
Congress: డిసెంబర్ 21న CWC సమావేశం.. 2024 ఎన్నికల వ్యూహంపై చర్చ
ఈ వార్తాకథనం ఏంటి
ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి 2024లో జరగనున్న లోక్సభ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది.
ఈ మూడు రాష్ట్రాల ఎన్నికల్లో ఓటమి, అలాగే భవిష్యత్లో జరగనున్న సార్వత్రిక ఎలక్షన్స్పై చర్చించేందుకు డిసెంబర్ 21న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశం అవుతోంది.
2024 లోక్సభ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా ఈ సమావేశంలో చర్చించి.. విస్తృతమైన ప్రణాళికను సిద్ధం చేయనున్నారు.
అలాగే మిత్ర పక్షాలతో సీట్ల పంపకం, ప్రచార వ్యూహంపై ప్రధానంగా చర్చించనున్నారు.
ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో జరగనున్న ఈ సమావేశంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీతో పాటు పలువురు నేతలు పాల్గొనున్నారు.
కాంగ్రెస్
డిసెంబరు 19న ప్రతిపక్షాల 'ఇండియా' కూటమి సమావేశం
డిసెంబరు 19న ప్రతిపక్షాల 'ఇండియా' కూటమి సమావేశం జరగనుంది. అది జరిగిన రెండు రోజుల తర్వాత ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు.
అలాగే మరో విడత 'భారత్ జోడో యాత్ర'ను సార్వత్రిక ఎన్నికల సందర్భంగా రాహుల్ గాంధీ చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.
రాహుల్ యాత్రలో నిరుద్యోగం, ధరల పెరుగుదల ప్రధానాంశాలుగా ఉండనున్నట్లు సమాచారం.
ఈ యాత్రను తూర్పు భారతం నుంచి పడమర వైపు ఉండనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఈ యాత్రపై CWC నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.