NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Sambhal Mosque: ASI అనుమతి లేకుండా సంభాల్ మసీదులో  ఎలాంటి పనులు జరగకూడదు: జిల్లా మేజిస్ట్రేట్
    తదుపరి వార్తా కథనం
    Sambhal Mosque: ASI అనుమతి లేకుండా సంభాల్ మసీదులో  ఎలాంటి పనులు జరగకూడదు: జిల్లా మేజిస్ట్రేట్
    ASI అనుమతి లేకుండా సంభాల్ మసీదులో ఎలాంటి పనులు జరగకూడదు: జిల్లా మేజిస్ట్రేట్

    Sambhal Mosque: ASI అనుమతి లేకుండా సంభాల్ మసీదులో  ఎలాంటి పనులు జరగకూడదు: జిల్లా మేజిస్ట్రేట్

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 24, 2025
    04:42 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    గత ఏడాది నవంబర్‌లో ఉద్రిక్తతలకు కేంద్రబిందువుగా మారిన ఉత్తర్‌ప్రదేశ్‌లోని సంభాల్ "షాహీ జామా మసీదు" మరోసారి వార్తల్లో నిలిచింది.

    రంజాన్‌కు ముందుగా మసీదును పునరుద్ధరించేందుకు జామా మసీదు యాజమాన్యం పురావస్తు శాఖ (ASI) అనుమతి కోరింది.

    అయితే, ఈ అభ్యర్థన జరిగిన మరుసటి రోజే, సంభాల్ జిల్లా అధికార యంత్రాంగం ఏఎస్ఐ అనుమతి లేకుండా ఎలాంటి పనులు చేపట్టకూడదని ఆదేశాలు జారీ చేసింది.

    మసీదును శుభ్రం చేయడం, పెయింట్ చేయడం, అలంకరించడం కోసం అనుమతి కోరుతూ, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI)కి లేఖ రాసిన విషయాన్ని షాహీ జామా మసీదు నిర్వహణ కమిటీ అధ్యక్షుడు జాఫర్ అలీ ఆదివారం మీడియాతో వెల్లడించారు.

    వివరాలు 

    నిర్ణయం ఏఎస్ఐదే..

    ఈ లేఖపై స్పందించిన సంభాల్ జిల్లా కలెక్టర్ రాజేందర్ పెన్సియా మాట్లాడుతూ, ఈ అంశం ప్రస్తుతం కోర్టులో విచారణలో ఉందని, ఈ ప్రదేశం ఏఎస్ఐ పరిధిలోకి వస్తుందని స్పష్టం చేశారు.

    మసీదులో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టాలనే విషయంపై ఏఎస్ఐ మాత్రమే నిర్ణయం తీసుకోవాలని, అనుమతి లభించే వరకు ఎవరూ పనులు చేయరాదని ఆయన తెలిపారు.

    అంతేకాక, ఈ వివాదాస్పద కట్టడానికి రంగులు వేయాల్సిన అవసరం లేదని తాను భావిస్తున్నానని, అయినప్పటికీ నిర్ణయం ఏఎస్ఐదేనని స్పష్టంచేశారు.

    వివరాలు 

    మందిరాన్ని ధ్వంసం చేసి మసీదు నిర్మించారని కోర్టులో పిటిషన్

    మొఘల్ కాలంలో నిర్మితమైన ఈ మసీదు, ఒకప్పటి హిందూ ఆలయమైన హరిహర్ మందిరాన్ని ధ్వంసం చేసి కట్టారని కోర్టులో పిటిషన్ దాఖలైంది.

    దీనిపై విచారణ జరిపేందుకు గత ఏడాది నవంబర్‌లో కోర్టు సర్వే నిర్వహించాల్సిందిగా ఆదేశించింది.

    అయితే, అధికారులు సర్వే కోసం వెళ్లిన సమయంలో, అక్కడి ముస్లిం సమూహం వారికి అడ్డుగా నిలిచింది.

    ఈ ఉద్రిక్తతల్లో నలుగురు వ్యక్తులు మరణించగా, 30 మంది పైగా పోలీసులు గాయపడ్డారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఉత్తర్‌ప్రదేశ్

    తాజా

    Pawan Kalyan: రాజధానిపై కుట్రలు చేసిన వారిని విడిచిపెట్టం : పవన్‌ కళ్యాణ్ హెచ్చరిక పవన్ కళ్యాణ్
    ENG vs IND: ఇంగ్లాండ్‌ టూర్‌కు ముందు కీలక మార్పు.. భారత జట్టుకు కొత్త కోచ్ ఇంగ్లండ్
    Tragedy : బెంగళూరులో దారుణం.. సెక్స్‌కి నిరాకరించిందని.. బాలికను హత్య చేసి సూట్‌కేస్‌లో పడేశారు! బెంగళూరు
    Thuglife : దారుణంగా పడిపోయిన థగ్ లైఫ్‌ కలెక్షన్లు.. మూడ్రోజుల్లో ఎంతంటే? కమల్ హాసన్

    ఉత్తర్‌ప్రదేశ్

    Uttar Pradesh: న్యూఇయర్ వేళ ఘోర ఘటన.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి దారుణ హత్య భారతదేశం
    Lucknow Murders: లఖ్‌నవూ హత్య: కేసును తప్పుదోవ పట్టించడానికి అర్షద్‌ వీడియో రిలీజ్‌! భారతదేశం
    Prayagraj: 12 ఏళ్లకు ఒకసారి జరిగే కుంభమేళా.. వక్ఫ్ భూమిపై కొనసాగుతున్న వివాదం ఇండియా
    Maha Kumbh mela: ప్రారంభమైన మహా కుంభమేళా.. భక్తుల తాకిడితో కిటకిటలాడిన త్రివేణి సంగమం యోగి ఆదిత్యనాథ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025