NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Somasila dam: నదుల అనుసంధానంతోనే కరువు కష్టాలు తీరుతాయి: సీఎం 
    తదుపరి వార్తా కథనం
    Somasila dam: నదుల అనుసంధానంతోనే కరువు కష్టాలు తీరుతాయి: సీఎం 
    నదుల అనుసంధానంతోనే కరువు కష్టాలు తీరుతాయి: సీఎం

    Somasila dam: నదుల అనుసంధానంతోనే కరువు కష్టాలు తీరుతాయి: సీఎం 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Aug 20, 2024
    09:51 am

    ఈ వార్తాకథనం ఏంటి

    రాష్ట్రంలో కరువుకు నదుల అనుసంధానం ఒక్కటే పరిష్కారమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.

    సోమవారం శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని అనంతసాగరం మండలం సోమశిల గ్రామంలో సోమశిల ఆనకట్టను పరిశీలించారు.

    అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాబోయే సంవత్సరాల్లో.. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి-కృష్ణా నదులను అనుసంధానం చేసి వంశధార నుంచి పెన్నార్ వరకు అన్ని నదులను అనుసంధానం చేయాలని ప్రతిపాదించారు.

    నదుల అనుసంధానం విషయంలో ముందుకు వెళ్లాలంటే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు.

    అదృష్టవశాత్తూ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం పోలవరం నిర్మాణానికి ఆర్థికసాయం అందిస్తోందని, త్వరలోనే అది పూర్తవుతుందని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

    వివరాలు 

    ప్రమాదకర స్థితిలో సోమశిల ప్రాజెక్టు

    రాష్ట్రంలోని 70 శాతం ప్రాజెక్టులు నీటితో కళకళలాడుతుండగా,వానదేవుని దయతో ఈసారి ప్రభుత్వం 694 టీఎంసీల నీటిని నిల్వ చేయగలిగిందన్నారు.

    గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని,దీంతో గుండ్లకమ్మ, పులిచింతల ప్రాజెక్టుల గేట్లు కొట్టుకుపోయాయని,అన్నమయ్య డ్యాం పూర్తిగా కొట్టుకుపోయి అనేక మంది ప్రాణాలను బలిగొందని విమర్శించారు.

    పులిచింతల గేట్లు కొట్టుకుపోయిన వెంటనే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం స్పందించి ఉంటే అన్నమయ్య ఆనకట్ట దుర్ఘటన జరిగేది కాదని ముఖ్యమంత్రి అన్నారు.

    గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో సోమశిల ప్రాజెక్టు ఆప్రాన్‌వాల్‌,క్రెస్ట్‌గేట్‌లు దెబ్బతినడంతో ప్రమాదకర స్థితిలో ఉన్నాయన్నారు.

    గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సర్వే రాళ్లకు రూ.700కోట్లు,సాక్షి దినపత్రికకు ప్రకటనలకు రూ.415కోట్లు, విశాఖపట్నంలోని రుషికొండలో ప్యాలెస్ నిర్మాణానికి రూ.500కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని చంద్రబాబు ఆరోపించారు.

    వివరాలు 

    సోమశిల రిజర్వాయర్ మరమ్మతుల కోసం ప్రభుత్వం రూ.95 కోట్లు 

    వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సర్వే రాళ్లకు డబ్బులు వృథా చేయకుండా ఆప్రాన్, క్రెస్ట్ గేట్ల మరమ్మతులకు రూ.200 కోట్లు వెచ్చిస్తే సోమశిల జలాశయం ఇంతటి దుర్భర పరిస్థితిలో ఉండేది కాదన్నారు.

    సోమశిల రిజర్వాయర్ మరమ్మతుల కోసం ప్రభుత్వం రూ.95 కోట్లు విడుదల చేస్తుందని, వచ్చే ఏడాది వానాకాలం ప్రారంభమయ్యేలోపు పనులు సకాలంలో పూర్తి చేస్తామని చెప్పారు.

    మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, పొంగూరు నారాయణ, ఎమ్మెల్యేలు ఎస్‌ చంద్రమోహన్‌రెడ్డి, కురుకొండ రామకృష్ణ, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, ఇంటూరు నాగేశ్వరరావు, కాకర్ల సురేష్‌, జిల్లా కలెక్టర్‌ ఓ ఆనంద్‌ తదితరులు పాల్గొన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చంద్రబాబు నాయుడు

    తాజా

    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ
    Andhra Pradesh: మహిళలకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు నాయుడు

    చంద్రబాబు నాయుడు

    TDP-Janasena-BJP: అమిత్‌షా,నడ్డాలతో చంద్రబాబు, పవన్‌ భేటీ.. నేడు పొత్తుపై చర్చ భారతదేశం
    బీజేపీ, జనసేన, టీడీపీ మధ్య సీట్ల పంపకం కొలిక్కి.. అమిత్ షాతో ముగిసిన భేటీ  పవన్ కళ్యాణ్
    Chandrababu Naidu: ఈ నెల 14న టిడిపి రెండో జాబితా: చంద్రబాబు భారతదేశం
    TDP Second List: టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల.. అభ్యర్థులు వీళ్లే  తెలుగు దేశం పార్టీ/టీడీపీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025