
Narayanpur project: తెరుచుకున్న నారాయణపూర్ గేట్లు.. జూరాల వైపు 50 వేల క్యూసెక్కుల విడుదల
ఈ వార్తాకథనం ఏంటి
కృష్ణా నదీ జలాల ప్రవాహం తగ్గిన వేళ.. ఎగువ నుంచి ప్రవహిస్తున్న నీరు క్రమంగా ప్రాజెక్టుల్లోకి చేరుతోంది.
కర్ణాటక రాష్ట్రంలోని ఆలమట్టి ప్రాజెక్టుకు ప్రస్తుతానికి 23 వేల క్యూసెక్కులు, నారాయణపూర్కు 34 వేల క్యూసెక్కుల నీరు వచ్చేస్తోంది.
నారాయణపూర్ ప్రాజెక్టు గేట్లను అధికారులు ఎత్తి వేసి జూరాల దిశగా 50 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
ఇందులో స్పిల్వే గేట్ల ద్వారా 44 వేల క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ద్వారా 6 వేల క్యూసెక్కులు నదిలోకి వదిలారు.
కాగా, నారాయణపూర్ జలాశయ సామర్థ్యం మొత్తం 37.64 టీఎంసీలు కాగా, ప్రస్తుతం అందులో 31.47 టీఎంసీల నీరు నిల్వగా ఉంది.
Details
నిండిపోయిన జూరాల ప్రాజెక్టు
ఇక శ్రీశైలానికి ఎగువ నుంచి 34,819 క్యూసెక్కుల నీరు వస్తోంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టు ఇప్పటికే నిండిపోయింది.
ప్రస్తుతానికి ఆ ప్రాజెక్టుకు 6 వేల క్యూసెక్కుల నీరు వచ్చేస్తుండగా.. దాని నుంచి 31 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు.
తుంగభద్ర నదిపై ఉన్న సుంకేశుల బ్యారేజ్ నుంచి, జూరాల ద్వారా ప్రవహిస్తున్న కృష్ణా జలాలు శ్రీశైలానికి చేరుతున్నాయి.
ఇక వాతావరణశాఖ తాజా అంచనాల ప్రకారం.. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Details
పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు
సోమవారం నుంచి బుధవారం వరకు ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో వర్షాలు పడే సూచనలు కనిపిస్తున్నాయి.
వీటి నేపథ్యంలో ఈ జిల్లాలన్నింటికీ పసుపు రంగు హెచ్చరికలు జారీ చేసింది. శనివారం నుంచి ఆదివారం ఉదయం వరకు రాష్ట్రంలో భారీ వర్షాలు నమోదయ్యాయి.
ములుగు జిల్లాలోని వెంకటాపూర్లో 9 సెం.మీ., కుమురం భీం ఆసిఫాబాద్లో 7 సెం.మీ., వాంకిడిలో 5 సెం.మీ., భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో 4 సెం.మీ. వర్షపాతం నమోదైంది.
పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి.