NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Andhra News: డిగ్రీ కోర్సుల్లో కీలక మార్పులు - కృత్రిమ మేధ, క్వాంటం కంప్యూటింగ్ వంటి కోర్సులకు ప్రవేశం 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Andhra News: డిగ్రీ కోర్సుల్లో కీలక మార్పులు - కృత్రిమ మేధ, క్వాంటం కంప్యూటింగ్ వంటి కోర్సులకు ప్రవేశం 
    డిగ్రీలో కృత్రిమ మేధ,క్వాంటం కంప్యూటింగ్ వంటి కోర్సులకు ప్రవేశం

    Andhra News: డిగ్రీ కోర్సుల్లో కీలక మార్పులు - కృత్రిమ మేధ, క్వాంటం కంప్యూటింగ్ వంటి కోర్సులకు ప్రవేశం 

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 20, 2025
    09:37 am

    ఈ వార్తాకథనం ఏంటి

    వచ్చే విద్యా సంవత్సరం నుంచే డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు మరింత ఆధునిక సాంకేతిక అంశాలు అందుబాటులోకి రానున్నాయి.

    ఇప్పటివరకు బీటెక్‌ వంటి సాంకేతిక విద్యలు చదువుతున్న వారికి మాత్రమే లభ్యమైన క్వాంటం కంప్యూటింగ్,కృత్రిమ మేధస్సు (AI),మెషిన్ లెర్నింగ్ వంటి కోర్సులను ఇకపై సాధారణ డిగ్రీ విద్యార్థులూ మైనర్ సబ్జెక్టులుగా ఎంపిక చేసుకోవచ్చు.

    ఈ కోర్సులను ప్రవేశపెట్టే దిశగా ఉన్నత విద్యామండలి కసరత్తును పూర్తిచేసి, కొత్త సిలబస్‌ను రూపొందించేందుకు తుది దశలోకి అడుగుపెట్టింది.

    ఇప్పటి వరకు అమలులో ఉన్న సింగిల్ మేజర్ విధానానికి బదులుగా డబుల్ మేజర్ విధానాన్ని తీసుకురావాలని ప్రణాళిక రూపొందించారు.

    ఈ కొత్త విధానం అమలు, సిలబస్ రూపకల్పన కోసం ప్రొఫెసర్ వెంకయ్య నేతృత్వంలోని కమిటీ ఇప్పటికే తమ నివేదికను సమర్పించింది.

    వివరాలు 

    ప్రైవేట్ కళాశాలలకే మొగ్గు

    ఈ అంశంపై ఉన్నత విద్యామండలి చైర్మన్ మధుమూర్తి సోమవారం రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల ఉపకులపతులతో ఆన్‌లైన్‌ సమావేశం నిర్వహించారు.

    మార్పులకు సంబంధించి పూర్తి వివరాలు తెలియజేసి, వీసీల నుంచి సూచనలు, అభిప్రాయాలు స్వీకరించారు.

    గత ప్రభుత్వం విద్యా రంగంలో సంస్కరణల పేరిట సింగిల్ మేజర్ విధానాన్ని ప్రవేశపెట్టింది.

    అయితే, అన్ని సబ్జెక్టులను అందుబాటులో ఉంచడానికి అవసరమైన టీచింగ్ సిబ్బంది లేనందున కొన్ని ప్రభుత్వ కళాశాలల్లో కొద్ది సబ్జెక్టులే అందుబాటులో ఉండగా, కొన్ని కళాశాలల్లో మరో కోర్సులే ఉండేలా మారింది.

    దీనివల్ల విద్యార్థులు తమకు నచ్చిన సబ్జెక్టు చదవలేక, ప్రైవేట్ కళాశాలలకే మొగ్గు చూపారు.

    ఈ నేపథ్యంలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) మార్గదర్శకాల మేరకు డబుల్ మేజర్ విధానంను ప్రవేశపెడుతోంది.

    వివరాలు 

    ప్రధానంగా రెండు మేజర్ సబ్జెక్టులు 

    కొత్త విధానంలో,డిగ్రీ విద్యార్థులు తమకు ఇష్టమైన రెండు సబ్జెక్టులను మేజర్‌లుగా ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.

    ఇందులో మొదటి మేజర్‌కు 48 క్రెడిట్లు,రెండో మేజర్‌కు 32 క్రెడిట్లు కేటాయించబడతాయి.

    అంటే, రెండింటికీ సమాన ప్రాధాన్యం కలిగి ఉంటుంది. ఈ రెండు మేజర్ సబ్జెక్టులలో ఏదైనా ఒకదానిపై విద్యార్థులు పీజీ చదువు కొనసాగించవచ్చు.

    డబుల్ మేజర్‌తో పాటు మైనర్ సబ్జెక్టులు కూడా ఉండే విధంగా రూపొందిస్తున్నారు.

    మైనర్‌ల్లో క్వాంటం కంప్యూటింగ్, AI, మెషిన్ లెర్నింగ్ వంటి కోర్సులు అందుబాటులోకి రానున్నాయి.

