NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Republic Day: రిపబ్లిక్ డే ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Republic Day: రిపబ్లిక్ డే ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో
    రిపబ్లిక్ డే ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో

    Republic Day: రిపబ్లిక్ డే ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 16, 2025
    05:23 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభోవా సుబియాంటో ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.

    ఈ విషయాన్ని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ గురువారం అధికారికంగా ప్రకటించింది.

    ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు, ఆయన రిపబ్లిక్ వేడుకలకు హాజరవుతారని తెలిపింది.

    ఇందులో భాగంగా ఇండోనేషియా అధ్యక్షుడు జనవరి 25, 26 తేదీల్లో భారతదేశాన్ని సందర్శించనున్నారు.

    2024 అక్టోబరులో ఇండోనేషియా అధ్యక్ష పదవిని చేపట్టిన తర్వాత ప్రభోవా సుబియాంటో భారతదేశాన్ని సందర్శించడం ఇదే తొలిసారి అని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.

    ఈ పర్యటన రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరచడంతో పాటు, ప్రాంతీయ, గ్లోబల్ సమస్యలపై చర్చించేందుకు అవకాశం కల్పిస్తుందని పేర్కొంది.

    వివరాలు 

    కరోనా కారణంగా గణతంత్ర వేడుకలకు అతిథులను ఆహ్వానించలేదు

    2020లో ఇండోనేషియా రక్షణ మంత్రిగా ఆయన న్యూఢిల్లీని సందర్శించినట్లు వివరించింది.

    1950 నుంచి భారతదేశం తన మిత్రదేశాల అధినేతలను గణతంత్ర దినోత్సవానికి ఆహ్వానించడం ఆనవాయితీగా వస్తోంది.

    అయితే, 1952, 1953, 1966ల్లో మాత్రమే విదేశీ అతిథులు లేకుండా వేడుకలు నిర్వహించారు.

    2024లో ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మక్రాన్, 2023లో ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా ఎస్-సిసిలను ముఖ్య అతిథులుగా ఆహ్వానించారు.

    2021, 2022ల్లో కరోనా కారణంగా గణతంత్ర వేడుకలకు అతిథులను ఆహ్వానించలేదు.

    2020లో బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో, 2019లో దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమాఫోసా ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

    వివరాలు 

    2018లో ఆసియా దేశాలకు చెందిన 10 మంది నాయకులు

    2018లో ఆసియా దేశాలకు చెందిన 10 మంది నాయకులు వచ్చారు.

    2017లో అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, 2016లో ఫ్రెంచ్ అప్పటి అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే, 2015లో అమెరికా అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా పాల్గొన్నారు.

    2007లో రష్యా అధ్యక్షుడు పుతిన్, 2008లో ఫ్రాన్స్ అధ్యక్షుడు నికోలస్ సర్కోజీ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    గణతంత్ర దినోత్సవం

    తాజా

    NEET PG 2025: నీట్-పీజీ 2025 వాయిదా - ఆగస్టు 3న పరీక్ష నిర్వహణకు సుప్రీంకోర్టు ఆమోదం  సుప్రీంకోర్టు
    2025 Suzuki V-Strom 800DE: భారత్ లో విడుదలైన 2025 సుజుకి V-స్ట్రోమ్ 800DE.. రూ.10,30,000 ఎక్స్-షోరూమ్ ధర ఆటో మొబైల్
    Elon Musk: కొత్త పార్టీ పెట్టేందుకు ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం.. మస్క్ పెట్టిన పోల్‌కు భారీ రెస్పాన్స్..  ఎలాన్ మస్క్
    Chenab bridge: ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ చినాబ్ వంతెన ప్రారంభించిన ప్రధాని మోదీ ..  నరేంద్ర మోదీ

    గణతంత్ర దినోత్సవం

    రిపబ్లిక్ డే వేళ.. దిల్లీలో ఖలిస్తానీ అనుకూల పోస్టర్ల కలకలం దిల్లీ
    ఛత్తీస్‌గఢ్‌: చరిత్రలో తొలిసారిగా రిపబ్లిక్ డే పరేడ్‌లో 'థర్డ్ జెండర్' సిబ్బంది ఛత్తీస్‌గఢ్
    రిపబ్లిక్ డే: మీ ఇంటి అలంకరణలో మూడు రంగులను ఇలా ఉపయోగించండి లైఫ్-స్టైల్
    రాజ్‌భవన్‌లోనే గవర్నర్ రిపబ్లిక్ డే వేడుకలు, రాష్ట్ర ప్రభుత్వం లేఖపై తమిళసై అసహనం తెలంగాణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025