NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / INDIA bloc protest: ఎంపీల సస్పెన్షన్‌కు వ్యతిరేకంగా నేడు భారత కూటమి దేశవ్యాప్త నిరసన 
    తదుపరి వార్తా కథనం
    INDIA bloc protest: ఎంపీల సస్పెన్షన్‌కు వ్యతిరేకంగా నేడు భారత కూటమి దేశవ్యాప్త నిరసన 
    ఎంపీల సస్పెన్షన్‌కు వ్యతిరేకంగా నేడు భారత కూటమి దేశవ్యాప్త నిరసన

    INDIA bloc protest: ఎంపీల సస్పెన్షన్‌కు వ్యతిరేకంగా నేడు భారత కూటమి దేశవ్యాప్త నిరసన 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 22, 2023
    09:25 am

    ఈ వార్తాకథనం ఏంటి

    పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా "అప్రజాస్వామిక పద్ధతిలో" పార్లమెంట్ నుండి చారిత్రాత్మక సంఖ్యలో MPలను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ ప్రతిపక్ష నేతృత్వంలోని ఇండియా కూటమి పిలుపు మేరకు ఇవాళ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వామపక్షాలు, కాంగ్రెస్‌, ఆమ్‌ఆద్మీ పార్టీలు ప్రకటించాయి.

    ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో ఉదయం 11 గంటలకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే,పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ,ఇతర కూటమి సభ్యులు ప్రసంగించనున్నారు.

    ఇదిలావుండగా,అన్ని జిల్లా కేంద్రాల్లో దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నట్లు ఖర్గే తెలిపారు.

    Details 

    రికార్డు స్థాయిలో 146 మంది పార్లమెంట్ సభ్యుల సస్పెన్షన్ 

    డిసెంబరు 13న లోక్‌సభ గ్యాలరీలోకి కొందరు అగంతకులు సందర్శకులుగా ప్రవేశించి, పొగబాంబులు వదిలి అలజడి సృష్టించిన ఘటనలో భద్రతా వైఫల్యాలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని ఎంపీలు డిమాండ్‌ చెయ్యడంతో లోక్‌సభ,రాజ్యసభ రెండింటిలోనూ సస్పెన్షన్‌ల పరంపర ఏర్పడింది.

    అయితే, పార్లమెంట్ నుంచి రికార్డు స్థాయిలో 146 మంది పార్లమెంట్ సభ్యులను స్పీకర్ ఓంబిర్లా సస్పెండ్ చేశారు.

    లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, రాజ్యసభ ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖర్‌ల చర్యకు నిరసనగా గురువారం సస్పెండ్‌ అయిన వారితో సహా ప్రతిపక్ష ఎంపీలు పార్లమెంట్‌ నుంచి విజయ్‌ చౌక్‌కు పాదయాత్ర నిర్వహించారు.

    అంతకుముందు నిరసన సందర్భంగా, బీజేపీకి ప్రజాస్వామ్యంపై విశ్వాసం లేదని ఆరోపిస్తూ "ప్రజాస్వామ్యంగా ప్రవర్తించాలని" ఖర్గే ప్రభుత్వాన్ని కోరారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఇండియా కూటమి

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    ఇండియా కూటమి

    అవిశ్వాసంపై నిర్మలా సీతారామన్ ప్రసంగం.. లోక్‌సభ నుంచి వాకౌట్  చేసిన విపక్షాలు  లోక్‌సభ
    ఇవాళ ఇండియా కూటమి మూడో  కీలక సమావేశం..ఖరారు కానున్న ప్రచార వ్యూహం, లోగో ముంబై
    ముంబై : ఇవాళ రెండో రోజు కొనసాగనున్న ఇండియా కూటమి కీలక సమావేశం ముంబై
    "సాధ్యమైనంత వరకు ఎన్నికలలో కలిసి పోటీ చేస్తాం": ఇండియా బ్లాక్ రిజల్యూషన్ భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025