NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / MPs suspended: పార్లమెంట్ నుంచి సస్పెండ్ అయ్యిన మరో ఇద్దరు విపక్ష ఎంపీలు 
    తదుపరి వార్తా కథనం
    MPs suspended: పార్లమెంట్ నుంచి సస్పెండ్ అయ్యిన మరో ఇద్దరు విపక్ష ఎంపీలు 
    పార్లమెంట్ నుంచి సస్పెండ్ అయ్యిన మరో ఇద్దరు విపక్ష ఎంపీలు

    MPs suspended: పార్లమెంట్ నుంచి సస్పెండ్ అయ్యిన మరో ఇద్దరు విపక్ష ఎంపీలు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 20, 2023
    03:51 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    లోక్‌సభ బుధవారం నాడు మరో ఇద్దరు ప్రతిపక్ష ఎంపీలను పార్లమెంటు శీతాకాల సమావేశాల వరకు సస్పెండ్ చేసినట్లు వార్తా సంస్థ పిటిఐ నివేదించింది.

    సస్పెండ్ అయిన ఎంపీలలో కేరళకి చెందిన థామస్ చజికదన్,M ఆరిఫ్,ఉన్నారు. చజికదన్ కేరళ కాంగ్రెస్ (ఎం)కి చెందినవారు కాగా, ఆరిఫ్ సీపీఎంకు చెందినవారు.

    పిటిఐ ప్రకారం, "ప్లకార్డులు ప్రదర్శించి, వెల్ ఆఫ్ హౌస్‌లోకి ప్రవేశించినందుకు" ఇద్దరినీ సస్పెండ్ చేశారు.

    దీంతో మొత్తం 143 మంది ప్రతిపక్ష ఎంపీలను పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేశారు.

    శీతాకాల సమావేశాలు శుక్రవారం(డిసెంబర్ 22)తో ముగియనున్నాయి. డిసెంబర్ 4న ప్రారంభమైన ఈ సెషన్‌లో డిసెంబర్ 14న 14 మంది, సోమవారం 78 మంది, మంగళవారం 49 మంది,ఈరోజు మరో ఇద్దరు ఎంపీలను సస్పెండ్ చేశారు.

    Details 

    సభాపతి ఆదేశాలను ఉల్లంఘించినందుకే ఎంపీల సస్పెండ్

    డిసెంబరు 13న పార్లమెంట్ భద్రతా ఉల్లంఘనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ లోక్‌సభ, రాజ్యసభ రెండింటి పనితీరుకు అంతరాయం కలిగించి, నినాదాలు చేసినందుకు ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేశారు.

    బీజేపీ నేతృత్వంలోని కేంద్రం తమ గొంతును నొక్కేస్తున్నాయని,ఇది "ప్రజాస్వామ్య హత్య" అని ప్రతిపక్షాలు ఆరోపించాయి.

    సస్పెన్షన్‌ను నిరసిస్తూ పార్లమెంట్‌ కాంప్లెక్స్‌ వెలుపల నిరసనలు చేపట్టారు. మరోవైపు సభల్లో సభాపతి ఆదేశాలను ఉల్లంఘించినందుకే ఎంపీలను సస్పెండ్ చేశారని ప్రభుత్వం వాదిస్తోంది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    యాక్టింగ్ స్పీకర్  ప్రకటన

    #WATCH | Lok Sabha MPs C Thomas and AM Ariff suspended for the winter session of Parliament for "displaying placards and entering the Well of the House" pic.twitter.com/SkMYPMa2TO

    — ANI (@ANI) December 20, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    లోక్‌సభ

    తాజా

    NTR: బ్రహ్మర్షి నుంచి భీమ్‌దాకా... ఎన్టీఆర్‌ స్టార్ హీరోగా ఎదిగిన ప్రయాణమిదీ! జూనియర్ ఎన్టీఆర్
    Jammu Kashmir: పూంచ్‌లో పాకిస్తాన్  లైవ్‌ షెల్‌..ధ్వంసం చేసిన భారత ఆర్మీ  జమ్ముకశ్మీర్
    India-US: భారత్‌,అమెరికా మొదటి దశ వాణిజ్య ఒప్పందంపై త్వరితగతిన అడుగులు  పీయూష్ గోయెల్‌
    Ajith: పని చేసుకుంటూ రేసింగ్‌లో పాల్గొన్నా.. చిన్ననాటి కష్టాలు గుర్తు చేసుకున్న అజిత్ అజిత్ కుమార్

    లోక్‌సభ

    'శిక్షించేందుకే బ్రిటీష్ ఆ చట్టాలను తెచ్చింది.. పౌరుల హక్కుల రక్షణ కోసం సరికొత్త చట్టాలు'  పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు
    భారత నేర న్యాయ వ్యవస్థ ప్రక్షాళన దిశగా కేంద్రం.. 377 సెక్షన్ రద్దుకు ప్రతిపాదన  భారతదేశం
    'దిల్లీ సర్వీసెస్ బిల్లు'కు రాష్ట్రపతి ఆమోదం; దేశ రాజధానికి ఇక కొత్త చట్టం దిల్లీ సర్వీసెస్ బిల్లు
    PM Modi: సార్వత్రిక ఎన్నికల వేళ ప్రధాని మోదీ దేశ ప్రజలకు 5 వరాలు నరేంద్ర మోదీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025