NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / కనీస మద్ధతు ధరలకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్.. క్వింటాల్ వరికి రూ.143 పెంపు 
    తదుపరి వార్తా కథనం
    కనీస మద్ధతు ధరలకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్.. క్వింటాల్ వరికి రూ.143 పెంపు 
    క్వింటాల్ వరికి రూ. 143 పెంపు

    కనీస మద్ధతు ధరలకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్.. క్వింటాల్ వరికి రూ.143 పెంపు 

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jun 07, 2023
    05:34 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    2023 -24 మార్కెటింగ్ సీజన్ ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)ల పెంపుదలకు బుధవారం కేంద్ర మంత్రివర్గం అంగీకరించింది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశమైంది.

    భేటీలో వ్యవసాయ రంగానికి సంబంధించిన అంశాలపై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు మినిమమ్ సపోర్ట్ ప్రైస్ ( ఎంఎస్పీ)ని పెంపుకు నిర్ణయించింది.

    అన్నదాతలకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు, పంటల వైవిధ్యాన్ని ప్రోత్సహించడం లక్ష్యాలుగా ఎంఎస్పీని సమీక్షించినట్టు వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖ మంత్రి పియూశ్ గోయల్ తెలిపారు.

    కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రైసెస్ సిఫారసుల ఆధారంగా వివిధ పంటల కనీస మద్ధతు ధరలను నిర్ణయిస్తామని వివరించారు.

    Msp Increased For Agricultural Crops By Union Cabinet Committee 

    గతంతో పోల్చితే ఈసారి అధిక మద్ధతు ధరలు

    గతంలో పంటలకు ప్రకటించిన కనీస మద్ధతు ధరల పెంపుదలతో పోల్చితే ఈ సంవత్సరం పెరుగుదల అత్యధికంగా ఉందని కేంద్ర మంత్రి పీయుష్ గోయల్ వివరించారు.

    వరికి కనీస మద్ధతు ధర పెంపు :

    ఈ ఖరీఫ్ సీజన్ లో వరి పంటకు కనీస మద్ధతు ధర క్వింటాల్ కు రూ. 143 పెంచామని గోయల్ అన్నారు. తాజా పెంపుతో క్వింటాల్ వరి (కామన్ గ్రేడ్ వెరైటీ) ధర రూ. 2,183కి చేరుకుందన్నారు. గతేడాది ఇదే సీజన్ కు సంబంధించి పెంపుదలకు ముందు ధర రూ. 2,040గా ఉండేదని స్పష్టం చేశారు.

    Msp Increased For Agricultural Crops By Union Cabinet Committee 

    పెసర పంటకు 10 శాతం కనీస మద్ధతు ధర

    ఏ గ్రేడ్ వెరైటీ వరి ఎంఎస్పీని క్వింటాల్ కు రూ. 163 పెంచామని గోయల్ చెప్పారు. ఫలితంగా ఏ గ్రేడ్ వరి ధర క్వింటాల్ కు ఎంఎస్పీ రూ. 2,203 కి చేరిందని, పెంపుదలకు ముందు ఇది రూ. 2060గా ఉండేదన్నారు.

    పెసర పంటకు అత్యధిక పెంపు :

    2023 -24 మార్కెటింగ్ సీజన్ లో పెసర పంటకే అత్యధికంగా కనీస మద్దతు ధరను పెంచామన్నారు. పెసర పంట ఎంఎస్పీని ఒక క్వింటాల్ పై సుమారుగా 10.4 శాతం వరకు పెంచామన్నారు. తాజా పెంపుతో పెసర పంట క్వింటాల్ కనీస మద్దతు ధర రూ. 8,558కి చేరుకోవడం విశేషం. గత ఖరీఫ్ సీజన్ లో అది రూ. 7,755గా ఉండేదన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ప్రధాన మంత్రి
    నరేంద్ర మోదీ

    తాజా

    Manchu Vishnu: ఇప్పటికీ నా చేతికి రాలేదు.. హార్డ్‌డిస్క్‌ మాయంపై మళ్లీ స్పందించిన మంచు విష్ణు మంచు విష్ణు
    India's COVID-19 surge: దేశంలో 4300 దాటిన కరోనా కేసులు- ఏ రాష్ట్రంలో ఎక్కువ అంటే? కరోనా కొత్త కేసులు
    Ather Rizta: భారతీయులను మెప్పించిన రిజ్టా.. ఏడాదిలో లక్ష అమ్మకాలు! ఆటో మొబైల్
    Pakistan Spy: పాక్‌ కోసం గూఢచర్యం చేస్తున్న మరో యూట్యూబర్‌ అరెస్ట్‌ పంజాబ్

    ప్రధాన మంత్రి

    కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభానికి ముహూర్తం ఖరారు; ఈ నెలఖరులోనే!  నరేంద్ర మోదీ
    రాజస్థాన్‌లో రూ.5,500 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించిన మోదీ; ప్రతిపక్షాలపై పరోక్ష విమర్శలు  నరేంద్ర మోదీ
    గుజరాత్‌లో రూ.4400 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభించిన ప్రధాని మోదీ  నరేంద్ర మోదీ
    విద్వేషపూరిత ప్రసంగం, జమాన్ పార్క్ హింస కేసుల్లో ఇమ్రాన్ ఖాన్‌కు బెయిల్ పాకిస్థాన్

    నరేంద్ర మోదీ

    ఈ నెలలోనే కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్న ప్రధాని మోదీ ప్రధాన మంత్రి
    మోదీ కంటే ముందు రాహుల్ అమెరికా పర్యటన; 10రోజులు అక్కడే  రాహుల్ గాంధీ
    జీ7 సదస్సు కోసం నేడు జపాన్‌కు మోదీ; ప్రధాని ఎజెండాలోని అంశాలు ఇవే  ప్రధాన మంత్రి
    జపాన్‌: హిరోషిమాలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ  జపాన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025