NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Nagababu: ఎమ్మెల్యే కోటాలో  ఎమ్మెల్సీగా నాగబాబు!
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Nagababu: ఎమ్మెల్యే కోటాలో  ఎమ్మెల్సీగా నాగబాబు!

    Nagababu: ఎమ్మెల్యే కోటాలో  ఎమ్మెల్సీగా నాగబాబు!

    వ్రాసిన వారు Sirish Praharaju
    Mar 04, 2025
    08:38 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్ సోమవారం అసెంబ్లీలోని సీఎం ఛాంబర్‌లో సమావేశమయ్యారు.

    ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు సహా వివిధ అంశాలపై గంట పాటు ఇద్దరూ చర్చించారు.

    ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు, అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన విషయాలపై కొద్దిసేపు చర్చ జరిగింది. జరగనున్న ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకటి నాగబాబుకు కేటాయించినట్లు నిర్ణయించారు.

    శాసనసభలో సీఎం చంద్రబాబు తన స్థానంలో కూర్చొని ఉండగా, పవన్‌ కల్యాణ్‌ ఆయన వద్దకు వెళ్లి పలకరించారు.

    ఈ సందర్భంగా ఇద్దరూ పక్కపక్కనే కూర్చొని కొద్దిసేపు చర్చించారు. అనంతరం కలిసి సీఎం ఛాంబర్‌కు వెళ్లారు.

    వివరాలు 

    తల్లికి వందనం, అన్నదాతా సుఖీభవ పథకాలపై  చర్చ 

    రాష్ట్ర బడ్జెట్‌లో వివిధ శాఖలకు కేటాయింపులపై పవన్‌ కల్యాణ్‌ తన అభిప్రాయాలను వ్యక్తపరిచారు.

    అభివృద్ధి,సంక్షేమ పథకాల కోసం సమతూకంగా నిధులు కేటాయించారని పేర్కొన్నారు.

    మే నెల నుండి ప్రారంభించనున్న తల్లికి వందనం, అన్నదాతా సుఖీభవ పథకాలపై కూడా ఇద్దరి మధ్య చర్చ జరిగింది.

    పంచాయతీరాజ్‌ శాఖ ద్వారా రహదారుల అభివృద్ధి పనులు పూర్తయిన విషయాన్ని డిప్యూటీ సీఎం వివరించారు.

    తాగునీటి సరఫరాపై అధిక దృష్టి సారించినట్లు తెలిపారు.

    ఉపాధి హామీ ద్వారా రాష్ట్రానికి ఎక్కువ నిధులు తీసుకురావడంతో పాటు పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టాల్సిన అవసరంపై చర్చించారు.

    వివరాలు 

    రాష్ట్ర అభివృద్ధికి ఉపాధి, ఉద్యోగ కల్పన ప్రధాన లక్ష్యం

    రాష్ట్రంలో ఉద్యోగ కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని పవన్‌ కల్యాణ్‌ సూచించారు.

    గత ప్రభుత్వ హయాంలో పెట్టుబడిదారులు రాష్ట్రాన్ని వదిలి వెళ్లిపోయిన కారణంగా, ఇప్పుడు వారిని తిరిగి ఆకర్షించేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు చంద్రబాబు వివరించారు.

    పెట్టుబడిదారులతో చర్చలు జరుపుతూ, రాష్ట్ర అభివృద్ధికి ఉపాధి, ఉద్యోగ కల్పన ప్రధాన లక్ష్యంగా కొనసాగుతున్నట్లు తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    Starlink Kit: స్టార్‌లింక్‌ సర్వీస్‌కు ముందు భారీ ఖర్చు.. కిట్ ధర ఎంతంటే? స్టార్‌లింక్‌
    Sundar Pichai: గూగుల్ తర్వాత సీఈఓ ఎవరు? సుందర్ పిచాయ్ ఏం చెప్పారంటే? గూగుల్
    Maganti Gopinath : జూబ్లీహిల్స్ గోపినాథ్ కన్నుమూత.. నిర్మాతగా ఆయన తీసిన సినిమాలివే! జూబ్లీహిల్స్
    Telangana Cabinet: తెలంగాణ కేబినెట్‌ విస్తరణ.. ముగ్గురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం తెలంగాణ

    ఆంధ్రప్రదేశ్

    Andhrapradesh: ఏపీలోని పలు వర్సిటీలకు వైస్‌ ఛాన్సలర్ల నియామకం.. నోటిఫికేషన్‌ విడుదల చేసిన గవర్నర్‌  భారతదేశం
    National Highway 165 Update: ఏపీలో మరో నేషనల్ హైవే.. భీమవరం బైపాస్‌కు లైన్ క్లియర్  భారతదేశం
    Andhra Pradesh: నూజివీడు వద్ద పౌల్ట్రీ పరిశ్రమ ఏర్పాటు.. 500 మందికి ఉపాధి భారతదేశం
    AP FiberNet: ఏపీ ఫైబర్‌ నెట్‌లో భారీ మార్పులు.. ముగ్గురు ఉన్నతాధికారుల తొలగింపు! భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025