NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / రసకందాయంలో ఎన్సీపీ వ్యవహారం; నేడు పోటాపోటీగా సమావేశం అవుతున్న శరద్ పవార్, అజిత్ వర్గాలు 
    తదుపరి వార్తా కథనం
    రసకందాయంలో ఎన్సీపీ వ్యవహారం; నేడు పోటాపోటీగా సమావేశం అవుతున్న శరద్ పవార్, అజిత్ వర్గాలు 
    రసకందాయంలో ఎన్సీపీ వ్యవహారం; నేడు పోటాపోటీగా సమావేశం అవుతున్న శరద్ పవార్, అజిత్ వర్గాలు

    రసకందాయంలో ఎన్సీపీ వ్యవహారం; నేడు పోటాపోటీగా సమావేశం అవుతున్న శరద్ పవార్, అజిత్ వర్గాలు 

    వ్రాసిన వారు Stalin
    Jul 05, 2023
    11:02 am

    ఈ వార్తాకథనం ఏంటి

    మహారాష్ట్రలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) సంక్షోభం రసకందాయంలో పడింది.

    ఎన్సీపీలోని శరద్ పవార్ వర్గం, అజిత్ పవార్ వర్గం బుధవారం ముంబైలో వేర్వేరుగా పోటీపోటీగా సమావేశమవుతున్నాయి.

    ఈ నేపథ్యంలో రెండు వర్గాలు తమ చీఫ్ విప్‌లను నియమించుకున్నాయి. సమావేశానికి హాజరు కావాలని విప్‌ను జారీ చేశాయి.

    శరద్ పవార్ వర్గం దక్షిణ ముంబైలోని వైబి చవాన్ సెంటర్‌లో మధ్యాహ్నం 1 గంటలకు సమావేశం కానుంది.

    అజిత్ పవార్ బృందం ఉదయం 11 గంటలకు సబర్బన్ బాంద్రాలోని ముంబై ఎడ్యుకేషన్ ట్రస్ట్ (ఎంఈటీ) ప్రాంగణంలో సమావేశమవుతుంది.

    ఎన్సీపీ

    ఎవరివైపు ఎంత మంది ఎమ్మెల్యేలు ఉన్నారన్న దానిపై క్లారిటీ 

    శరద్ పవార్ వర్గానికి చీఫ్ విప్‌గా పనిచేస్తున్న జితేంద్ర అవద్, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఆఫీస్ బేరర్‌లను సమావేశానికి హాజరు కావాలని విప్ జారీ చేశారు.

    అదే సమయంలో, అజిత్ పవార్ తన వర్గానికి చీఫ్ విప్‌గా అనిల్ పాటిల్‌ను నియమించారు. అతను సమావేశానికి రావాలని నాయకులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులను కోరారు.

    ఇన్నాళ్లు ఎవరివైపు ఎంతమంది ఉన్నారన్నది క్లారిటీ లేదు. ఈ రెండు సమావేశాలతో ఎవరివైపు ఎంత మంది ఎమ్మెల్యేలు ఉన్నారన్న వాస్తవ లెక్క తేలనుంది.

    ఎన్సీపీ

    వేటు తప్పించుకుకోవాలంటే అజిత్ పవార్‌కు 36మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం

    శివసేన- బీజేపీ క్యాబినెట్‌లో ఇటీవల ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన అజిత్ పవార్, మొత్తం 53 మంది ఎన్‌సీపీ ఎమ్మెల్యేలు తనకు మద్దతు ఇస్తున్నారని చెప్పారు.

    అయితే శరద్ పవార్ వర్గం దీనిని ఖండించింది. అజిత్ పవార్‌కు కేవలం 13మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉన్నదని శరద్ పవార్ వర్గం చెబుతోంది.

    మహారాష్ట్ర అసెంబ్లీలో 288 మంది సభ్యులు ఉన్నారు.

    ఇందులో ఎన్సీపీకి 53మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ క్రమంలో అజిత్ పవార్‌ ఫిరాయింపుల నిరోధక చట్టం పరిధిలోకి రాకుండా, అనర్హత వేటు తప్పించుకోవాలంటే అతనికి కనీసం 36 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం.

    ఎన్సీపీ

    నేటితో ఎన్సీపీ సంక్షోభానికి తెరపడుతుందా?

