NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Mumbai: గేట్‌వే ఆఫ్ ఇండియా సమీపంలో కువైట్ బోటు కలకలం..ముంబై పోలీసుల అదుపులో ముగ్గురు 
    తదుపరి వార్తా కథనం
    Mumbai: గేట్‌వే ఆఫ్ ఇండియా సమీపంలో కువైట్ బోటు కలకలం..ముంబై పోలీసుల అదుపులో ముగ్గురు 
    Mumbai: గేట్‌వే ఆఫ్ ఇండియా సమీపంలో కువైట్ బోటు కలకలం

    Mumbai: గేట్‌వే ఆఫ్ ఇండియా సమీపంలో కువైట్ బోటు కలకలం..ముంబై పోలీసుల అదుపులో ముగ్గురు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 07, 2024
    10:12 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ముంబై పోలీసుల పెట్రోలింగ్ బృందం మంగళవారం సాయంత్రం గేట్‌వే ఆఫ్ ఇండియా సమీపంలో అరేబియా సముద్రంలో కువైట్ నుండి వస్తున్న పడవను అడ్డగించింది.

    ఆ బోటులో ముగ్గురు తమిళనాడుకు చెందిన మత్స్యకారులున్నారు. వార్తా సంస్థ PTI ప్రకారం, పడవలో ఎలాంటి ఆయుధాలు లభ్యం కాలేదు.

    ఆంటోనీ, నిడిసో డిటో, విజయ్ ఆంటోనీగా గుర్తించబడిన ముగ్గురు వ్యక్తులు తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాకు చెందినవారు.

    ప్రస్తుతం వారు కొలాబా పోలీస్ స్టేషన్‌లో పోలీసుల అదుపులో ఉన్నారు. ఇంకా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయలేదు.

    ప్రస్తుతం,దొంగిలించబడిన కువైట్ బోట్ గేట్‌వే ఆఫ్ ఇండియా వద్ద సురక్షితంగా డాక్ చేయబడిందని, అరేబియా సముద్రం ద్వారా భారత జలాల్లోకి ప్రవేశించడానికి సంబంధించిన పరిస్థితులను అధికారులు పరిశీలిస్తున్నట్లు అధికారి తెలిపారు.

    Details 

    యజమాని నుండి పడవను దొంగలించిన ఖైదీలు 

    ఖైదీల ప్రకారం,ముగ్గురూ ఒక ఫిషింగ్ కంపెనీలో పనిచేస్తున్నారు. వారి యజమాని వారిని హింసిస్తున్నట్లు పేర్కొన్నారు.

    అంతేకాకుండా, జీతం చెల్లించకుండా ,కఠినంగా వ్యవహరించేవాడని, అందుకే వారు తమ యజమాని నుండి పడవను దొంగిలించామని పేర్కొన్నారు.

    తమ పాస్‌పోర్టులు జప్తు చెయ్యడంతో , దీంతో తమ యజమాని నౌకను దొంగిలించడం తప్ప మరో మార్గం లేకుండా పోయిందని మత్స్యకారులు తెలిపారు.

    సముద్ర గస్తీని తప్పించుకొని కువైట్ బోట్ గేట్‌వే ఆఫ్ ఇండియాకు ఎలా చేరిందనే చర్చనీయాంశంగా మారింది.

    Details 

    అనుమానాస్పద పడవ.. 26/11 ఉగ్రదాడి

    కోల్బా పోలీస్ స్టేషన్‌లోని సీనియర్ పోలీసు అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. బీచ్‌కు కొంచెం దూరంలో అరేబియా సముద్రంలో కదలికలు కనిపించడంతో భారత జలాల్లోకి అనుమానాస్పద బోట్‌ ప్రవేశించినట్లుగా వాచ్ టవర్ పేర్కొంది.

    దీంతో ముంబై పోలీసుల పెట్రోలింగ్ బృందం ఆ పడవను అడ్డగించి.. ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. వీరి ముగ్గురిపై కేసు నమోదు చేసి.. విచారణ ప్రారంభించారు.

    గేట్‌వే ఆఫ్ ఇండియా సమీపంలో అనుమానాస్పద పడవ కనిపించడం 26/11 ఉగ్రదాడిని గుర్తుకు తెచ్చింది.

    నవంబర్ 2008లో ముంబైలో ఉగ్రదాడులకు పాల్పడిన పది మంది పాకిస్తానీ ఉగ్రవాదులు సముద్ర మార్గం నుంచి రావడం గమనార్హం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ముంబై

    తాజా

    Donald Trump: ఆపిల్ సహా విదేశీ ఫోన్లపై ట్రంప్ భారీ సుంకాల ప్రకటన అమెరికా
    Monsoon: నేడు కేరళలోకి రుతుపవనాల ప్రవేశం.. దేశవ్యాప్తంగా వర్ష సూచన నైరుతి రుతుపవనాలు
    Hyderabad Metro: హైదరాబాద్‌ మెట్రోలో టికెట్లపై 10% రాయితీ నేటి నుంచే హైదరాబాద్
    SRH vs RCB: ఆర్సిబి కి షాక్ .. 42 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలుపు  ఐపీఎల్

    ముంబై

    వంటగదిలో ఎలుకలు, బొద్దింకలు.. ఫేమస్ కబాబ్ రెస్టారెంట్‌‌ను మూసివేసిన ఎఫ్‌డీఏ  మహారాష్ట్ర
    Online EOW Scam: రూ. 1,000 కోట్ల స్కామ్‌లో బాలీవుడ్ యాక్టర్ గోవింద  బాలీవుడ్
    ముంబై: రన్‌వే కూలిపోయిన ప్రైవేట్ జెట్.. 8మందికి గాయాలు  విమానాశ్రయం
    భారత స్టార్టప్‌లకు ఆర్థిక సాయం చేసేందుకు జేపీ మోర్గాన్ ప్లాన్  అమెరికా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025