NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Manipur: బీజేపీకి నితీష్ కుమార్ జేడీయూ షాక్.. మణిపూర్‌లో బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరణ..
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Manipur: బీజేపీకి నితీష్ కుమార్ జేడీయూ షాక్.. మణిపూర్‌లో బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరణ..
    బీజేపీకి నితీష్ కుమార్ జేడీయూ షాక్.. మణిపూర్‌లో బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరణ..

    Manipur: బీజేపీకి నితీష్ కుమార్ జేడీయూ షాక్.. మణిపూర్‌లో బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరణ..

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 22, 2025
    04:41 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    బీజేపీ ప్రభుత్వానికి బిహార్ సీఎం నితీష్ కుమార్ ఓ షాక్ ఇచ్చారు. ఆయన నేతృత్వంలోని జేడీయూ మణిపూర్‌లో బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంది.

    సీఎం బీరెన్ సింగ్ ప్రభుత్వానికి జేడీయూకి చెందిన ఒక ఎమ్మెల్యే జేడీయూకి ఉన్న ఒక ఎమ్మెల్యే మద్దతుని విత్ డ్రా చేసుకుని ప్రతిపక్షంలో చేరడానికి సిద్ధపడ్డారు.

    అయితే, ఈ పరిణామం అక్కడి ప్రభుత్వంపై పెద్దగా ప్రభావం చూపించదని.. బీజేపీ ప్రభుత్వ మెజారిటిపై దాదాపుగా ఎలాంటి ఎఫెక్ట్ పడదు.

    వివరాలు 

    జేడీయూకి 12 మంది ఎంపీలు

    కేంద్రంలో బీజేపీకి జేడీయూ మంచి మద్దతుదారుగా ఉంది. గతేడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి స్వయంగా మెజారిటీ సాధించలేదు.

    జేడీయూ, టీడీపీ వంటి పార్టీలు ఎన్డీయే కూటమికి బలంగా మద్దతు ఇచ్చి మ్యాజిక్ ఫిగర్‌ను అందించాయి.

    ప్రస్తుతం జేడీయూకి 12 మంది ఎంపీలు ఉన్నారు, వీరు బీజేపీకి మద్దతు ఇస్తున్నారు.

    అయితే, ఈ పరిణామం బీజేపీకి ఒక హెచ్చరికగా మారిందనే చర్చలు జరుగుతున్నాయి.

    మరోవైపు, బిరెన్ సింగ్ ప్రభుత్వానికి మేఘాలయా అధికార పార్టీ కన్రాడ్ సంగ్మా నేతృత్వంలోని ఎన్‌పీపీ కూడా గత నెలలో మద్దతు ఉపసంహరించుకుంది.

    వివరాలు 

    మణిపూర్ అసెంబ్లీలో ప్రస్తుతం బీజేపీకి 37 మంది శాసనసభ్యులు

    మణిపూర్ 2022 అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ 6 సీట్లు గెలుచుకుంది. కానీ ఎన్నికల అనంతరం ఐదుగురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు.

    60 మంది సభ్యులతో ఉన్న మణిపూర్ అసెంబ్లీలో ప్రస్తుతం బీజేపీకి 37 మంది శాసనసభ్యులు ఉన్నారు.

    మ్యాజిక్ ఫిగర్ 31 కావడంతో, నాగా పీపుల్స్ ఫ్రంట్‌కి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు, ముగ్గురు స్వతంత్రుల మద్దతు కూడా బీజేపీకి ఉంది.

    మొత్తంగా, ఎన్డీయే ప్రభుత్వానికి 45 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. దీంతో, ప్రస్తుతం మణిపూర్‌లో బీజేపీ ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నితీష్ కుమార్

    తాజా

    Nara Rohit: ఈ ఏడాది అక్టోబర్‌లోనే నా పెళ్లి: నారా రోహిత్ నారా రోహిత్
    Israel: సహాయ కేంద్రం వద్ద కాల్పులు.. గాజాలో 30 మంది మృతి ఇజ్రాయెల్
    Sheikh Hasina: బంగ్లాదేశ్ మాజీ ప్రధానిపై మరో సంచలన కేసు నమోదు షేక్ హసీనా
    Opal Suchata: 'ప్రభాస్‌ మూవీ చూడగానే రివ్యూ ఇస్తా' : ప్రపంచ సుందరి ప్రభాస్

    నితీష్ కుమార్

    'బిహార్‌లో ఆటవిక రాజ్యం నడుస్తోంది'.. నితీశ్‌పై నడ్డా విమర్శనాస్త్రాలు బిహార్
    తేజస్వికి సీబీఐ సమన్లు జారీ చేయడంపై సీఎం నితీశ్ కుమార్ ఫైర్ తేజస్వీ యాదవ్
    దేశంలోని ప్రతిపక్షాలను ఏకం చేయడంలో చారిత్రక అడుగు వేశాం: రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ
    అందరం కలిసి ముందుకు సాగుతాం, బీజేపీని సున్నాకు తగ్గించడమే లక్ష్యం: మమతా బెనర్జీ మమతా బెనర్జీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025