NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఏప్రిల్ 1నుంచి టోల్ రేట్లను భారీగా పెంచే యోచనలో ఎన్‌హెచ్‌ఏఐ; ప్రయాణికులపై మరింత భారం
    తదుపరి వార్తా కథనం
    ఏప్రిల్ 1నుంచి టోల్ రేట్లను భారీగా పెంచే యోచనలో ఎన్‌హెచ్‌ఏఐ; ప్రయాణికులపై మరింత భారం
    ఏప్రిల్ 1నుంచి టోల్ రేట్లను భారీగా పెంచే యోచనలో ఎన్‌హెచ్‌ఏఐ

    ఏప్రిల్ 1నుంచి టోల్ రేట్లను భారీగా పెంచే యోచనలో ఎన్‌హెచ్‌ఏఐ; ప్రయాణికులపై మరింత భారం

    వ్రాసిన వారు Stalin
    Mar 06, 2023
    01:38 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్‌హెచ్‌ఏఐ) ఏప్రిల్ 1 నుంచి టోల్ రేట్లను పెంచే అవకాశం ఉంది. దీంతో నేషనల్ హైవేస్ (ఎన్‌హెచ్‌లు), ఎక్స్‌ప్రెస్‌వేల గుండా ప్రయాణించే ప్రయాణికులపై మరింత భారం పడే అవకాశం ఉంది. టోల్ ధరలను 5శాతం నుంచి 10శాతానికి పెంచే ఆలోచనలో ఎన్‌హెచ్‌ఏఐ ఉన్నట్లు తెలుస్తోంది.

    టోల్ ప్లాజాలను తొలగించి, వాటి స్థానంలో నంబర్ ప్లేట్‌లను చదివే కెమెరాలను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందని గతంలోనే ప్రచారం జరిగింది. జాతీయ రహదారులపై ఉన్న అన్ని టోల్ ప్లాజాలను తొలగించి ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రీడర్ (ఏఎన్‌పీఆర్)కెమెరాలపై ఆధారపడాలని, ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా,రహదారుల మంత్రిత్వ శాఖ ప్రణాళికను రూపొందించినట్లు మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.

    టోల్

    మార్చి చివరి వారంలో రేట్ల పెంపు ప్రతిపాదనలకు ఆమోదం

    రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఈ నెల చివరి వారంలోపు ప్రతిపాదనలను పరిశీలిస్తుందని, తగిన పరిశీలన తర్వాత రేట్లను ఆమోదించవచ్చని హిందూస్థాన్ నివేదిక చెబుతోంది.

    కార్లు, తేలికపాటి వాహనాల టోల్‌ రేట్లు ఐదు శాతం పెరగనుండగా, ఇతర భారీ వాహనాలపై 10 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది.

    ఇటీవల ప్రారంభించిన ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేపై టోల్ రేట్లు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం, కొత్తగా ప్రారంభించిన ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వే విభాగంలో కిలోమీటరుకు రూ.2.19 చొప్పున టోల్ వసూలు చేస్తున్నారు, దీనిని దాదాపు 10 శాతం పెంచనున్నారు.

    ప్రస్తుతం ఎక్స్‌ప్రెస్‌వేపై రోజుకు 20 వేల వాహనాలు తిరుగుతున్నాయి. వచ్చే ఆరు నెలల్లో ఈ సంఖ్య 50 నుంచి 60 వేలకు పెరిగే అవకాశం ఉంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నితిన్ గడ్కరీ

    తాజా

    Census: 2027 మార్చి 1 నుంచి జనగణన ప్రారంభం..: కేంద్రం వెల్లడి భారతదేశం
    #NewsBytesExplainer: కన్నడకు మూలం తమిళమా? కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలపై విశ్లేషణ కమల్ హాసన్
    Bengaluru: ఆర్‌సిబి విజయోత్సవ వేడుకల్లో విషాదం.. తొక్కిసలాటలో 8మంది మృతి బెంగళూరు
    Tomato: ప్రాణాంతక బ్యాక్టీరియాతో టమాటోలు.. అమెరికాలో సాల్మొనెల్లా కలకలం! అమెరికా

    నితిన్ గడ్కరీ

    2024 నాటికి 15 లక్షల కోట్లకు చేరుకునే లక్ష్యం దిశగా భారతీయ ఆటోమొబైల్ మార్కెట్: నితిన్ గడ్కరీ ఆటో మొబైల్
    'రోడ్డుపై ప్రయాణిస్తే విమానాల కంటే వేగంగా వెళ్లొచ్చు', నితిన్ గడ్కరీ కామెంట్స్ ముంబై
    మొదటి రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ సదుపాయాన్ని ప్రారంభించిన టాటా మోటార్స్ టాటా
    కొన్ని రోడ్లపై వేగంగా వెళ్లాలంటున్న కేంద్ర ప్రభుత్వం రవాణా శాఖ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025