    ఇదిలా ఉంటే, తమకు 36మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, లేఖపై సంతకం కూడా చేశారని అజిత్ పవార్ వర్గం వాదిస్తోంది.

    బీజేపీ అయితే ఏకంగా అజిత్‌ వెంట 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెబుతోంది. మరోవైపు, మెజార్టీ ఎమ్మెల్యేలు సీనియర్ తమవైపే వైపే ఉన్నారని శరద్ పవార్ వర్గం వాదిస్తోంది.

    ఈ క్రమంలోనే శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ ఇప్పటికే అజిత్ పవార్, ఆయనతో పాటు మంత్రులుగా ప్రమాణం చేసిన ఎనిమిది మందిపై అనర్హత వేటు వేసేందుకు పిటిషన్‌ను దాఖలు చేసింది.

    ఇన్ని పరిణామాల నేపథ్యంలో నేడు జరిగే సమావేశాలకు విశేష ప్రాధాన్యతం ఉందనే చెప్పాలి. ఎన్సీపీలో రాజకీయ సంక్షోభానికి నేటితో తెర పడే అవకాశమూ లేకపోలేదు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ/ఎన్సీపీ
    మహారాష్ట్ర
    శరద్ పవార్
    అజిత్ పవార్

    తాజా

    CSK vs RR : చైన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజయం రాజస్థాన్ రాయల్స్
    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ

    నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ/ఎన్సీపీ

    రాజకీయ పార్టీల విరాళాల్లో 66శాతం అజ్ఞాత వ్యక్తులు ఇచ్చినవే: ఏడీఆర్ నివేదిక బీజేపీ
    ఈడీ, సీబీఐపై సుప్రీంకోర్టుకు వెళ్లిన 14రాజకీయ పార్టీలు; ఏప్రిల్ 5న విచారణ సుప్రీంకోర్టు
    ప్రతిపక్షాలకు ఎదురదెబ్బ; ఈడీ, సీబీఐపై దాఖలు చేసిన పిటిషన్‌ స్వీకరణకు సుప్రీంకోర్టు నిరాకరణ సుప్రీంకోర్టు
    సావర్కర్, అదానీలకు పవార్ మద్దతు; 'హిండెన్‌బర్గ్'పై జేపీసీ అనవసరమని వ్యాఖ్య శరద్ పవార్

    మహారాష్ట్ర

    ప్లాస్టిక్ సంచిలో కుళ్లిపోయిన మహిళ మృతదేహం; కుమార్తెపైనే అనుమానాలు ముంబై
    కుంభకోణంతో సంబంధం ఉన్న విరాట్ కోహ్లీ వదిలిపెట్టిన ఆడి R8 సూపర్‌కార్‌ ఆటో మొబైల్
    హెచ్3ఎన్2 వైరస్: మహారాష్ట్ర, దిల్లీలో హై అలర్ట్; దేశంలో 9కి చేరిన మరణాలు దిల్లీ
    కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆఫీస్‌కు బెదిరింపు కాల్స్; రూ.10 కోట్లు డిమాండ్ నితిన్ గడ్కరీ

    శరద్ పవార్

    అజిత్ పవార్ మళ్లీ ఎన్‌సీపీకి హ్యాండ్ ఇవ్వనున్నారా? బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారా? నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ/ఎన్సీపీ
    'అవి పుకార్లు మాత్రమే, నిజం కాదు'; బీజేపీలో చేరికపై క్లారిటీ ఇచ్చిన ఎన్‌సీపీ నేత అజిత్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ/ఎన్సీపీ
    శరద్ పవార్ రాజీనామా తిరస్కరణ.. అధ్యక్షుడిగా కొనసాగాలన్న ఎన్సీపీ కమిటీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ/ఎన్సీపీ
    ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్‌కు బెదిరింపు సందేశం  మహారాష్ట్ర

    అజిత్ పవార్

    మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా జితేంద్ర అవద్; అసలు ఆయన ఎవరో తెలుసా?  మహారాష్ట్ర
    బీజేపీతో పొత్తుపై 2022లోనే ఎన్సీపీలో చర్చ; తిరుగుబాటు నేత ప్రఫుల్ పటేల్ సంచలన వ్యాఖ్యలు  మహారాష్ట్ర
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025