
AP BJP President: రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవికి నేడు నోటిఫికేషన్.. పోటీలో బలమైన అభ్యర్థులు!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రతి మూడేళ్లకోసారి నిర్వహించే బీజేపీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో భాగంగా, ఈసారి ఆంధ్రప్రదేశ్ బీజేపీకి కొత్త రాష్ట్ర అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జూలై 1న రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక జరగనున్నట్టు పార్టీ సంస్థాగత ఎన్నికల అధికారి, రాజ్యసభ సభ్యుడు పాకా వెంకట సత్యనారాయణ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేశారు. జూన్ 29న రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు పేర్కొన్నారు. అదే రోజున ఓటర్ల జాబితాను కూడా ప్రకటించనున్నట్టు తెలిపారు. ఇక జూన్ 30వ తేదీన (సోమవారం) ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నామినేషన్ల స్వీకరణ, అనంతరం 1 నుంచి 2 గంటల మధ్య నామినేషన్ల పరిశీలన చేపడతారు.
Details
జూలై1న పోలింగ్
సాయంత్రం 4 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించనున్నారు. జూలై 1న పోలింగ్ జరిపి అదే రోజున రాష్ట్ర అధ్యక్షుడి పేరును ఖరారు చేయనున్నారు. ఈ ఎన్నికల ఎంటర్ ప్రక్రియను పర్యవేక్షించేందుకు కర్ణాటక ఎంపీ పీసీ మోహన్ ఎన్నికల పరిశీలకుడిగా నియమితులయ్యారు. ఇప్పటికే పదవిలో ఉన్న పురందేశ్వరి మరోసారి కొనసాగే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈసారి రాష్ట్ర అధ్యక్ష పదవికి పీవీఎన్ మాధవ్, జీవీఎల్ నరసింహారావు, సుజనాచౌదరి, నరసింహారెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి వంటి ప్రముఖులు పోటీలో ఉన్నారని సమాచారం. ఈ క్రమంలో ఎవరికి పార్టీ పగ్గాలు చేపడతారు అన్నదే ఆసక్తికరంగా మారింది.