
Odisha: పన్ను ఎగవేత ఆరోపణలపై బౌద్ డిస్టిలరీలపై IT దాడులు.. 150 కోట్ల రూపాయల వరకు రికవరీ
ఈ వార్తాకథనం ఏంటి
ఒడిశాలోని బౌద్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్లో బుధవారం ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) దాడులు నిర్వహించి రెండు రోజుల్లో భారీ మొత్తంలో నగదును స్వాధీనం చేసుకుంది.
పన్ను ఎగవేత ఆరోపణలతో మద్యం తయారీ కంపెనీపై అధికారులు దాడులు చేశారు.
ఒడిశాలోని బోలంగీర్, సంబల్పూర్, రాంచీ, జార్ఖండ్లోని లోహర్దగాలో దాడులు నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు.
బుధవారం వరకు రికవరీ చేసిన నగదు మొత్తం రూ. 50 కోట్లకు చేరుకుందని, ఆ తర్వాత నగదు మొత్తం ఎక్కువగా ఉండటంతో యంత్రాలు పనిచేయడం మానేశాయని ఏజెన్సీ పేర్కొంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
బౌద్ డిస్టిలరీలపై IT దాడులు
Income Tax (I-T) Department conducted raids at Boudh Distilleries Private Limited in Odisha and Jharkhand and recovered huge cache of currency notes from the premises linked to the company till yesterday. According to officials searches are going at Bolangir & Sambalpur in Odisha… pic.twitter.com/A5SWUdDNUm
— ANI (@ANI) December 7, 2023
Details
బోలాంగ్రీ కార్యాలయంలో భారీ మొత్తంలో నగదు స్వాధీనం
దాడులు ప్రారంభించిన రెండు రోజుల్లోనే పన్ను అధికారులు రూ.150 కోట్లకు పైగా నగదును సేకరించినట్లు ప్రాంతీయ వార్తా సంస్థ ఒడిశాటీవీ పేర్కొంది.
పశ్చిమ ఒడిశాలోని అతిపెద్ద దేశీయ మద్యం తయారీ విక్రయ సంస్థల్లో ఒకటైన బల్దియో సాహు & గ్రూప్ ఆఫ్ కంపెనీస్కు చెందిన బోలాంగ్రీ కార్యాలయంలో దాడుల సందర్భంగా భారీ మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నట్లు నివేదిక వెల్లడించింది.
ఈ కంపెనీ బౌద్ డిస్టిలరీ ప్రైవేట్ లిమిటెడ్ (BDPL) భాగస్వామ్య సంస్థ. అదనంగా, బోలంగీర్,తితిలాగఢ్లోని ఇద్దరు మద్యం వ్యాపారుల నివాసాలపై అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించి నగదును స్వాధీనం చేసుకున్నారు.
Details
పట్టణం వదిలి పారిపోయిన మద్యం వ్యాపారులు
ఈ దాడుల్లో లభించిన నగదును గత రాత్రి బొలంగీర్లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్కు తీసుకొచ్చి డిపాజిట్ చేశారు.
ఇంకా, తితిలాగఢ్లోని దీపక్ సాహు, సంజయ్ సాహు నివాసాల్లో సోదాలు నిర్వహించినట్లు ఏజెన్సీ వెల్లడించింది.
దాడుల గురించి పక్కా సమాచారం అందుకున్న మద్యం వ్యాపారులు ఇద్దరూ పట్టణం వదిలి పారిపోయినట్లు సమాచారం.
సుందర్గఢ్లోని సర్గిపాలిలో ఉన్న ఇల్లు, కార్యాలయం,దేశీయ మద్యం డిస్టిలరీపై కూడా I-T అధికారులు నిన్న రాత్రి దాడి చేశారు.
భువనేశ్వర్లోని బౌద్ డిస్టిలరీ కార్పొరేట్ కార్యాలయం, కొంతమంది కంపెనీ అధికారుల ఇళ్లతో పాటు, కంపెనీ ఫ్యాక్టరీ, బౌధ్ రామ్చికటలోని కార్యాలయం,రాణిసతి రైస్ మిల్లులో కూడా దాడులు జరిగాయి.