Page Loader
MPs suspended: పార్లమెంట్ నుంచి సస్పెండ్ అయ్యిన మరో ఇద్దరు విపక్ష ఎంపీలు 
పార్లమెంట్ నుంచి సస్పెండ్ అయ్యిన మరో ఇద్దరు విపక్ష ఎంపీలు

MPs suspended: పార్లమెంట్ నుంచి సస్పెండ్ అయ్యిన మరో ఇద్దరు విపక్ష ఎంపీలు 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 20, 2023
03:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

లోక్‌సభ బుధవారం నాడు మరో ఇద్దరు ప్రతిపక్ష ఎంపీలను పార్లమెంటు శీతాకాల సమావేశాల వరకు సస్పెండ్ చేసినట్లు వార్తా సంస్థ పిటిఐ నివేదించింది. సస్పెండ్ అయిన ఎంపీలలో కేరళకి చెందిన థామస్ చజికదన్,M ఆరిఫ్,ఉన్నారు. చజికదన్ కేరళ కాంగ్రెస్ (ఎం)కి చెందినవారు కాగా, ఆరిఫ్ సీపీఎంకు చెందినవారు. పిటిఐ ప్రకారం, "ప్లకార్డులు ప్రదర్శించి, వెల్ ఆఫ్ హౌస్‌లోకి ప్రవేశించినందుకు" ఇద్దరినీ సస్పెండ్ చేశారు. దీంతో మొత్తం 143 మంది ప్రతిపక్ష ఎంపీలను పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేశారు. శీతాకాల సమావేశాలు శుక్రవారం(డిసెంబర్ 22)తో ముగియనున్నాయి. డిసెంబర్ 4న ప్రారంభమైన ఈ సెషన్‌లో డిసెంబర్ 14న 14 మంది, సోమవారం 78 మంది, మంగళవారం 49 మంది,ఈరోజు మరో ఇద్దరు ఎంపీలను సస్పెండ్ చేశారు.

Details 

సభాపతి ఆదేశాలను ఉల్లంఘించినందుకే ఎంపీల సస్పెండ్

డిసెంబరు 13న పార్లమెంట్ భద్రతా ఉల్లంఘనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ లోక్‌సభ, రాజ్యసభ రెండింటి పనితీరుకు అంతరాయం కలిగించి, నినాదాలు చేసినందుకు ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేశారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్రం తమ గొంతును నొక్కేస్తున్నాయని,ఇది "ప్రజాస్వామ్య హత్య" అని ప్రతిపక్షాలు ఆరోపించాయి. సస్పెన్షన్‌ను నిరసిస్తూ పార్లమెంట్‌ కాంప్లెక్స్‌ వెలుపల నిరసనలు చేపట్టారు. మరోవైపు సభల్లో సభాపతి ఆదేశాలను ఉల్లంఘించినందుకే ఎంపీలను సస్పెండ్ చేశారని ప్రభుత్వం వాదిస్తోంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

యాక్టింగ్ స్పీకర్  ప్రకటన