NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Nadendla Manohar: రైతు సేవా కేంద్రాలు, రైస్‌మిల్లుల మధ్య ధాన్యం తేమ శాతంలో తేడా వస్తే చర్యలు: నాదెండ్ల మనోహర్‌ 
    తదుపరి వార్తా కథనం
    Nadendla Manohar: రైతు సేవా కేంద్రాలు, రైస్‌మిల్లుల మధ్య ధాన్యం తేమ శాతంలో తేడా వస్తే చర్యలు: నాదెండ్ల మనోహర్‌ 
    రైతు సేవా కేంద్రాలు, రైస్‌మిల్లుల మధ్య ధాన్యం తేమ శాతంలో తేడా వస్తే చర్యలు: నాదెండ్ల మనోహర్‌

    Nadendla Manohar: రైతు సేవా కేంద్రాలు, రైస్‌మిల్లుల మధ్య ధాన్యం తేమ శాతంలో తేడా వస్తే చర్యలు: నాదెండ్ల మనోహర్‌ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 19, 2025
    08:39 am

    ఈ వార్తాకథనం ఏంటి

    రైతు సేవా కేంద్రాలు,రైస్‌మిల్లుల మధ్య ధాన్యం తేమ శాతంలో వ్యత్యాసం వస్తే తగిన చర్యలు తీసుకుంటామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.

    మంగళవారం విజయవాడలోని పౌర సరఫరాల శాఖ కార్యాలయంలో ఆయన రైస్‌మిల్లర్లతో సమావేశం నిర్వహించారు.

    'ఖరీఫ్ సీజన్‌లో ఇప్పటివరకు 5.21 లక్షల మంది రైతుల నుండి 32 లక్షల టన్నుల ధాన్యం సేకరించాం. ఈ ధాన్యం కోసం రూ.7,522 కోట్లు చెల్లించాం, ఇందులో 24 గంటల్లోనే రూ.7,508 కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశాం. ధాన్యం సేకరణ ప్రక్రియలో 30 వేల లారీలు, 37 వేల మంది హమాలీలు పాల్గొన్నారు. తొలిసారిగా వాట్సాప్ ద్వారా ఈ ప్రక్రియ నిర్వహించడం జరిగింది' అని మంత్రి వివరించారు.

    వివరాలు 

    ఏఐ ఆధారిత సీసీ కెమెరాలతో భద్రత పెంపు 

    రాష్ట్రంలోని వ్యవసాయ ఉత్పత్తుల నిల్వ, రవాణా, భద్రతను మరింత మెరుగుపరిచే లక్ష్యంతో ప్రైవేటు గోదాముల వద్ద ఏఐ ఆధారిత సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి మనోహర్ తెలిపారు.

    ఈ సందర్భంగా మంగళవారం ప్రైవేటు గోదాముల నిర్వాహకులతో ఆయన సమావేశమయ్యారు.

    93 లక్షల గ్యాస్ సిలిండర్ల పంపిణీ - రూ.714.57 కోట్లు లబ్ధిదారులకు జమ

    దీపం 2.0 పథకం కింద ఇప్పటివరకు 93 లక్షల ఎల్‌పీజీ సిలిండర్లు పంపిణీ చేసినట్లు మంత్రి మనోహర్ ప్రకటించారు.

    లబ్ధిదారుల ఖాతాల్లో మొత్తం రూ.714.57 కోట్లు జమ చేశామని తెలిపారు.ఎల్‌పీజీ డీలర్ల సమావేశంలో మాట్లాడిన ఆయన,ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తిచేయాలని,గ్యాస్ డెలివరీ చేసే వ్యక్తులు లబ్ధిదారుల నుంచి అదనపు చెల్లింపులు తీసుకోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నాదెండ్ల మనోహర్‌

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    నాదెండ్ల మనోహర్‌

    Nadendla Manohar: బియ్యం అక్రమ రవాణా అడ్డుకునేందుకు కఠిన చర్యలు .. బాధ్యులపై పీడీ యాక్టు ప్రయోగం భారతదేశం
    Nadendla Manohar: దుష్ప్రచారానికి ప్రాధాన్యత ఇవ్వొద్దు.. పార్టీ నాయకులకు నాదెండ్ల సూచన పవన్ కళ్యాణ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025