NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / RSS: రూ.150 కోట్లలో జంధేవాలన్‌లో ఆర్ఎస్ఎస్ నూతన కార్యాలయం.. ఆధునిక సౌకర్యాలతో కొత్త హంగులు
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    RSS: రూ.150 కోట్లలో జంధేవాలన్‌లో ఆర్ఎస్ఎస్ నూతన కార్యాలయం.. ఆధునిక సౌకర్యాలతో కొత్త హంగులు
    రూ.150 కోట్లలో జంధేవాలన్‌లో ఆర్ఎస్ఎస్ నూతన కార్యాలయం.. ఆధునిక సౌకర్యాలతో కొత్త హంగులు

    RSS: రూ.150 కోట్లలో జంధేవాలన్‌లో ఆర్ఎస్ఎస్ నూతన కార్యాలయం.. ఆధునిక సౌకర్యాలతో కొత్త హంగులు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Feb 13, 2025
    03:34 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశవ్యాప్తంగా హిందుత్వ సిద్ధాంతాలను ప్రచారం చేసే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) తన దిల్లీ జంధేవాలన్ కార్యాలయాన్ని ఆధునిక సౌకర్యాలతో అప్‌గ్రేడ్ చేసుకుంది.

    3.75 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ కార్యాలయం 'కేశవ కుంజ్'గా ప్రసిద్ధి చెందింది. కొత్త కార్యాలయంలో మూడు 12 అంతస్తుల టవర్లు ఉండగా, వాటిలో కార్యాలయ గదులు, సమావేశ హాళ్లు, గ్రంథాలయం, క్లినిక్, సోలార్ పవర్ ఫెసిలిటీ, రీసైక్లింగ్ వ్యవస్థ వంటి అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయి.

    RSS కొత్త కార్యాలయం ప్రత్యేకతలు:

    ఆర్ఎస్ఎస్ మొదట 1962లో ఒక అంతస్తు భవనంలో తన కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుంది. 2018లో కొత్త భవన నిర్మాణం ప్రారంభమై, దాదాపు 8 ఏళ్ల తరువాత పూర్తయ్యింది

    Details

    నూతన కార్యాలయంలో మూడు ప్రధాన టవర్లు

    కొత్త కార్యాలయంలో మూడు ప్రధాన టవర్లను నిర్మించారు.

    వీటిని 'సాధన', 'ప్రేరణ', 'అర్చన'గా పిలుస్తున్నారు. భవన ప్రాంగణంలో RSS వ్యవస్థాపకుడు డాక్టర్ కేశవ బాలీరాం హెడ్గేవార్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

    ఈ భవనం కేశవ కుంజ్ అనే పేరుతో కొనసాగనుంది.

    భవన కిటికీలు గుజరాతీ, రాజస్థాని సంప్రదాయ శిల్పకళతో మలిచారు. అంతేకాకుండా, 1,000 గ్రానైట్ స్ట్రక్చర్లను ఉపయోగించి కలప వినియోగాన్ని తగ్గించారు.

    Details

     ఆధునిక సదుపాయాలు

    రెండు ఆధునిక ఆడిటోరియంలు (473, 123 మందికి వసతి)

    కనీసం 600 మంది ఉండగల సమావేశ హాళ్లు

    విశ్వ హిందూ పరిషత్ మాజీ అధ్యక్షుడు అశోక్ సింఘాల్ పేరిట ఒక సమావేశ హాల్

    పవర్ పవర్ ప్లాంట్, మురుగు నీరు రీసైక్లింగ్ వ్యవస్థ

    8,500 పుస్తకాలు కలిగిన 'కేశవ పుస్తకాలయ' గ్రంథాలయం (బౌద్ధం, సిక్కు, క్రైస్తవ, ఇస్లాం విషయాలపై గ్రంథాలు అందుబాటులో) - 5 బెడ్లతో కూడిన ఆసుపత్రి

    స్థానిక ప్రజలకు ఉపయోగపడే వైద్య సేవలు

    హనుమాన్ ఆలయం, విశాలమైన తోటలు

    పార్కింగ్ (ప్రస్తుతం 135, భవిష్యత్తులో 200 స్థలాలు)

    RSS ప్రచురణ సంస్థ 'సురుచి ప్రకాశన్' కార్యాలయం

    Details

    నిర్మాణ వ్యయం, విరాళాలు

    ఈ కొత్త భవన నిర్మాణానికి దాదాపు రూ. 150 కోట్లు ఖర్చయ్యింది.

