NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / NEET row: సంజీవ్ ముఖియా గ్యాంగ్ కు సైబర్ నేరగాళ్లతో అనుబంధం: బీహార్ పోలీసు
    తదుపరి వార్తా కథనం
    NEET row: సంజీవ్ ముఖియా గ్యాంగ్ కు సైబర్ నేరగాళ్లతో అనుబంధం: బీహార్ పోలీసు
    NEET row: సంజీవ్ ముఖియా గ్యాంగ్ కు సైబర్ నేరగాళ్లతో అనుబంధం: బీహార్ పోలీసు

    NEET row: సంజీవ్ ముఖియా గ్యాంగ్ కు సైబర్ నేరగాళ్లతో అనుబంధం: బీహార్ పోలీసు

    వ్రాసిన వారు Stalin
    Jun 25, 2024
    09:51 am

    ఈ వార్తాకథనం ఏంటి

    నీట్ పరీక్షా పత్రాలు లీక్ కావడానికి సంజీవ్ ముఖియా గ్యాంగ్ సైబర్ నేరగాళ్ల అనుబంధంతో టచ్‌లో ఉన్నట్లు బిహార్ పోలీసు ఆర్థిక నేరాల విభాగం వెల్లడించింది.

    ఆర్ధిక నేరాల విభాగం (EOU) ప్రకారం, NEET కేసులో జార్ఖండ్ నుండి అరెస్టయిన ఐదుగురిలో ముగ్గురు సైబర్ నేరస్థులు కూడా ఉన్నారు .

    పోలీసులు వారి వద్ద నుండి కొన్ని పోస్ట్ డేటెడ్ చెక్కులు , సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు.

    వివరాలు 

    తవ్విన కొద్దీ బయటికి వస్తున్న నీట్ లీలలు

    బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (BPSC) టీచర్ రిక్రూట్‌మెంట్ పరీక్ష పేపర్ లీక్‌లో ప్రమేయం ఉండి, ఇప్పటికే జైలు శిక్ష అనుభవించిన సంజీవ్ ముఖియా కుమారుడు శివ్.

    ఇతగాడు మేలో పాట్నాలోని లెర్న్ ప్లే స్కూల్‌తో సంబంధం ఉన్న బాలుర హాస్టల్‌లో దాదాపు 25 మంది అభ్యర్థులను ఉంచినట్లు ఆరోపణలు వచ్చాయి.

    NEET పరీక్షకు ఒక రోజు ముందు. అదే హాస్టల్‌లో అభ్యర్థులకు లీకైన ప్రశ్నపత్రం, సమాధాన పత్రాలు అందించినట్లు సమాచారం.

    పేపర్ లీక్‌తో సంబంధాలు ఉన్నాయని ఆరోపించిన సంజీవ్ ముఖియా మేనల్లుడు రాకీ కోసం కూడా పోలీసులు వెతుకుతున్నారు.

    రాకీ నీట్ పరీక్షా పత్రాన్ని లీక్ చేయడానికి జవాబు పత్రాలు రాసే వారిని సమకూర్చాడనే కోణంలో విచారిస్తున్నారు.

    వివరాలు 

    పాట్నాలో సీబీఐ బృందం 

    సోమవారం ఢిల్లీ నుంచి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) బృందం పాట్నాలోని ఈఓయూ కార్యాలయానికి చేరుకుంది.

    కేంద్రం సీబీఐతో విచారణకు ఆదేశించే వరకు ఈ కేసును విచారించిన ఈఓయూ ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు 18 మందిని అరెస్టు చేసింది.

    ఈఓయూ నుంచి సీబీఐ అధికారులు కేసుకు సంబంధించిన సాక్ష్యాలను సేకరిస్తున్నారు'' అని ఓ అధికారి వార్తా సంస్థ పీటీఐకి తెలిపారు.

    నీట్-యూజీలో జరిగిన అవకతవకలకు సంబంధించి సీబీఐ ఆదివారం ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఎఫ్‌ఐఆర్) దాఖలు చేసింది.

    సాక్ష్యాధారాలను ధ్వంసం చేయడంపై దర్యాప్తు చేసేందుకు సీబీఐ పలు ఎఫ్‌ఐఆర్‌లను దాఖలు చేసే అవకాశం ఉంది.

    వివరాలు 

    24 లక్షల కంటే ఎక్కువ మంది అభ్యర్థులు NEET-UGకు హాజరు

    నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్వహించిన NEET-UG 2024, 571 నగరాల్లోని 4,750 కేంద్రాలలో 24 లక్షల కంటే ఎక్కువ మంది అభ్యర్థులు హాజరయ్యారు.

    జూన్ 4న ఫలితాలు వచ్చాయి.అయితే, ఫలితాలు ప్రకటించిన వెంటనే, బీహార్‌లో ప్రశ్నపత్రం లీక్‌ల వాదనల మధ్య 67 మంది విద్యార్థులు టాప్ స్కోర్లు సాధించినప్పుడు విద్యార్థులు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బిహార్

    తాజా

    Salman khan: సల్మాన్ ఖాన్ ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించిన వ్యక్తి.. అరెస్టు సల్మాన్ ఖాన్
    Kawasaki Versys-X 300: భారత్‌లో 2025 కవాసాకి వెర్సిస్-ఎక్స్ 300 లాంచ్.. అడ్వెంచర్ బైక్ ! ఆటో మొబైల్
    Bomb Threat: పంజాబ్‌, హర్యానా హైకోర్టుకు బాంబు బెదిరింపు పంజాబ్
    Prashant Varma: కొత్త బిజినెస్‌లోకి ఎంట‌ర్ అయిన ద‌ర్శ‌కుడు ప్రశాంత్ వర్మ.. హనుమాన్ జ‌యంతి కానుక‌గా లిమిటెడ్ ఎడిషన్ హను-మాన్

    బిహార్

    Lok Sabha polls: ఆ రాష్ట్రం నుంచే ప్రధాని మోదీ లోక్‌సభ ఎన్నికల ప్రచారం షురూ  లోక్‌సభ
    Land-for-jobs scam: ED చార్జిషీట్‌లో రబ్రీ దేవి, మిసా భారతి పేర్లు భారతదేశం
    Bharat Ratna: బిహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్‌కు 'భారతరత్న' భారతరత్న
    Bihar Politics: నితీశ్ ఉదంతం వేళ.. బిహార్‌ కాంగ్రెస్ సీనియర్ అబ్జర్వర్‌గా భూపేష్ బఘేల్ నియామకం కాంగ్రెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025