NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / సూడాన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను తరలించేందుకు 'ఆపరేషన్ కావేరి' ప్రారంభం 
    తదుపరి వార్తా కథనం
    సూడాన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను తరలించేందుకు 'ఆపరేషన్ కావేరి' ప్రారంభం 
    సూడాన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను తరలించేందుకు 'ఆపరేషన్ కావేరి' ప్రారంభం

    సూడాన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను తరలించేందుకు 'ఆపరేషన్ కావేరి' ప్రారంభం 

    వ్రాసిన వారు Stalin
    Apr 25, 2023
    11:31 am

    ఈ వార్తాకథనం ఏంటి

    సూడాన్‌లో సైన్యం, పారామిలిటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (ఆర్‌ఎస్‌ఎఫ్) మధ్య భీకర ఆదిపత్య పోరు జరుగుతోంది. ఈ పోరాటం కారణంగా సూడాన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను రక్షించేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఇందుకోసం భారతదేశం 'ఆపరేషన్ కావేరి'ని ప్రారంభించింది.

    వైమానిక దళానికి చెందిన రెండు సీ-130జే విమానాలు జెడ్డాలో సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

    అలాగే భారతీయ పౌరులను తరలించడానికి 'ఐఎన్ఎస్ సుమేధ' కూడా సూడాన్‌ పోర్టుకు చేరకున్నట్లు విదేశాంగ మంత్రి జైశంకర్ ట్వీట్ చేశారు.

    దాదాపు 4000మంది భారతీయులు సూడాన్‌లో చిక్కుకున్నట్లు కేంద్రం తెలిపింది.

    సూడాన్

    సూడాన్ పోర్టుకు చేరుకుంటున్న భారతీయులు

    సాధారణ సైన్యం మరియు పారామిలిటరీ బృందం మధ్య ఆధిపత్య పోరు ఫలితంగా భీకర పోరును ఎదుర్కొంటున్న సూడాన్ నుంచి తమ ప్రజలను తిరిగి తీసుకురావడానికి భారతదేశం సోమవారం 'ఆపరేషన్ కావేరి' ప్రారంభించింది.

    సుడాన్ నుంచి భారతీయ పౌరులను తరలించే ప్రయత్నం జరుగుతోందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తెలిపారు. సుమారు 500 మంది పౌరులు పోర్ట్ సూడాన్‌కు చేరుకున్నారని ఆయన చెప్పారు.

    మరికొంతమంది మార్గ మధ్యలో ఉన్నారని జైశంకర్ ఈ ట్వీట్ చేశారు. సౌదీ అరేబియా, యూఏఈలోని రాయబారుల సమన్వయంతో ఎస్ జైశంకర్ భారతీయులను స్వదేశానికి తరలింపును ముమ్మరం చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    భారతదేశం
    సూడాన్
    సుబ్రమణ్యం జైశంకర్
    విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    భారతదేశం

    ఏప్రిల్ 4న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్
    మరోసారి చైనా కవ్వింపు; అరుణాచల్‌‌లోని 11ప్రదేశాలకు పేరు మార్చిన డ్రాగన్ దేశం చైనా
    20% వృద్ధి చెంది, ₹20 లక్షల కోట్ల మార్కుకు చేరుకున్న ఆదాయపు పన్ను వసూళ్లు ఆర్ధిక వ్యవస్థ
    భారతీయ కంపెనీ ఐడ్రాప్స్‌లో ప్రమాదకర 'డ్రగ్-రెసిస్టెంట్ బ్యాక్టీరియా'; అమెరికా ఆందోళన అమెరికా

    సూడాన్

    సూడాన్‌లో చిక్కుకుపోయిన 4వేలమంది భారతీయులు; ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమావేశం  ప్రధాన మంత్రి
    సూడాన్ పోరాటంలో 413 మంది మృతి: డబ్ల్యూహెచ్‌ఓ ప్రపంచ ఆరోగ్య సంస్థ

    సుబ్రమణ్యం జైశంకర్

    'పొరుగు దేశాలతో మంచి సంబంధాలను కోరుకుంటున్నాం'.. పాక్, చైనాకు భారత్ గట్టి కౌంటర్ సైప్రస్
    పాక్‌ను 'ఉగ్రవాద కేంద్రం' అంటే.. చాలా చిన్న పదం అవుతుంది: జైశంకర్ పాకిస్థాన్
    భారత్-చైనా: 1962 యుద్ధం, 2020లో ఘర్షణ మధ్య పోలిక లేదు: జైరామ్ రమేష్ కాంగ్రెస్
    మోదీని విమర్శించిన ఇన్వస్టర్ జార్జ్ సోరోస్‌కు జైశంకర్ గట్టి కౌంటర్ ప్రధాన మంత్రి

    విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి

    మాల్దీవుల్లో భారత హైకమిషన్‌పై దాడికి కుట్ర.. స్పందించిన విదేశాంగ శాఖ మాల్దీవులు
    టర్కీకి ఆపన్నహస్తం: మొదటి విడతగా ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది, భూకంప సహాయక సామగ్రిని పంపిన భారత్ భారతదేశం
    దిల్లీలో జరిగే జీ20 సమావేశానికి చైనా హాజరు చైనా
    బీబీసీ ఆఫీసుల్లో ఐటీ సోదాల అంశం; బ్రిటన్ మంత్రికి గట్టిగానే చెప్పిన జైశంకర్ సుబ్రమణ్యం జైశంకర్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025