    ముఖ్యంగా బీఎస్సీ (కంప్యూటర్స్) చదివే విద్యార్థులకు క్వాంటం కంప్యూటింగ్ తప్పనిసరి చేస్తారు.

    ఇతర కోర్సులకు ఇది ఐచ్ఛికంగా అందుబాటులో ఉంటుంది. బీఏ, బీకాం విద్యార్థులు కూడా వీటిని తమ మైనర్ సబ్జెక్టులుగా ఎంపిక చేసుకోవచ్చు.

    వివరాలు 

    అధ్యాపకులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు

    అంతేకాక, నైపుణ్యాభివృద్ధి కోర్సుల్లో కొత్తగా డిజైన్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అనే అంశాలను ప్రవేశపెట్టనున్నారు.

    ప్రస్తుత ఉద్యోగ మార్కెట్‌లో ప్రాబ్లమ్ సాల్వింగ్‌కు ఎంతో ప్రాధాన్యం ఉండటంతో, విద్యార్థులు ఈ నైపుణ్యాన్ని అభ్యసిస్తే ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఉన్నత విద్యామండలి భావిస్తోంది.

    ప్రస్తుత పరిశ్రమలన్నీ ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నందున, విద్యార్థులకు ఈ విషయాలపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ మార్పులు తీసుకొస్తున్నారు.

    ఈ కొత్త కోర్సుల బోధన కోసం అధ్యాపకులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు.

    వివరాలు 

    ఇంటర్న్‌షిప్ విధానంలో కీలక మార్పు 

    2020-21 విద్యా సంవత్సరం నుంచి డిగ్రీలో మూడు దశలుగా ఇంటర్న్‌షిప్ విధానం అమలులో ఉంది.

    మొదటి సంవత్సరం ముగిసిన అనంతరం వేసవి సెలవుల్లో రెండు నెలలు కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్ చేయాలి.

    రెండో సంవత్సరం అనంతరం సెలవుల్లో తాము అభ్యసిస్తున్న సబ్జెక్టులపై రెండో ఇంటర్న్‌షిప్ చేయాల్సి ఉంటుంది.

    మూడో సంవత్సరంలో ఐదో లేదా ఆరో సెమిస్టర్‌లో సెమిస్టర్ ఇంటర్న్‌షిప్ చేయాలి.

    కానీ తాజా నిర్ణయం ప్రకారం,ఈ మూడు దశల ఇంటర్న్‌షిప్‌లను కేవలం ఒక్క సెమిస్టర్‌కే పరిమితం చేయాలని ప్రణాళిక రూపొందించారు.

    వివరాలు 

    కొత్త డిగ్రీ కరిక్యులం.. ప్రభుత్వానికి 

    రెండు స్వల్పకాలిక ఇంటర్న్‌షిప్‌లు విద్యార్థులకు పెద్దగా ప్రయోజనం కలిగించలేదని ఉన్నత విద్యామండలి పరిశీలనలో తేలింది.

    ఈ మార్పులన్నింటితో కొత్త డిగ్రీ కరిక్యులంను రూపకల్పన చేసిన ఉన్నత విద్యామండలి, దీనిని ప్రభుత్వానికి సమర్పించనుంది.

    ఆమోదం లభించిన అనంతరం ప్రభుత్వ ఉత్తర్వులతో పాటు విశ్వవిద్యాలయాల అకడెమిక్ విభాగాల అనుమతితో అమలులోకి రానున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    Andhra News: డిగ్రీ కోర్సుల్లో కీలక మార్పులు - కృత్రిమ మేధ, క్వాంటం కంప్యూటింగ్ వంటి కోర్సులకు ప్రవేశం  ఆంధ్రప్రదేశ్
    Maharashtra: ఫడ్నవిస్ మంత్రివర్గంలో భుజ్‌బాల్.. ఇవాళే ప్రమాణ స్వీకారం మహారాష్ట్ర
    Vishal-Sai Dhansika: విశాల్‌ పెళ్లికి ముహూర్తం ఫిక్స్‌.. బర్త్‌డే రోజునే వెడ్డింగ్‌ విశాల్
    Hyderabad: ఔటర్‌ రింగ్‌ రోడ్డు-ఆర్‌ఆర్‌ఆర్‌ మధ్య లాజిస్టిక్‌ హబ్‌ల నిర్మాణం లక్ష్యంగా హెచ్‌ఎండీఏ ప్రణాళిక  హైదరాబాద్

    ఆంధ్రప్రదేశ్

    Andhra Pradesh: రేషన్ కార్డు దారులకు శుభవార్త.. ఆ నెల నుంచి కందిపప్పు, రాగులు పంపిణీ ప్రభుత్వం
    PSR Anjaneyulu: సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్సార్‌కు మరో ఎదురుదెబ్బ.. మరో కేసు నమోదు భారతదేశం
    AP DSC: ఏపీ మెగా డిఎస్సీ అభ్యర్థులకు తీపి కబురు.. నిబంధనల్లో సడలింపులు నారా లోకేశ్
     Amaravati: అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా సీఎం చంద్రబాబు ప్రయత్నాలు! అమరావతి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025