Page Loader
Dense Fog: ఉత్తర భారతదేశాన్ని కమ్మేసిన పొగమంచు.. మరో 2 రోజులు ఇదే పరిస్థితి 
Dense Fog: ఉత్తర భారతదేశాన్ని కమ్మేసిన పొగమంచు.. మరో 2 రోజులు ఇదే పరిస్థితి

Dense Fog: ఉత్తర భారతదేశాన్ని కమ్మేసిన పొగమంచు.. మరో 2 రోజులు ఇదే పరిస్థితి 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 29, 2023
07:55 am

ఈ వార్తాకథనం ఏంటి

ఢిల్లీ, హర్యానా,పంజాబ్,ఉత్తరాఖండ్,ఉత్తరప్రదేశ్‌తో సహా ఉత్తర భారతదేశంలోని చాలా ప్రాంతాలను రాబోయే రెండు రోజుల పాటు దట్టమైన పొగమంచు కప్పివేసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(IMD)బులెటిన్ గురువారం తెలిపింది. చల్లని వాతావరణ పరిస్థితులు ప్రభావం వల్ల,నోయిడా,గ్రేటర్ నోయిడాలోని అన్ని పాఠశాలలు శుక్రవారం,శనివారం మూసివేస్తారు. ఢిల్లీ, హర్యానా,చండీగఢ్‌లలో డిసెంబర్ 31 వరకు పొగమంచు కమ్ముకుంటుందని ఐఎండీ హెచ్చరిక జారీ చేసింది. విమానాలు, రైల్వేలు, వాహనాల చోదకులు ఫాగ్ లైట్లు ఉపయోగించాలని వాతావరణశాఖ సలహా ఇచ్చింది.

Details 

జనవరి 4 వరకు ఉత్తర భారతదేశంలో కనిష్ట ఉష్ణోగ్రతలు

డిసెంబరు 30,31 తేదీల్లో జమ్ముకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో తేలికపాటి వర్షం లేదా మంచు కురిసే అవకాశం ఉంది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్,ఛత్తీస్‌గఢ్‌లలో కూడా డిసెంబర్ 31 నుండి జనవరి 2 వరకు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాతావరణ శాఖ ప్రకారం, చలిగాలుల వచ్చే జనవరి 4 వరకు ఉత్తర భారతదేశంలో కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉంది. రానున్న ఐదు రోజుల పాటు ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత ఏడు నుంచి ఎనిమిది డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉంది.

Details 

పొగమంచు కారణంగా ప్రమాదాలు 

IMD ప్రకారం, గురువారం ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత 8.4 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. అయితే గరిష్ట ఉష్ణోగ్రత 21.4 డిగ్రీల సెల్సియస్ వద్ద స్థిరపడింది. ఢిల్లీలో పొగమంచు కారణంగా నగరానికి వెళ్లే 22 రైళ్లు ఆలస్యంగా రావడంతో రైల్వే సర్వీసులు తగ్గాయి. ఉత్తరప్రదేశ్‌లో,దట్టమైన పొగమంచు కారణంగా సంభవించిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో కనీసం నలుగురు మరణించగా,ఆరుగురు గాయపడ్డారని, పోలీసులను ఉటంకిస్తూ PTI వార్తా సంస్థ ఒక నివేదిక తెలిపింది. ఉన్నావ్‌లో, స్థిరంగా ఉన్న ట్రక్కును మోటార్‌సైకిల్ ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు మరణించారు.

Details 

యోగి ఆదిత్యనాథ్ అయోధ్య పర్యటన రద్దు 

ముజఫర్‌నగర్‌లోని మిరాన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి ట్రక్కు ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు మరణించారు. అజంగఢ్‌లో, జిల్లాలోని అట్రౌలియా పోలీస్ స్టేషన్ పరిధిలో చిక్కుకుపోయిన పికప్ వ్యాన్‌ను వారు ప్రయాణిస్తున్న కారు ఢీకొనడంతో ఐదుగురు వ్యక్తులు గాయపడ్డారు. దట్టమైన పొగమంచు కారణంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గురువారం అయోధ్య పర్యటనను రద్దు చేసుకున్నారు. కొత్త విమానాశ్రయం,కొత్త రైల్వే స్టేషన్‌ను ప్రారంభించేందుకు డిసెంబరు 30న ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు ముందు ఆయన అయోధ్యకి వెళ్లాల్సి వచ్చింది.