Anant Ambani: ప్రీ వెడ్డింగ్ ఈవెంట్లో అనంత్ స్పీచ్.. కన్నీళ్లు పెట్టుకున్న ముఖేష్ అంబానీ
గుజరాత్లోని జామ్నగర్లో జరిగిన ప్రీ వెడ్డింగ్ ఈవెంట్లో తన కుమారుడు అనంత్ అంబానీ తన ఆరోగ్య సమస్యల గురించి మాట్లాడటంతో రిలయన్స్ చైర్పర్సన్ ముకేష్ అంబానీ తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ల మూడు రోజుల గ్రాండ్ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ శుక్రవారం జామ్నగర్ వేదికగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో తన ప్రసంగంలో, అనంత్ అంబానీ తన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపాడు. తన చిన్నతనంలో ఆరోగ్యంతో తాను పడ్డ కష్టాల గురించి మాట్లాడాడు. కుమారుడి మాటలకు ముకేశ్ భావోద్వేగంతో కంటతడి పెట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ప్రపంచంలోని అత్యంత సంపన్నులతో సహా 1,000 కంటే ఎక్కువ మంది అతిథులు
"నన్ను సంతోషంగా ఉంచేందుకు మా అమ్మ ఎంతో చేశారు. నా జీవితం పూలపాన్పు కాదు, ఎన్నో ముళ్లు గుచ్చుకున్న బాధనూ అనుభవించా, నేను చిన్నప్పటి నుండి చాలా ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నాను, కానీ ఆ బాధను మర్చిపోయేలా నా తల్లిదండ్రులు ఎల్లప్పుడూ అండగా నిలిచారు. వారికి నేనెప్పుడూ రుణపడి ఉంటా" అని అనంత్ చెప్పారు. పొరుగు గ్రామాల నుండి వేలాది మంది ప్రజలకు ఈ వేడుకలకు ఆతిథ్యం ఇచ్చారు. వారికి గుజరాతీ రుచికరమైన వంటకాలను అందించారు. మూడు రోజుల ప్రధాన ఈవెంట్కు, ప్రపంచంలోని అత్యంత సంపన్నులతో సహా 1,000 కంటే ఎక్కువ మంది అతిథులు హాజరయ్యారు.శుక్రవారం నాడు, పాప్ స్టార్ రిహన్నా ఈ కార్యక్రమానికి హాజరై భారతదేశంలో మొదటిసారిగా ప్రదర్శన ఇచ్చింది.