NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / MUDA Scam: ముడా కేసులో మరో 92కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసిన ED.. మొత్తం జప్తు విలువ రూ.400 కోట్లు
    తదుపరి వార్తా కథనం
    MUDA Scam: ముడా కేసులో మరో 92కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసిన ED.. మొత్తం జప్తు విలువ రూ.400 కోట్లు
    ముడా కేసులో మరో 92కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసిన ED..

    MUDA Scam: ముడా కేసులో మరో 92కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసిన ED.. మొత్తం జప్తు విలువ రూ.400 కోట్లు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jun 10, 2025
    03:40 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (MUDA) భూముల కేటాయింపులో చోటుచేసుకున్న భారీ కుంభకోణానికి సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) తన దర్యాప్తును వేగంగా కొనసాగిస్తోంది.

    ఈ వ్యవహారంలో భాగంగా,దాదాపు రూ.100కోట్ల మార్కెట్ విలువ ఉన్న 92ఆస్తులను ఈడీ తాత్కాలికంగా స్వాధీనం చేసుకుంది.

    ఇప్పటివరకు మొత్తం రూ.400 కోట్ల విలువైన ఆస్తులు ఈ కేసులో సీజ్ చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

    ఈడీ వెల్లడించిన సమాచారం ప్రకారం,స్వాధీనం చేసుకున్న ఆస్తులన్నీ సహకార సంఘాల పేరుతో నమోదయ్యాయని, వాస్తవానికి అవి MUDA అధికారులు సహా రాజకీయంగా ప్రభావశీలుల బినామీల పేరిట ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి.

    ఏజెన్సీ అధికారికంగా పేర్కొన్న వివరాల ప్రకారం, సీజ్ చేసిన ఆస్తుల మార్కెట్ విలువ మొత్తం రూ.400 కోట్లకు సమానం.

    వివరాలు 

     MUDA భూముల కేటాయింపు ప్రక్రియలో భారీగా అక్రమాలు 

    ఈ దర్యాప్తు ప్రస్తుత కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సహా ఇతరులపై మైసూర్‌లో లోకాయుక్త పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా జరుగుతోంది.

    ఎఫ్‌ఐఆర్‌లో 1860 నాటి భారత శిక్షాస్మృతి (IPC)తో పాటు,1988 నాటి అవినీతి నిరోధక చట్టంలోని పలు విభాగాలు వర్తిస్తున్నాయి.

    ఈ దర్యాప్తులో MUDA భూముల కేటాయింపు ప్రక్రియలో భారీగా అక్రమాలు జరిగాయని ఈడీ గుర్తించింది.

    మాజీ MUDA కమిషనర్ జీటీ దినేష్ కుమార్ సహా పలు కీలక అధికారులపై అనర్హులైన వ్యక్తులకు, అర్హత లేని సంస్థలకు భూములను పరిహారంగా కేటాయించడంలో కీలక పాత్ర వహించినట్టు ఈడీ అధికార వర్గాలు తెలిపాయి.

    ఈ వ్యవహారానికి సంబంధించి జరిగిన అక్రమ లావాదేవీలకు సంబంధించిన పలు సాక్ష్యాలను కేంద్ర దర్యాప్తు సంస్థ సేకరించినట్లు సమాచారం.

    వివరాలు 

    విజయనగర్ ప్రాంతంలో మొత్తం 14 ప్లాట్ల కేటాయింపు 

    కేసుకు మూలం మైసూర్ MUDA పరిధిలోని కేసరే గ్రామంలో ఉన్న 3.2 ఎకరాల భూమికి సంబంధించింది.

    ఈ భూమిని 2010లో మల్లికార్జున స్వామి అనే వ్యక్తి తన సోదరి పార్వతికి బహుమతిగా ఇచ్చారు.

    అనంతరం MUDA ఆ భూమిని సేకరించింది. భూమి సేకరణకు పరిహారం చెల్లించాలని కోరిన పార్వతికి, MUDA దక్షిణ మైసూర్‌లోని విజయనగర్ ప్రాంతంలో మొత్తం 14 ప్లాట్లను కేటాయించింది.

    ఈ ప్లాట్ల విలువ ఆమె భూమికి ఉన్న విలువను మించి ఉందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

    అలాగే, నియమాలకు విరుద్ధంగా భూమి కేటాయింపులు జరిగాయని తీవ్ర విమర్శలు వ్యక్తం చేస్తున్నాయి.

    మొత్తం భూ కుంభకోణం విలువ రూ.3000 కోట్లు నుంచి రూ.4000 కోట్ల వరకు ఉండొచ్చని ప్రతిపక్ష నేతలు చెబుతున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కర్ణాటక

    తాజా

    MUDA Scam: ముడా కేసులో మరో 92కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసిన ED.. మొత్తం జప్తు విలువ రూ.400 కోట్లు కర్ణాటక
    Cyber ​​criminals: సుప్రీంకోర్టు పేరుతో భారీ మోసం.. రిటైర్డ్ ఇంజనీర్ నుంచి కోటి 50 లక్షలు కాజేసిన సైబర్ కేటుగాళ్లు!  సుప్రీంకోర్టు
    Godavari Pushkaralu 2027: త్వరలో గోదావరి పుష్కరాలు.. ఇప్పటి నుంచి ఏర్పాట్లపై ఏపీ సర్కార్ దృష్టి  ఆంధ్రప్రదేశ్
    Foreign trips: భారతీయ పర్యాటకులకు శుభవార్త.. తక్కువ బడ్జెట్‌తో విదేశీ యాత్రలివే! థాయిలాండ్

    కర్ణాటక

    Karnataka: కర్ణాటక బీజేపీలో చీలికలు.. రాష్ట్ర అధ్యక్షుడిపై గోకాక్ ఎమ్మెల్యే ఘాటు విమర్శలు బీజేపీ
    Road Accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కు బోల్తా పడి 10 మంది దుర్మరణం రోడ్డు ప్రమాదం
    BDCC Bank: కర్ణాటకలోని సహకార బ్యాంకులో దోపిడీ.. బ్యాంక్ కస్టమర్ల ఖాతాల్లో నుంచి రూ.2.3 కోట్లు చోరీ భారతదేశం
    MUDA case: సీఎం సిద్ధరామయ్య భార్య, మంత్రి బైరతి సురేష్‌కు ఈడీ సమన్లు  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025