NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Odisha: పన్ను ఎగవేత ఆరోపణలపై బౌద్ డిస్టిలరీలపై IT దాడులు.. 150 కోట్ల రూపాయల వరకు రికవరీ 
    తదుపరి వార్తా కథనం
    Odisha: పన్ను ఎగవేత ఆరోపణలపై బౌద్ డిస్టిలరీలపై IT దాడులు.. 150 కోట్ల రూపాయల వరకు రికవరీ 
    పన్ను ఎగవేత ఆరోపణలపై బౌద్ డిస్టిలరీలపై IT దాడులు

    Odisha: పన్ను ఎగవేత ఆరోపణలపై బౌద్ డిస్టిలరీలపై IT దాడులు.. 150 కోట్ల రూపాయల వరకు రికవరీ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 07, 2023
    03:00 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఒడిశాలోని బౌద్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో బుధవారం ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) దాడులు నిర్వహించి రెండు రోజుల్లో భారీ మొత్తంలో నగదును స్వాధీనం చేసుకుంది.

    పన్ను ఎగవేత ఆరోపణలతో మద్యం తయారీ కంపెనీపై అధికారులు దాడులు చేశారు.

    ఒడిశాలోని బోలంగీర్, సంబల్‌పూర్, రాంచీ, జార్ఖండ్‌లోని లోహర్‌దగాలో దాడులు నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు.

    బుధవారం వరకు రికవరీ చేసిన నగదు మొత్తం రూ. 50 కోట్లకు చేరుకుందని, ఆ తర్వాత నగదు మొత్తం ఎక్కువగా ఉండటంతో యంత్రాలు పనిచేయడం మానేశాయని ఏజెన్సీ పేర్కొంది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    బౌద్ డిస్టిలరీలపై IT దాడులు

    Income Tax (I-T) Department conducted raids at Boudh Distilleries Private Limited in Odisha and Jharkhand and recovered huge cache of currency notes from the premises linked to the company till yesterday. According to officials searches are going at Bolangir & Sambalpur in Odisha… pic.twitter.com/A5SWUdDNUm

    — ANI (@ANI) December 7, 2023

    Details 

    బోలాంగ్రీ కార్యాలయంలో భారీ మొత్తంలో నగదు స్వాధీనం

    దాడులు ప్రారంభించిన రెండు రోజుల్లోనే పన్ను అధికారులు రూ.150 కోట్లకు పైగా నగదును సేకరించినట్లు ప్రాంతీయ వార్తా సంస్థ ఒడిశాటీవీ పేర్కొంది.

    పశ్చిమ ఒడిశాలోని అతిపెద్ద దేశీయ మద్యం తయారీ విక్రయ సంస్థల్లో ఒకటైన బల్దియో సాహు & గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌కు చెందిన బోలాంగ్రీ కార్యాలయంలో దాడుల సందర్భంగా భారీ మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నట్లు నివేదిక వెల్లడించింది.

    ఈ కంపెనీ బౌద్ డిస్టిలరీ ప్రైవేట్ లిమిటెడ్ (BDPL) భాగస్వామ్య సంస్థ. అదనంగా, బోలంగీర్,తితిలాగఢ్‌లోని ఇద్దరు మద్యం వ్యాపారుల నివాసాలపై అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించి నగదును స్వాధీనం చేసుకున్నారు.

    Details 

    పట్టణం వదిలి పారిపోయిన మద్యం వ్యాపారులు

    ఈ దాడుల్లో లభించిన నగదును గత రాత్రి బొలంగీర్‌లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్‌కు తీసుకొచ్చి డిపాజిట్ చేశారు.

    ఇంకా, తితిలాగఢ్‌లోని దీపక్ సాహు, సంజయ్ సాహు నివాసాల్లో సోదాలు నిర్వహించినట్లు ఏజెన్సీ వెల్లడించింది.

    దాడుల గురించి పక్కా సమాచారం అందుకున్న మద్యం వ్యాపారులు ఇద్దరూ పట్టణం వదిలి పారిపోయినట్లు సమాచారం.

    సుందర్‌గఢ్‌లోని సర్గిపాలిలో ఉన్న ఇల్లు, కార్యాలయం,దేశీయ మద్యం డిస్టిలరీపై కూడా I-T అధికారులు నిన్న రాత్రి దాడి చేశారు.

    భువనేశ్వర్‌లోని బౌద్ డిస్టిలరీ కార్పొరేట్ కార్యాలయం, కొంతమంది కంపెనీ అధికారుల ఇళ్లతో పాటు, కంపెనీ ఫ్యాక్టరీ, బౌధ్ రామ్‌చికటలోని కార్యాలయం,రాణిసతి రైస్ మిల్లులో కూడా దాడులు జరిగాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆదాయపు పన్నుశాఖ/ఐటీ

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    ఆదాయపు పన్నుశాఖ/ఐటీ

    విదేశీ నిధుల్లో అవకతవకలు; బీబీసీపై కేసు నమోదు చేసిన ఈడీ  బీబీసీ
    2023-24 ఐటీ రిటర్న్స్: ITR-1, ITR-4 ఆఫ్‌లైన్ ఫామ్స్ విడుదల ఆదాయం
    కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేళ చెట్లపై నోట్ల కట్టలు  కర్ణాటక
    హైదరాబాద్ ఆదాయపు పన్ను ఆఫీస్‌కు బాంబు బెదిరింపు.. భయం భయంలో అధికారులు ప్రభుత్వం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025