    దీని కోసం 75,000 మంది విరాళాలు అందించారు. కొత్త భవనంలో కార్యాలయ కార్యకలాపాలు దసరా 2023న ప్రారంభమయ్యాయి.

    ఫిబ్రవరి 19న RSS సర్‌సంఘచాలక్ మోహన్ భగవత్, జనరల్ సెక్రటరీ దత్తాత్రేయ హోసబాలే కొత్త కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు. మార్చి 21-23 తేదీల్లో బెంగళూరులో RSS అత్యున్నత నిర్ణయాధికార సంస్థ 'అఖిల భారతీయ ప్రతినిధి సభ' సమావేశం జరగనుంది. ఇందులో 1,500 మంది RSS ప్రముఖులు, అనుబంధ సంస్థల ప్రతినిధులు పాల్గొంటారు. RSS తొలి ఢిల్లీ కార్యాలయం 1939లో ప్రారంభమైంది. 1962లో 'కేశవ కుంజ్' భవనం ఒక అంతస్తుతో నిర్మించారు. 1980లలో రెండో అంతస్తు నిర్మించారు.

    Details

    2016లో శంకుస్థాపన

    2016లో నూతన కార్యాలయానికి మోహన్ భగవత్ శంకుస్థాపన చేయగా, 2018 నుండి RSS తాత్కాలికంగా ఉడాసిన్ ఆశ్రమంలో కార్యాలయాన్ని నిర్వహించింది.

    కరోనా మహమ్మారి వల్ల భవన నిర్మాణం ఆలస్యమైంది. కానీ, 2024లో కొత్త కార్యాలయం పూర్తయి, పూర్తి స్థాయిలో ప్రారంభమైంది.

    ఈ కొత్త భవనం ద్వారా RSS తన కార్యకలాపాలను మరింత విస్తరించుకోనుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆర్ఎస్ఎస్
    దిల్లీ

    తాజా

    Stock Market: లాభాల్లో ట్రేడవుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ@24,600 స్టాక్ మార్కెట్
    Flood Situation: ఈశాన్యంలో ప్రకృతి ప్రళయం.. వరదల బీభత్సంతో 43 మంది మృతి వరదలు
    Cash Row: జస్టిస్‌ యశ్వంత్‌ వర్మపై అభిశంసనకు కేంద్రం రంగం సిద్ధం  కేంద్ర ప్రభుత్వం
    Andhra Pradesh: ఏపీలో నేషనల్ హైవే ఆరు లైన్లుగా.. కేంద్రం ముందుకు ప్రతిపాదనలు శ్రీకాకుళం

    ఆర్ఎస్ఎస్

    RSS : మ‌ణిపూర్ హింస‌కు వాళ్లే కార‌ణమన్న మోహ‌న్ భ‌గ‌వ‌త్‌.. మీడియాను గుప్పెట పట్టారని ఫైర్ మోహన్ భగవత్
    Indresh Kumar : అహంకారులను రాముడు 241 వద్ద ఆపాడు.. బీజేపీపై ఆర్‌ఎస్‌ఎస్‌ నేత ఇంద్రేష్‌ కుమార్‌ విమర్శలు భారతదేశం
    Indresh Kumar: ఇంద్రేశ్‌ కుమార్‌ వ్యాఖ్యలపై ఆర్ఎస్ఎస్ దిద్దు బాటు చర్యలు భారతదేశం
    RSS: 58 ఏళ్ల తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు ఆర్‌ఎస్‌ఎస్ కార్యక్రమాలలో పాల్గోవడంపై నిషేధం ఎత్తివేత.. మండిపడిన కాంగ్రెస్  కాంగ్రెస్

    దిల్లీ

    Delhi: ఢిల్లీని కప్పేసిన పొగమంచు.. కనిష్ట ఉష్ణోగ్రత 6.4 డిగ్రీలు భారతదేశం
    Heavy Snowfall: ఉత్తర భారతదేశాన్ని కమ్మేసిన దట్టమైన పొగమంచు.. ఆలస్యంగా నడుస్తున్న 150 విమానాలు, 26 రైళ్లు.. భారతదేశం
    Liquor Policy of Delhi: దిల్లీ మద్యం పాలసీ.. కాగ్ నివేదికలో 2,026 కోట్ల నష్టం అరవింద్ కేజ్రీవాల్
    Dense Fog: ఉత్తర భారతదేశంలో పెరిగిన చలి తీవ్రత.. విమాన, రైలు సర్వీసులకు అంతరాయం  వాయు కాలుష్యం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025