NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Maharastra: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్.. సపోర్ట్ ఇచ్చిన ఎన్సీపీ చీఫ్
    తదుపరి వార్తా కథనం
    Maharastra: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్.. సపోర్ట్ ఇచ్చిన ఎన్సీపీ చీఫ్
    మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్.. సపోర్ట్ ఇచ్చిన ఎన్సీపీ చీఫ్

    Maharastra: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్.. సపోర్ట్ ఇచ్చిన ఎన్సీపీ చీఫ్

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 25, 2024
    01:44 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి అద్భుత విజయాన్ని సాధించింది.

    ఈ విజయం అనంతరం రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడానికి కూటమి నేతలు సన్నద్ధమయ్యారు.

    ఈ నేపథ్యంలో "ముఖ్యమంత్రి ఎవరు?" అనే ప్రశ్న ఇప్పుడు కీలకంగా మారింది.

    దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్‌నాథ్ షిండే వీరిద్దరూ సీఎం పదవి కోసం పోటీపడుతున్నారు, అందువల్ల ఎవరు సీఎం పీఠాన్ని దక్కించుకుంటారన్నది ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

    వివరాలు 

    దేవేంద్ర ఫడ్నవీస్ ను సీఎం చేయవద్దని వాదిస్తున్న బీజేపీలో కొందరు 

    ఈ క్రమంలో,మహారాష్ట్రలోని తదుపరి ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్‌ను అజిత్ పవార్ మద్దతు ఇచ్చారని సమాచారం.

    ఆదివారం జరిగిన సమావేశంలో ఫడ్నవీస్‌ను సీఎం చేసేందుకు అజిత్ పవార్,ఆయన ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటించినట్లు సమాచారం.

    288 సీట్లకు జరిగిన ఎన్నికల్లో మహాయుతి కూటమి 235 సీట్లు సాధించి ఘనవిజయం సాధించింది.

    అందులో బీజేపీ 132 సీట్లతో ప్రధాన పార్టీగా నిలిచింది. 145 సీట్లు సాధించాలంటే బీజేపీ దానికి చాలా దగ్గరగా ఉంది, ఈ నేపథ్యంలో, బీజేపీకి చెందిన దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి కావాలని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

    కానీ, బీజేపీ లోని కొంతమంది నేతలు మాత్రం ఏక్‌నాథ్ షిండేనే సీఎం కావాలని అభ్యర్థిస్తున్నారు. ఈ అస్థిరత 24 గంటల్లో సులభంగా వీడిపోయే అవకాశం ఉంది.

    వివరాలు 

     21 మంది మంత్రులతో కూడిన మంత్రివర్గం 

    ఇక మరోవైపు, శివసేన (షిండే వర్గం) నుండి మంత్రి దీపక్ కేసర్కర్ ప్రకటించారు.

    నేడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం చేస్తారని తెలుస్తోంది.

    మొదటి విడుతలో 21 మంది మంత్రులతో కూడిన మంత్రివర్గం ఏర్పడే అవకాశముందని సమాచారం.

    రాజ్యాంగ నిబంధనల ప్రకారం, 43 మంది మంత్రులు కేటాయించవచ్చు, అందులో 21 మంది బీజేపీ నుంచి, 12 మంది శివసేన (షిండే) నుండి, 10 మంది ఎన్సీపీ (అజిత్) నుండి మంత్రులుగా నియమించబడే అవకాశం ఉన్నట్లు సమాచారం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మహారాష్ట్ర

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    మహారాష్ట్ర

    Maharastra: నాసిక్‌లో ఫైరింగ్ ప్రాక్టీస్‌లో ఫీల్డ్ గన్ షెల్ పేలి.. ఇద్దరు అగ్నివీరులు మృతి భారతదేశం
    Baba Siddique: బాబా సిద్ధిఖీ హత్య.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌పై అనుమానాలు! ఇండియా
    Baba Siddique Murder: బాబా సిద్ధిక్ హత్య నిందితుడికి బోన్ ఆసిఫికేషన్ పరీక్ష.. ఏం తేలిందో తెలుసా? భారతదేశం
    Eknath Shinde: ముంబై వెళ్లే వాహనాల టోల్‌ ఫీజు వసూలుపై మహారాష్ట్ర సీఎం కీలక నిర్ణయం ముంబై
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025