NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / గ్యాంగ్‌స్టర్-టెర్రర్ నెట్‌వర్క్‌పై ఎన్‌ఐఏ ఉక్కుపాదం; దేశవ్యాప్తంగా 72చోట్లు దాడులు
    తదుపరి వార్తా కథనం
    గ్యాంగ్‌స్టర్-టెర్రర్ నెట్‌వర్క్‌పై ఎన్‌ఐఏ ఉక్కుపాదం; దేశవ్యాప్తంగా 72చోట్లు దాడులు
    గ్యాంగ్‌స్టర్-టెర్రర్ నెట్‌వర్క్‌ లక్ష్యంగా దేశవ్యాప్తంగా ఎన్‌ఐఏ దాడులు

    గ్యాంగ్‌స్టర్-టెర్రర్ నెట్‌వర్క్‌పై ఎన్‌ఐఏ ఉక్కుపాదం; దేశవ్యాప్తంగా 72చోట్లు దాడులు

    వ్రాసిన వారు Stalin
    Feb 21, 2023
    10:06 am

    ఈ వార్తాకథనం ఏంటి

    గ్యాంగ్‌స్టర్-టెర్రర్ నెట్‌వర్క్ అణచివేతపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ఫోకస్ పెట్టింది. మంగళవారం ఉదయం నుంచి దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో 72చోట్ల దాడులు నిర్వహిస్తోంది.

    ప్రస్తుతం ఉత్తరప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లలో దాడులు కొనసాగుతున్నాయి.

    ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్‌లో ఆయుధాల సరఫరాదారు ఇంటిపై ఎన్‌ఐఏ అధికారులు దాడులు చేస్తున్నారు. ఈ దాడుల్లో పాకిస్థాన్ నుంచి సరఫరా చేసిన ఆయుధాలను గుర్తించినట్లు ఎన్ఐఏ వర్గాలు చెబుతున్నాయి.

    లారెన్స్ బిష్ణోయ్, నీరజ్ బవానా గ్యాంగ్‌లకు చెందిన అనేక మందిని ఎన్ఐఏ ఇప్పటికే విచారించింది. వారి నుంచి సేకరించిన సమాచారం ప్రకారం ఇప్పుడు దాడులు చేస్తున్నట్లు ఎన్ఐఏ వర్గాలు చెబుతున్నాయి.

    ఎన్ఐఏ

    గ్యాంగ్‌స్టర్ నెట్‌వర్క్‌పై ఇది నాలుగోసారి

    గ్యాంగ్‌స్టర్ నెట్‌వర్క్‌పై ఎన్‌ఐఏ దాడులు చేయడం ఇది నాలుగోసారి. పంజాబ్‌లోని 30కి పైగా చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. హర్యానాలోని యమునా నగర్‌లోని ముండా మజ్రా ప్రాంతంలో ఎన్‌ఐఏ దాడులు నిర్వహించింది. ఆజాద్‌నగర్‌లో ఎన్‌ఐఏ బృందంతో పాటు స్థానిక పోలీసులు కూడా దాడుల్లో పాల్గొన్నారు.

    ఈ దాడుల్లో పాకిస్థాన్ ఐఎస్ఐ-గ్యాంగ్‌స్టర్ల మధ్య సంబంధంపై కొంత సమాచారాన్ని సేకరించినట్లు తెలుస్తోంది. చాలా మంది గ్యాంగ్‌స్టర్‌లను అరెస్టు చేశారు. వారిపై కఠినమైన చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం కింద అభియోగాలు మోపారు. ఈ గ్యాంగ్‌స్టర్ల నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.

    గతేడాది అక్టోబర్‌లో ఉగ్రవాదులు, గ్యాంగ్‌స్టర్లు, మాదకద్రవ్యాల అక్రమ రవాణాదారుల మధ్య సంబంధాన్ని లక్ష్యంగా చేసుకుని ఐదు రాష్ట్రాల్లోని 50కిపైగా ప్రాంతాల్లో ఎన్‌ఐఏ దాడులు నిర్వహించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఎన్ఐఏ
    ఉగ్రవాదులు
    ఉత్తర్‌ప్రదేశ్
    పంజాబ్

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    ఎన్ఐఏ

    'ముంబయిలో తాలిబన్ ఉగ్రదాడులు', ఎన్‌ఐఏకు బెదిరింపు మెయిల్ ముంబై
    ఐసీస్ సానుభూతిపరులే టార్గెట్: కేరళ, తమిళనాడు, కర్ణాటకలోని 60 చోట్ల ఎన్ఐఏ దాడులు కర్ణాటక

    ఉగ్రవాదులు

    పోలీస్ హెడ్ ఆఫీస్‌పై ఉగ్రదాడి; 9మంది మృతి పాకిస్థాన్
    జమ్ముకశ్మీర్ నుంచి దశలవారీగా సైన్యాన్ని ఉపసంహరించుకునే ఆలోచనలో కేంద్రం జమ్ముకశ్మీర్

    ఉత్తర్‌ప్రదేశ్

    కృష్ణ జన్మభూమి వివాదం.. షాహీ ఈద్గా మసీదు వివాదాస్పదంలో సర్వేకు కోర్టు ఆదేశం భారతదేశం
    ముంబయి పర్యటనకి ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి యోగి ఆదిత్యనాథ్
    దిల్లీ ప్రమాదం రిపీట్: నోయిడాలో స్విగ్గీ డెలివరీ బాయ్‌ను కిలోమీటర్ లాక్కెళ్లిన కారు దిల్లీ
    ఎంవీ గంగా విలాస్: ప్రపంచంలోనే అతి పొడవైన రివర్ క్రూయిజ్‌ను ప్రారంభించిన మోదీ నరేంద్ర మోదీ

    పంజాబ్

    ఆస్ట్రేలియాలో హిందూ దేవాలయాలపై దాడులను ఖండించిన భారత్ ఆస్ట్రేలియా
    దిల్లీ మద్యం కేసు: వ్యాపారవేత్త గౌతమ్ మల్హోత్రాను అరెస్టు చేసిన ఈడీ దిల్లీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025