NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Delhi: ఢిల్లీని కప్పేసిన దట్టమైన పొగమంచు .. 50 విమానాలు, 30 రైళ్లుపై స‌ర్వీసుల‌కు తీవ్ర అంత‌రాయం
    తదుపరి వార్తా కథనం
    Delhi: ఢిల్లీని కప్పేసిన దట్టమైన పొగమంచు .. 50 విమానాలు, 30 రైళ్లుపై స‌ర్వీసుల‌కు తీవ్ర అంత‌రాయం
    Delhi: ఢిల్లీని కప్పేసిన దట్టమైన పొగమంచు

    Delhi: ఢిల్లీని కప్పేసిన దట్టమైన పొగమంచు .. 50 విమానాలు, 30 రైళ్లుపై స‌ర్వీసుల‌కు తీవ్ర అంత‌రాయం

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 16, 2024
    10:49 am

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశ రాజధాని దిల్లీని మంగళవారం కూడా దట్టమైన పొగమంచు కమ్మేసింది. భారత వాతావరణ శాఖ ప్రకారం,దేశ రాజధాని సఫ్దర్‌జంగ్‌లో 4.8 డిగ్రీల సెల్సియస్, పాలంలో ఉష్ణోగ్రత 7.2 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.

    విజిబిలిటీ తగ్గిపోవడంతో, ఢిల్లీ నుంచి బయలుదేరే దాదాపు 30 విమానాలు ఆలస్యమవగా,మరో 17 విమానాలు రద్దయ్యాయని ఎయిర్‌పోర్టు వర్గాలను ఉటంకిస్తూ వార్తా సంస్థ ANI నివేదించింది.

    దాదాపు 30 రైళ్లు కూడా ఈరోజు ఢిల్లీకి ఆలస్యంగా చేరుకున్నాయి. ఇదిలా ఉండగా, మంగళవారం దట్టమైన పొగమంచు కారణంగా విమానాలు, రైలు కార్యకలాపాలపై ప్రభావం చూపడంతో ఢిల్లీ విమానాశ్రయం,రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులు వేచి ఉన్నారు.

    భారత వాతావరణ శాఖ ప్రకారం,"ఢిల్లీ పాలం (VIDP),సఫ్దర్‌జంగ్ విమానాశ్రయాలు ఈరోజు ఉదయం 500 మీటర్ల విజిబిలిటీని నివేదిస్తున్నాయి.

    Details 

    పొగమంచు కారణంగా, మూడు విమానాలు రద్దు

    ఢిల్లీ,ఉత్తరప్రదేశ్,హర్యానా, చండీగఢ్,పంజాబ్‌లలో రేపటి (మంగళవారం) వరకు చాలా దట్టమైన పొగమంచు కొనసాగుతుందని సోమవారం వాతావరణ శాఖ ఉదయం బులెటిన్ తెలిపింది.

    అంతేకాకుండా, మంగళవారం వరకు ఉత్తర భారతదేశం అంతటా చలి నుండి తీవ్రమైన చలి పరిస్థితులు కూడా అంచనా వేయబడ్డాయి.

    ఇక, ఉత్తర భారతదేశంలో దట్టమైన పొగమంచు కారణంగా, మూడు విమానాలు రద్దు చెయ్యగా , మరో మూడు చండీగఢ్‌లో ఆలస్యం అయ్యాయి.

    ఇదిలా ఉండగా, నగరంలోని ప్రాథమిక పాఠశాలలను జనవరి 20 తర్వాత మూసివేయాలని ఆదేశించారు.

    అయితే, 10, 11, 12 తరగతుల పాఠశాలలు ఉదయం 9.30 గంటల తర్వాత తెరుస్తారు.

    విపరీతమైన చలి పరిస్థితుల నేపథ్యంలో, పంజాబ్,హర్యానాలోని కొన్ని ప్రాంతాల్లో భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ

    తాజా

    DC vs GT: ఢిల్లీపై ఘన విజయం..ఫ్లే ఆఫ్స్‌కు చేరిన గుజరాత్ టైటాన్స్ గుజరాత్ టైటాన్స్
    KL Rahul: ఐపీఎల్‌లో సెంచరీతో పాటు మరో అరుదైన రికార్డు సాధించిన కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్
    PBKS vs RR: ధ్రువ్ జురెల్ పోరాటం వృథా.. పంజాబ్ చేతిలో రాజస్థాన్ ఓటమి రాజస్థాన్ రాయల్స్
    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్

    దిల్లీ

    Delhi: సత్యేందర్ జైన్‌పై అక్రమార్జన ఆరోపణలపై విచారణకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతిని కోరిన సీబీఐ  భారతదేశం
    Deepavali In Delhi: దిల్లీలో పతనమైన గాలి నాణ్యత.. 'తీవ్రమైన' కేటగిరీ నమోదు  వాయు కాలుష్యం
    Delhi :దిల్లీ ప్రధాన కార్యదర్శికి ఎసరు.. సీఎం కేజ్రీవాల్ కు 650 పేజీల లేఖ రాసిన మంత్రి కుంభకోణం
    చీఫ్ సెక్రటరీని తొలగించాలని దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌కు కేజ్రీవాల్ సిఫార్సు అరవింద్ కేజ్రీవాల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025