NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు /  ప్రాంతీయ ర్యాపిడ్ రైలు సర్వీస్ 'నమో భారత్'ను ప్రారంభించిన ప్రధాని
    తదుపరి వార్తా కథనం
     ప్రాంతీయ ర్యాపిడ్ రైలు సర్వీస్ 'నమో భారత్'ను ప్రారంభించిన ప్రధాని

     ప్రాంతీయ ర్యాపిడ్ రైలు సర్వీస్ 'నమో భారత్'ను ప్రారంభించిన ప్రధాని

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 20, 2023
    12:27 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఉత్తర్‌ప్రదేశ్ లో భారతదేశపు మొట్టమొదటి సెమీ-హై స్పీడ్ ప్రాంతీయ రైలు సర్వీస్ 'నమో భారత్'ను ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు జెండా ఊపి ప్రారంభించారు.

    సాహిబాబాద్‌,దుహై మధ్య 17కి.మీల ప్రాధాన్యత కలిగిన కారిడార్‌లో ర్యాపిడ్‌ఎక్స్‌ రైలును ప్రధాని నరేంద్ర మోదీ పచ్చజెండా ఊపి ప్రారంభించారు.

    దింతో భారతదేశంలో మొట్టమొదటి ప్రాంతీయ ర్యాపిడ్ రైలు సర్వీస్(RRTS)ప్రారంభం అయ్యింది.

    నమో భారత్ ఒక పరివర్తన ప్రాంతీయ అభివృద్ధి కార్యక్రమం,ఇది ఇంటర్‌సిటీ కమ్యూటింగ్ కోసం హై-స్పీడ్ రైళ్లను అందించడానికి రూపొందించబడిందని ప్రధాన మంత్రి కార్యాలయం (PMO) తెలిపింది.

    రైల్ సర్వీస్ పేరు RapidX నుండి NaMo Bharat గా మార్చబడింది.

    Details 

    ఢిల్లీ నుండి మీరట్‌కు ఒక గంట ప్రయాణం 

    సాహిబాబాద్,ఘజియాబాద్‌, గుల్దర్‌, దుహై, దుహై డిపో మీదుగా మొత్తం 5 స్టేషన్ మీదుగా ఈ రైలు ప్రయాణిస్తుంది.

    ప్రతి రైలులో 2×2 లే అవుట్‌లో సీట్లు, నిల్చునేందుకు విశాలమైన ప్రదేశం, లగేజ్‌ ర్యాక్‌లు, సీసీటీవీ కెమెరాలతో పాటు అత్యవసరమైన డోర్‌ ఓపెనింగ్‌ మెకానిజం, మొబైల్‌ ఛార్జింగ్‌ పాయింట్లు, డైనమిక్ రూట్‌ మ్యాప్‌లు, ఆటో కంట్రోల్ యాంబియంట్ లైటింగ్ సిస్టమ్, హీటింగ్ వెంటిలేషన్, ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ తదితర సౌకర్యాలు ఉన్నాయి.

    ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ కారిడార్ ₹ 30,000 కోట్ల కంటే ఎక్కువ వ్యయంతో అభివృద్ధి చేయబడింది.

    ఘజియాబాద్, మురాద్‌నగర్,మోదీనగర్ పట్టణ కేంద్రాల ద్వారా ఢిల్లీ నుండి మీరట్‌కు ఒక గంట కంటే తక్కువ సమయంలో ప్రయాణించవచ్చని PMO తెలిపింది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    జెండా ఊపి 'నమో భారత్' ప్రారంభించిన మోదీ 

    "PM Modi Inaugurates India's First RapidX Train, Unveils NaMo Bharat, Connecting Sahibabad to Duhai in Landmark RRTS Launch."#NamoBharat #RapidXTrain#NarendraModi #PMModi#Sahibabad#Duhai pic.twitter.com/KWtqret0bu

    — Incredible Bharat Now (@IBharatNow) October 20, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ

    తాజా

    Miss World 2025: మిస్ వరల్డ్ 2025 విజేతగా థాయ్‌లాండ్ యువతి థాయిలాండ్
    Kubera : 'కుబేర' నుంచి మరో మ్యూజికల్ ట్రీట్.. సెకండ్ సింగిల్‌కు డేట్ ఫిక్స్! కుబేర
    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి

    నరేంద్ర మోదీ

    ఫాక్స్‌కాన్ సంచలన ప్రకటన.. వచ్చే ఏడాది ప్రధాని మోదీకి అపూర్వ బహుమతి తైవాన్
    Women's Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం  మహిళ
    చారిత్రక సందర్భం.. అధికారికంగా భారత పార్లమెంట్‌గా మారిన కొత్త భవనం  పార్లమెంట్ కొత్త భవనం
    పాత పార్లమెంట్ సెంట్రల్ హాల్‌‌కు 'సంవిధాన్‌ సదన్‌' పేరు.. ప్రధాని మోదీ ప్రతిపాదన  పార్లమెంట్ కొత్త భవనం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025