NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఐసీస్ సానుభూతిపరులే టార్గెట్: కేరళ, తమిళనాడు, కర్ణాటకలోని 60 చోట్ల ఎన్ఐఏ దాడులు
    భారతదేశం

    ఐసీస్ సానుభూతిపరులే టార్గెట్: కేరళ, తమిళనాడు, కర్ణాటకలోని 60 చోట్ల ఎన్ఐఏ దాడులు

    ఐసీస్ సానుభూతిపరులే టార్గెట్: కేరళ, తమిళనాడు, కర్ణాటకలోని 60 చోట్ల ఎన్ఐఏ దాడులు
    వ్రాసిన వారు Naveen Stalin
    Feb 15, 2023, 10:35 am 0 నిమి చదవండి
    ఐసీస్ సానుభూతిపరులే టార్గెట్: కేరళ, తమిళనాడు, కర్ణాటకలోని 60 చోట్ల ఎన్ఐఏ దాడులు

    జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) బుధవారం దేశవ్యాప్తంగా మూడు రాష్ట్రాల్లో విస్తృత సోదాలు నిర్వహిస్తోంది. నిషేధిత ఉగ్రవాద సంస్థ ఐసీస్‌తో సంబంధాలున్న వారే లక్ష్యంగా మొత్తం కర్ణాటక, తమిళనాడు, కేరళలోని దాదాపు 60ప్రాంతాల్లో దాడులు చేస్తున్నట్లు ఎన్‌ఐఏ వర్గాలు తెలిపాయి. గతేడాది తమిళనాడులోని కోయంబత్తూరు, కర్ణాటకలోని మంగళూరులో జరిగిన పేలుళ్లకు సంబంధించిన కేసుల విచారణలో భాగంగా ఈదాడులు నిర్వహిస్తున్నట్లు అధికారులు చెప్పారు. గత ఏడాది అక్టోబర్ 23న తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లా కొట్టై ఈశ్వరన్ ఆలయం ముందు పేలుడు పదార్థాలు నింపిన కారు పేలింది. ఈ ఘటనలో ఐసీస్ సంబంధాలున్న జమేషా ముబీన్ మరణించాడు. ఈ కేసును ఎన్‌ఐఏ దర్యాప్తు చేస్తోంది. ఇప్పటికే పదకొండు మందిని యాంటీ టెర్రర్ ఏజెన్సీ అరెస్టు చేసింది.

    ఐసీసీ టెర్రర్ మాడ్యూల్‌ను స్థాపించేందుకు కుట్ర

    గతేడాది నవంబర్‌లో మంగళూరులో ఆటోరిక్షాలో ప్రెషర్ కుక్కర్ పేలుడు ఘటనపై దర్యాప్తును ఎన్‌ఐఏ చేపట్టింది. అందులో మహ్మద్ షరీక్ అనే వ్యక్తి ఈఈడీతో తయారు చేసిన కుక్కర్ బాంబును తీసుకెళ్తున్న క్రమంలో ఇది జరిగింది. ఈ ఘటనలో ప్రయాణికుడు, పేలుడు పదార్థాన్ని తీసుకెళ్తున్న షరీఖ్, ఆటో డ్రైవర్ పురుషోత్తం గాయపడ్డారు. రాష్ట్రంలో మతపరమైన ఉద్రిక్తతలకు ఆజ్యం పోసేలా పెద్ద ఎత్తున దాడి చేసేందుకు కుక్కర్ బాంబులను ఐసీసీ రూపొందించినట్లు ఏజెన్సీ తెలిపింది. ఈ కుట్రకు షరీఖ్ నాయకత్వం వహిస్తున్నట్లు ఎన్ఐఏ అనుమానిస్తోంది. ఐసీసీ టెర్రర్ మాడ్యూల్‌ను స్థాపించాలనే ఉద్దేశ్యంతో షరీఖ్ నవంబర్‌లో దక్షిణాది అటవీ ప్రాంతాలను సందర్శించినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. ఈ కేసుల దర్యాప్తులో భాగంగా ఎన్‌ఐఏ ఈ దాడులు చేస్తోంది.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    కర్ణాటక
    తమిళనాడు
    కేరళ
    ఎన్ఐఏ

    కర్ణాటక

    కర్ణాటక మంత్రివర్గ విస్తరణ: 24మంది కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం ముఖ్యమంత్రి
    కర్ణాటకలో కేబినెట్‌ విస్తరణ; రేపు 24మంది మంత్రులు ప్రమాణ స్వీకారం ముఖ్యమంత్రి
    Explainer: సిద్ధరామయ్య చరిత్ర సృష్టించబోతున్నారా? కర్ణాటక ముఖ్యమంత్రిగా ఎక్కువ కాలం పని చేసింది ఎవరు? ముఖ్యమంత్రి
    జల్లికట్టును సమర్థించిన సుప్రీంకోర్టు; కానీ జంతువుల భద్రతను కాపాడాలని రాష్ట్రాలకు ఆదేశాలు సుప్రీంకోర్టు

    తమిళనాడు

    'తమిళనాడులో పాలు సేకరించకుండా అమూల్‌ను నియంత్రిచండి': అమిత్ షాకు స్టాలిన్ లేఖ పాలు
    తమిళనాడు బీజేపీ చీఫ్‌ అన్నామలైపై స్టాలిన్ ప్రభుత్వం పరువు నష్టం కేసు  తాజా వార్తలు
    తమిళనాడు కంబం ద్రాక్షకు జీఐ ట్యాగ్  ఇండియా లేటెస్ట్ న్యూస్
    'జడ్జి నాలుక నరికేస్తా'; రాహుల్ గాంధీని దోషిగా తేల్చిడంపై కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు కాంగ్రెస్

    కేరళ

    కేరళ: హోటల్ యజమాని హత్య; ట్రాలీ బ్యాగ్‌లో మృతదేహం లభ్యం  హత్య
    కోజికోడ్ రైలు దహనం కేసు: కేరళ ఐపీఎస్ అధికారిపై సస్పెన్షన్ వేటు  రైలు ప్రమాదం
    'ది కేరళ స్టోరీ'పై బెంగాల్ ప్రభుత్వం విధించిన నిషేధంపై సుప్రీంకోర్టు స్టే  సినిమా
    కేరళకు నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం, జూన్ 4న వచ్చే అవకాశం: ఐఎండీ ఐఎండీ

    ఎన్ఐఏ

    జమ్ముకశ్మీర్: టెర్రర్ ఫండింగ్ కేసులో పుల్వామా, షోపియాన్‌‌లో ఎన్‌ఐఏ దాడులు  జమ్ముకశ్మీర్
    పీఎఫ్‌ఐ విచారణ: బిహార్, యూపీ, పంజాబ్, గోవాలో ఎన్‌ఐఏ దాడులు తాజా వార్తలు
    శివమొగ్గ ఐఎస్ కుట్ర కేసు: ఇద్దరు బీటెక్ గ్రాడ్యుయేట్లపై ఎన్ఐఏ ఛార్జ్‌షీట్ కర్ణాటక
    టెర్రర్ ఫండింగ్ కేసు: జమ్ముకశ్మీర్‌లో ఎన్ఐఏ విస్తృత సోదాలు జమ్ముకశ్మీర్

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023