NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Nandini milk: అమూల్ కి పోటీగా దిల్లీ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న నందిని పాలు ..
    తదుపరి వార్తా కథనం
    Nandini milk: అమూల్ కి పోటీగా దిల్లీ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న నందిని పాలు ..
    Nandini milk: అమూల్ కి పోటీగా దిల్లీ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న నందిని పాలు ..

    Nandini milk: అమూల్ కి పోటీగా దిల్లీ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న నందిని పాలు ..

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 20, 2024
    05:02 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కర్ణాటక రాష్ట్రానికి చెందిన ప్రముఖ డెయిరీ బ్రాండ్‌ "నందిని" దిల్లీ మార్కెట్‌లోకి ప్రవేశించేందుకు సిద్ధమైంది.

    ఈ నెల 21న ఈ బ్రాండ్‌ దిల్లీ వినియోగదారుల కోసం పాలు, పెరుగు వంటి కొన్ని ఉత్పత్తులను విడుదల చేయనుంది.

    ఈనెల 21వ తేదీన ఆర్డర్‌లను ప్రారంభించి, దిల్లీ ప్రజలకు నందిని ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకురానుంది.

    అలాగే, బెంగళూరు మార్కెట్‌లో ఉన్నఇడ్లీ, దోశ పిండిని కూడా అందుబాటులోకి తీసుకురానుందని కర్ణాటక మిల్క్‌ ఫెడరేషన్‌ ఎండీ ఎంకే జగదీష్‌ తెలిపారు.

    వివరాలు 

    పలు రాష్ట్రాలలో నందిని ఉత్పత్తులు

    ప్రస్తుతం కర్ణాటక, మహారాష్ట్ర, గోవా, హైదరాబాద్‌, చెన్నై, కేరళ వంటి రాష్ట్రాలలో నందిని ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి.

    ఇప్పుడు, దిల్లీలో అడుగుపెట్టి ఉత్తర భారతదేశంలో ప్రవేశించనుంది. ప్రస్తుతం, ఈ ప్రాంతాలలో అమూల్‌, మదర్‌ డెయిరీ, మధుసూదన్‌, నమస్తే ఇండియా వంటి బ్రాండ్లతో విపరీతమైన పోటీ ఉన్నది.

    ఇప్పుడు, నందిని ఈ బ్రాండ్లకు ప్రత్యామ్నాయం ఆఫర్ చేస్తూ, మార్కెట్‌లో పోటీకి దిగనుంది.

    ఈ మేరకు, మండ్య నుండి దిల్లీకి పాల సరఫరాకు సంబంధించి ట్యాంకర్ల కోసం టెండర్లను ఆహ్వానించారు.

    వివరాలు 

    నందిని నుండి  ఐడీ వంటి సంస్థలకు పోటీ 

    ఇంతకుముందు, కర్ణాటక ఎన్నికల సమయంలో, అమూల్‌, నందిని బ్రాండ్ల మధ్య రాజకీయ వివాదం నెలకొన్న విషయం తెలిసినదే.

    బెంగళూరు మార్కెట్‌లో అమూల్‌ ప్రవేశించినప్పుడు, కాంగ్రెస్‌ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది.

    దీనివల్ల నందిని బ్రాండ్‌ కు భవిష్యత్తులో సవాలు ఎదురయ్యే అవకాశం ఉందని ఆ పార్టీ అభిప్రాయపడింది.

    ఇప్పుడు, దిల్లీ మార్కెట్‌లోకి నందిని ప్రవేశించటం ఎంతో విశేషం. మరోవైపు, ఇడ్లీ, దోశ పిండిని విక్రయించడం ద్వారా ప్రైవేట్ కంపెనీలకు, ముఖ్యంగా ఐడీ వంటి సంస్థలకు పోటీ ఇచ్చే అవకాశముంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ

    తాజా

    Motivation: తలవంచిన రోజు ఉంటే.. తలెత్తే రోజు కూడా తప్పకుండా వస్తుంది! జీవనశైలి
    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్

    దిల్లీ

    Elections: జమ్ముకశ్మీర్,హర్యానా తర్వాత ఇప్పుడు ఈ రాష్ట్రాల్లో ఎన్నికలు.. త్వరలోనే ప్రకటన  ఎన్నికలు
    Delhi: నమ్‌కీన్ ప్యాకెట్లలో ₹2,000 కోట్ల కోట్ల డ్రగ్స్.. ఢిల్లీ వ్యక్తి అరెస్ట్ భారతదేశం
    Saibaba: దిల్లీ వర్సిటీ మాజీ ప్రొఫెసర్‌ సాయిబాబా కన్నుమూత ఇండియా
    Fire accident: దిల్లీ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం.. మంటలార్పుతున్న సిబ్బంది అగ్నిప్రమాదం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025