NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఇద్దరు పిల్లలు ఉన్న వారికే ఓటు హక్కు; ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు
    తదుపరి వార్తా కథనం
    ఇద్దరు పిల్లలు ఉన్న వారికే ఓటు హక్కు; ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు
    ఇద్దరు పిల్లలు ఉన్న వారికే ఓటు హక్కు; ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు

    ఇద్దరు పిల్లలు ఉన్న వారికే ఓటు హక్కు; ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు

    వ్రాసిన వారు Stalin
    Apr 01, 2023
    04:06 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    హైదరాబాద్‌లో జరిగిన శ్రీరామనవమి ర్యాలీలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు ఎమ్మెల్యే రాజా‌సింగ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. అఫ్జల్‌గంజ్ పోలీసులు భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ ) సెక్షన్ 153-ఏ, 506 కింద అభియోగాలు మోపారు.

    అఫ్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఎస్‌ఐ వీరబాబు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదైంది.

    గతంలో కూడా వివాదాస్ప వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన్ను బీజేపీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ క్రమంలో రాజా సింగ్‌ పాల్గొనే శ్రీరామనవమి ర్యాలీలో అల్లర్లు చెలరేగకుండా ఉండేందుకు పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

    అందులో భాగంగా ఎస్‌ఐ వీరబాబుబును ఎస్‌ఏ బజార్ ప్రాంతంలో నియమించారు. ఈ క్రమంలో ఆయన పరిధిలోకి వచ్చాక రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

    రాజాసింగ్

    హిందూ దేశానికి రాజధాని దిల్లీ కాదు: రాజాసింగ్

    శ్రీరాముడి శోభాయత్ర ఎస్ఏ బజార్‌కు చేరుకోగానే, ఏనుగుపై స్వారీ వచ్చిన రాజాసింగ్ హిందీలో ప్రసంగించినట్లు వీరబాబు పేర్కొన్నారు.

    భారతదేశం హిందూ రాష్ట్రంగా మారితే ఇద్దరు పిల్లల విధానాన్ని అనుసరించే వారికి మాత్రమే ఓటు హక్కు కల్పించనున్నట్లు మరో వివాదానికి తెర లేపారు.

    'మేము ఐదుగురం, మా 50మంది' విధానాన్ని అనుసరించే వారికి ఓటు వేయడానికి అనుమతించబడదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

    హిందూ దేశ రాజధాని దిల్లీ ఉండదని కాశీ లేదా మధుర లేదా అయోధ్యలను సాధువులు ఎంచుకుంటారన్నారు.

    హిందూ రాష్ట్రం రైతులకు అనుకూలంగా పన్ను రహితంగా ఉంటుందని, అక్కడ గో హత్య, మతమార్పిడి ఉండదని అన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    హైదరాబాద్
    శ్రీరామ నవమి
    తెలంగాణ

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    హైదరాబాద్

    కేటీఆర్: తెలంగాణలో గ్లోబల్ రెస్టారెంట్ కంపెనీ 'ఇన్‌స్పైర్ బ్రాండ్స్' పెట్టుబడులు కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)
    హైదరాబాద్ మెట్రోను పరిశీలించిన పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ భారతదేశం
    హైదరాబాద్‌లో అమెజాన్ ఎయిర్ సేవలను ప్రారంభించిన మంత్రి కేటీఆర్ అమెజాన్‌
    స్పైస్‌జెట్: దిల్లీ-హైదరాబాద్ విమానంలో ప్రయాణికుడి అనుచిత ప్రవర్తన, అరెస్టు చేసిన పోలీసులు విమానం

    శ్రీరామ నవమి

    శ్రీరామ నవమి వేడుకల్లో అపశృతి; చలువ పందిళ్లు పూర్తిగా దగ్ధం పశ్చిమ గోదావరి జిల్లా
    ఇండోర్ ఆలయంలో కూలిపోయిన మెట్లబావి; 13మంది మృతి మధ్యప్రదేశ్

    తెలంగాణ

    ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు సమన్లు జారీ చేసిన ఈడీ కల్వకుంట్ల కవిత
    TSRTC: ప్రయాణికుల కోసం రెండు స్పెషల్ ఆఫర్స్‌ ప్రకటించిన తెలంగాణ ఆర్టీసీ హైదరాబాద్
    ఏపీలో అవినాష్ రెడ్డి, తెలంగాణలో కవిత అరెస్టు అవుతారా? ఆందోళనలో అధికార పార్టీలు ఆంధ్రప్రదేశ్
    మహిళల కోసం 'గృహలక్ష్మి' పథకాన్ని ప్రారంభించిన తెలంగాణ ప్రభుత్వం; ఇంటి నిర్మాణానికి రూ.3లక్షలు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025