నియమించింది. మోహన్ మాఝీ బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు.ఆయనతో పాటు కేవీ సింగ్ డియో, ప్రవతి పరిదా కూడా రాష్ట్ర డిప్యూటీ సీఎంలుగా ప్రమాణం చేయనున్నారు. ఈసారి మోహన్ చరణ్ మాఝీ భారతీయ జనతా పార్టీ టిక్కెట్‌పై కియోంజర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. ఆయన ఈస్థానం నుంచి గెలవడం ఇదే తొలిసారి కాదు.ఇంతకు ముందు కూడా,అయన కియోంజర్ అసెంబ్లీ స్థానం నుండి మూడుసార్లు ఎన్నికల్లో పోటీచేసి విజయం సాధించాడు.

వివరాలు 

మీనా మాఝీపై 11,577 ఓట్ల భారీ తేడాతో విజయం

2000 సంవత్సరంలో, మోహన్ చరణ్ మాఝీ ఒడిశాలోని కియోంజర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా ఎన్నికై విజయం సాధించారు. 2009లో బీజేపీ మళ్లీ మోహన్ చరణ్ మాఝీపై విశ్వాసం వ్యక్తం చేసింది. ఆయన కియోంజర్ అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. 2019లో, మాంఝీ మరోసారి బీజేపీ టిక్కెట్‌పై కియోంజర్ అసెంబ్లీ స్థానం నుంచి గెలిచారు. మోహన్ చరణ్ మాఝీ 2024లో కియోంజర్ అసెంబ్లీ నుంచి నాలుగోసారి గెలుపొందారు. ఈసారి ఎన్నికల్లో మాఝీకి మొత్తం 87,815 ఓట్లు వచ్చాయి. అయన తన సమీప ప్రత్యర్థి బిజూ జనతాదళ్‌కు చెందిన మీనా మాఝీపై 11,577 ఓట్ల భారీ తేడాతో విజయం సాధించాడు.