NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / operation sindoor: ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదు : భారత్ 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    operation sindoor: ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదు : భారత్ 
    ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదు : భారత్

    operation sindoor: ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదు : భారత్ 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 11, 2025
    05:51 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత్‌ తన స్థిరమైన, కఠినమైన కశ్మీర్‌ విధానాన్ని మరోసారి స్పష్టంగా ప్రకటించింది. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (POK) తిరిగి పొందడమే మిగిలిన ఒకే ఒక్క అంశమని భారత విదేశాంగశాఖ స్పష్టం చేసింది.

    ఈ నెల 7న పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసిన తర్వాత పాకిస్థాన్‌ డీజీఎంవోకి సమాచారం ఇచ్చినట్లు విదేశాంగశాఖ పేర్కొంది.

    చర్చలకు సిద్ధమున్నామని పేర్కొన్నప్పటికీ పాక్‌ నుంచి స్పందన రాలేదని వెల్లడించింది.

    అయితే మే 10న కాల్పుల తీవ్రత పెరిగిన తర్వాత పాకిస్థాన్‌ చర్చల ప్రతిపాదనతో ముందుకొచ్చిందని వెల్లడించారు.

    ఈ సందర్భంగా భారత్‌ జరిపిన దాడుల్లో రహిమ్యార్‌ఖాన్‌ వైమానిక స్థావరం పూర్తిగా ధ్వంసమైందని చెప్పింది.

    Details

    8 ఉగ్రవాద స్థావరాలపై దాడి

    బహావల్‌పూర్‌లోని జైషే మహ్మద్‌ ప్రధాన కార్యాలయంతో పాటు మురుద్కే, ముజఫర్‌బాద్‌లోని ఉగ్ర కేంద్రాలు కూడా ధ్వంసమైనట్లు తెలిపింది.

    ఆపరేషన్‌ సిందూర్‌ ఇంకా కొనసాగుతోందని స్పష్టం చేసిన విదేశాంగశాఖ, పాక్‌ దాడులకు భారత్‌ బాంబులతో సమాధానం ఇచ్చిందన్నారు.

    మొత్తం 8 ఉగ్రవాద స్థావరాలపై లక్ష్యబద్ధంగా దాడులు జరిగినట్లు పేర్కొంది.

    మధ్యవర్తిత్వం అవసరం లేదు

    భారత వైఖరి స్పష్టమని విదేశాంగశాఖ మరోసారి స్పష్టం చేసింది. కేవలం పీఓకే విషయమే మిగిలి ఉందన్నారు.

    ఉగ్రవాదుల అప్పగింతపై మాత్రమే చర్చలు ఉంటాయని, మిగతా అంశాలపై చర్చల ఆసక్తి లేదని చెప్పింది. ఇదే సందర్భంలో 'మధ్యవర్తిత్వానికి భారత్‌ తావివ్వదలేదని తెలిపింది.

    Details

    ఆపరేషన్‌ సిందూర్ విజయవంతం 

    ప్రభుత్వ వర్గాల ప్రకారం, ఆపరేషన్‌ సిందూర్‌ ద్వారా భారత్‌ మూడు ప్రధాన లక్ష్యాలు సాధించింది—సైనికంగా, రాజకీయంగా, మానసికంగా పాక్‌ను తీవ్రంగా దెబ్బకొట్టిందని వెల్లడించింది.

    ప్రతి దశలోనూ పాకిస్థాన్‌ వెనుకబడిందని, భారత్‌ ఆధిపత్యాన్ని ఆ దేశం అంగీకరించక తప్పలేదని తెలిపింది.

    పాక్‌ వైమానిక స్థావరాలపై జరిగిన దాడుల తర్వాత దాయాది దేశం ఇక పోరాడలేమని గ్రహించినట్లు పేర్కొంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆపరేషన్‌ సిందూర్‌

    తాజా

    operation sindoor: ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదు : భారత్  ఆపరేషన్‌ సిందూర్‌
    HYD Metro: ప్రపంచానికి బ్లూప్రింట్‌గా హైదరాబాద్ మెట్రో.. హార్వర్డ్ విశ్వవిద్యాలయం ప్రశంసలు! హైదరాబాద్
    IPL 2025: ఐపీఎల్ 2025కి గ్రీన్ సిగ్నల్.. ఫైనల్ ఎప్పుడంటే..? ఐపీఎల్
    PM Modi: దాడికి ప్రతిదాడి తీవ్రంగానే ఉంటుంది.. మోదీ గట్టి హెచ్చరిక నరేంద్ర మోదీ

    ఆపరేషన్‌ సిందూర్‌

    Operation Sindoor: పాక్‌లోని ఉగ్రవాద శిబిరాలపై 'ఆపరేషర్‌ సిందూర్‌'.. దేశవ్యాప్తంగా అప్రమత్తమైన భద్రతా బలగాలు, పోలీసులు  భారతదేశం
    Vyomika Singh and Sophia Qureshi:ఆపరేషన్ సింధూర్..ఎవరి..సోఫియా ఖురేషి, వ్యోమికా సింగ్ ? భారతదేశం
    Operation Sindoor: పాక్‌లో ఉగ్ర స్థావరాలపై మెరుపుదాడి.. మాజీ, ప్రస్తుత క్రికెటర్ల స్పందనలివే!  క్రీడలు
    Operation Sindoor: 'ఆపరేషన్ సిందూర్'.. 25 నిమిషాల్లోనే ఖేల్ ఖతం.. దుకాణ్ బంద్..వెల్లడించిన సైన్యం భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025