NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Bombay High Court: ప్రజలను వేధించకూడదు,చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు.. EDకి రూ.లక్ష జరిమానా విధించిన హైకోర్టు
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Bombay High Court: ప్రజలను వేధించకూడదు,చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు.. EDకి రూ.లక్ష జరిమానా విధించిన హైకోర్టు
    EDకి రూ.లక్ష జరిమానా విధించిన హైకోర్టు

    Bombay High Court: ప్రజలను వేధించకూడదు,చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు.. EDకి రూ.లక్ష జరిమానా విధించిన హైకోర్టు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 22, 2025
    09:18 am

    ఈ వార్తాకథనం ఏంటి

    బాంబే హైకోర్టు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

    ఒక వ్యక్తిపై అనవసరంగా మనీలాండరింగ్ కేసును నమోదు చేసినందుకు ఈడీపై ఘాటుగా స్పందిస్తూ లక్ష రూపాయల జరిమానా విధించింది.

    స్పష్టమైన కారణం లేకుండా రియల్ ఎస్టేట్ డెవలపర్‌పై మనీలాండరింగ్ దర్యాప్తును చేపట్టిన ఈడీపై చర్య తీసుకోవాల్సిన అవసరం ఉందని హైకోర్టు స్పష్టం చేసింది.

    కేంద్ర సంస్థలు చట్ట పరిధిలో మాత్రమే పని చేయాలని, పౌరులను అనవసరంగా వేధించడం తగదని హైకోర్టు హెచ్చరించింది.

    చట్ట అమలు సంస్థలకు సరిఅయిన సందేశం పంపాల్సిన అవసరం ఉందని జస్టిస్ మిలింద్ జాదవ్ నేతృత్వంలోని సింగిల్ బెంచ్ అభిప్రాయపడింది.

    వివరాలు 

    విలే పార్లే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదు 

    వివరాల్లోకి వెళితే, రాకేష్ జైన్ అనే రియల్ ఎస్టేట్ డెవలపర్‌పై నిబంధనల ఉల్లంఘన, మోసం ఆరోపణలతో ఒక ఆస్తి కొనుగోలుదారు ఫిర్యాదు చేశారు.

    ఈ ఫిర్యాదు విలే పార్లే పోలీస్ స్టేషన్‌లో నమోదైంది. దీనిపై ఆధారంగా ఈడీ రాకేష్ జైన్‌పై మనీలాండరింగ్ కేసును నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది.

    ఈ కేసు 2014 ఆగస్టులో మొదలైంది. ఆ సమయంలో ఈడీ ప్రత్యేక కోర్టులో ప్రాసిక్యూషన్ దాఖలు చేయగా, కోర్టు నోటీసు జారీ చేసింది.

    అయితే, ఈ కేసు సంబంధించి మంగళవారం (జనవరి 21) బాంబే హైకోర్టు రాకేష్ జైన్‌పై ప్రత్యేక కోర్టు జారీ చేసిన నోటీసును రద్దు చేసింది.

    వివరాలు 

    ఈడీ చర్యలు దురుద్దేశంతో జరిగాయి

    జస్టిస్ జాదవ్ పేర్కొన్నట్లు, ఈ కేసు మనీలాండరింగ్ నిరోధక చట్టం అమలు పేరుతో వేధింపులుగా కనిపిస్తోందన్నారు.

    ఈడీ చర్యలు దురుద్దేశంతో జరిగాయని ఇది స్పష్టమని హైకోర్టు తేల్చి చెప్పింది.

    కేంద్ర సంస్థలు చట్ట పరిధిని దాటి వ్యవహరించడం తగదని, ఇలాంటి చర్యలతో పౌరులను వేధించడం కఠినంగా శిక్షార్హమని హైకోర్టు స్పష్టం చేసింది.

    చట్టాన్ని అమలు చేసే సంస్థలు తమ అధికారాలను దుర్వినియోగం చేయకుండా నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన బాధ్యత ఉందని హైకోర్టు తేల్చి చెప్పింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మహారాష్ట్ర

    తాజా

    Cannes 2025: కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో అదిరిపోయిన జాన్వీకపూర్‌ లుక్.. ఫొటోలు వైరల్‌ జాన్వీ కపూర్
    Golden Temple: స్వర్ణ దేవాలయంలో గగనతల రక్షణ తుపాకుల మోహరింపు వార్తలు.. ఖండించిన భారత సైన్యం అమృత్‌సర్
    Gold Rates: ఒక్కరోజులోనే షాక్.. బంగారం ధర రూ.2,400 పెంపు బంగారం
    MI vs DC: వర్షం కురిసే అవకాశం.. ముంబై vs ఢిల్లీ మ్యాచ్‌పై ఉత్కంఠ ముంబయి ఇండియన్స్

    మహారాష్ట్ర

    Defamation Notice: ఖర్గే, రాహుల్ గాంధీ, శ్రీనేట్‌లకు రూ.100 కోట్ల పరువునష్టం నోటీసులు భారతదేశం
    Maharashtra and Jharkhand elections: మహారాష్ట్ర, ఝార్ఖండ్‌లో ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ.. కౌంటింగ్ ప్రారంభం జార్ఖండ్
    Maharashtra and Jharkhand elections: మహారాష్ట్రలో మహాయతి దూకుడు.. జార్ఖండ్ లో బీజేపీ ముందంజ జార్ఖండ్
    Maharashtra results: 72 గంటల డెడ్‌లైన్.. మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వంపై ఉత్కంఠ! ఇండియా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025