LOADING...
RSS: రూ.150 కోట్లలో జంధేవాలన్‌లో ఆర్ఎస్ఎస్ నూతన కార్యాలయం.. ఆధునిక సౌకర్యాలతో కొత్త హంగులు
రూ.150 కోట్లలో జంధేవాలన్‌లో ఆర్ఎస్ఎస్ నూతన కార్యాలయం.. ఆధునిక సౌకర్యాలతో కొత్త హంగులు

RSS: రూ.150 కోట్లలో జంధేవాలన్‌లో ఆర్ఎస్ఎస్ నూతన కార్యాలయం.. ఆధునిక సౌకర్యాలతో కొత్త హంగులు

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 13, 2025
03:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశవ్యాప్తంగా హిందుత్వ సిద్ధాంతాలను ప్రచారం చేసే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) తన దిల్లీ జంధేవాలన్ కార్యాలయాన్ని ఆధునిక సౌకర్యాలతో అప్‌గ్రేడ్ చేసుకుంది. 3.75 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ కార్యాలయం 'కేశవ కుంజ్'గా ప్రసిద్ధి చెందింది. కొత్త కార్యాలయంలో మూడు 12 అంతస్తుల టవర్లు ఉండగా, వాటిలో కార్యాలయ గదులు, సమావేశ హాళ్లు, గ్రంథాలయం, క్లినిక్, సోలార్ పవర్ ఫెసిలిటీ, రీసైక్లింగ్ వ్యవస్థ వంటి అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయి. RSS కొత్త కార్యాలయం ప్రత్యేకతలు: ఆర్ఎస్ఎస్ మొదట 1962లో ఒక అంతస్తు భవనంలో తన కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుంది. 2018లో కొత్త భవన నిర్మాణం ప్రారంభమై, దాదాపు 8 ఏళ్ల తరువాత పూర్తయ్యింది

Details

నూతన కార్యాలయంలో మూడు ప్రధాన టవర్లు

కొత్త కార్యాలయంలో మూడు ప్రధాన టవర్లను నిర్మించారు. వీటిని 'సాధన', 'ప్రేరణ', 'అర్చన'గా పిలుస్తున్నారు. భవన ప్రాంగణంలో RSS వ్యవస్థాపకుడు డాక్టర్ కేశవ బాలీరాం హెడ్గేవార్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ భవనం కేశవ కుంజ్ అనే పేరుతో కొనసాగనుంది. భవన కిటికీలు గుజరాతీ, రాజస్థాని సంప్రదాయ శిల్పకళతో మలిచారు. అంతేకాకుండా, 1,000 గ్రానైట్ స్ట్రక్చర్లను ఉపయోగించి కలప వినియోగాన్ని తగ్గించారు.

Details

 ఆధునిక సదుపాయాలు

రెండు ఆధునిక ఆడిటోరియంలు (473, 123 మందికి వసతి) కనీసం 600 మంది ఉండగల సమావేశ హాళ్లు విశ్వ హిందూ పరిషత్ మాజీ అధ్యక్షుడు అశోక్ సింఘాల్ పేరిట ఒక సమావేశ హాల్ పవర్ పవర్ ప్లాంట్, మురుగు నీరు రీసైక్లింగ్ వ్యవస్థ 8,500 పుస్తకాలు కలిగిన 'కేశవ పుస్తకాలయ' గ్రంథాలయం (బౌద్ధం, సిక్కు, క్రైస్తవ, ఇస్లాం విషయాలపై గ్రంథాలు అందుబాటులో) - 5 బెడ్లతో కూడిన ఆసుపత్రి స్థానిక ప్రజలకు ఉపయోగపడే వైద్య సేవలు హనుమాన్ ఆలయం, విశాలమైన తోటలు పార్కింగ్ (ప్రస్తుతం 135, భవిష్యత్తులో 200 స్థలాలు) RSS ప్రచురణ సంస్థ 'సురుచి ప్రకాశన్' కార్యాలయం

Advertisement

Details

నిర్మాణ వ్యయం, విరాళాలు

ఈ కొత్త భవన నిర్మాణానికి దాదాపు రూ. 150 కోట్లు ఖర్చయ్యింది. దీని కోసం 75,000 మంది విరాళాలు అందించారు. కొత్త భవనంలో కార్యాలయ కార్యకలాపాలు దసరా 2023న ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 19న RSS సర్‌సంఘచాలక్ మోహన్ భగవత్, జనరల్ సెక్రటరీ దత్తాత్రేయ హోసబాలే కొత్త కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు. మార్చి 21-23 తేదీల్లో బెంగళూరులో RSS అత్యున్నత నిర్ణయాధికార సంస్థ 'అఖిల భారతీయ ప్రతినిధి సభ' సమావేశం జరగనుంది. ఇందులో 1,500 మంది RSS ప్రముఖులు, అనుబంధ సంస్థల ప్రతినిధులు పాల్గొంటారు. RSS తొలి ఢిల్లీ కార్యాలయం 1939లో ప్రారంభమైంది. 1962లో 'కేశవ కుంజ్' భవనం ఒక అంతస్తుతో నిర్మించారు. 1980లలో రెండో అంతస్తు నిర్మించారు.

Advertisement

Details

2016లో శంకుస్థాపన

2016లో నూతన కార్యాలయానికి మోహన్ భగవత్ శంకుస్థాపన చేయగా, 2018 నుండి RSS తాత్కాలికంగా ఉడాసిన్ ఆశ్రమంలో కార్యాలయాన్ని నిర్వహించింది. కరోనా మహమ్మారి వల్ల భవన నిర్మాణం ఆలస్యమైంది. కానీ, 2024లో కొత్త కార్యాలయం పూర్తయి, పూర్తి స్థాయిలో ప్రారంభమైంది. ఈ కొత్త భవనం ద్వారా RSS తన కార్యకలాపాలను మరింత విస్తరించుకోనుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Advertisement