
Nagarjuna Sagar: నాగార్జునసాగర్ గేట్లు ఎత్తి నీటి విడుదల.. నిండు కుండలా జలాశయం
ఈ వార్తాకథనం ఏంటి
ఎగువ ప్రాంతాల నుండి భారీగా వస్తున్న వరద ప్రవాహం వల్ల నాగార్జునసాగర్ జలాశయం నిండుకుండలా మారింది. ఈ నేపథ్యంలో,ప్రాజెక్టు అధికారులు క్రస్ట్ గేట్లను ఎత్తి,పెద్ద మొత్తంలో నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ తో పాటు పలు ఉన్నతాధికారులు హాజరయ్యారు. జలాశయం పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 590 అడుగులు(312.04 టీఎంసీలు)కాగా,ప్రస్తుతం అది 586.60 అడుగులకు చేరుకుంది. గేట్లు ఎత్తిన దృష్ట్యా,ప్రాజెక్టు దిగువన ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరికలతో సూచనలు జారీ అయ్యాయి. 18 సంవత్సరాల విరామం తర్వాత,ఈసారి నెల రోజుల ముందుగానే నాగార్జునసాగర్ నుంచి నీటిని విడుదల చేయడం విశేషం.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
నాగార్జునసాగర్ క్రస్ట్ గేట్లు ఎత్తి నీటి విడుదల
తెరుచుకున్న #నాగార్జునసాగర్ గేట్లు 😍
— Hi Kollapur (@HiKollapur) July 29, 2025
ఇన్ఫ్లో: 2,01,743 క్యూసెక్కులు
అవుట్ఫ్లో: 1,00,000 క్యూసెక్కుల పైగా
నీటి నిల్వ: 305.5 TMC/ 312.05 TMC (98%)
ప్రాజెక్టు చరిత్రలో మొదటిసారి జులై మాసంలో 5 గేట్లు ఎత్తివేత 🌊😍#NagarjunaSagar pic.twitter.com/YTT7plAbx2