NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / INDIA: ఇండియా కూటమి ఎంపీల కీలక మీటింగ్‌కి తృణమూల్‌ డుమ్మా
    తదుపరి వార్తా కథనం
    INDIA: ఇండియా కూటమి ఎంపీల కీలక మీటింగ్‌కి తృణమూల్‌ డుమ్మా
    ఇండియా కూటమి ఎంపీల కీలక మీటింగ్‌కి తృణమూల్‌ డుమ్మా

    INDIA: ఇండియా కూటమి ఎంపీల కీలక మీటింగ్‌కి తృణమూల్‌ డుమ్మా

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 02, 2024
    02:36 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో అదానీ అంశం, యూపీ సంభల్‌ హింసాకాండ వంటి పరిణామాలు దుమారం రేపుతున్నాయి.

    ఈ అంశాలపై విపక్షాలు తీవ్రంగా పట్టుబడుతున్న కారణంగా ఉభయసభలలో వాయిదాలు కొనసాగుతున్నాయి.

    ఈ పరిస్థితుల్లో, ఇండియా కూటమిలోని విపక్ష పార్టీల ఎంపీలు సమావేశమయ్యారు.

    అయితే, ఈ కీలక సమావేశానికి తృణమూల్‌ కాంగ్రెస్‌ (Trinamool Congress) దూరంగా ఉంది.

    సోమవారం పార్లమెంట్‌ సమావేశాలు వాయిదా పడిన తర్వాత, కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఛాంబర్‌లో కూటమి ఎంపీలు సమావేశమయ్యారు.

    ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చ జరిగి, ఎన్డీయే ప్రభుత్వాన్ని ఎలా ఎదుర్కోవాలన్న దానిపై వ్యూహరచన జరిగింది.

    కానీ తృణమూల్‌ కాంగ్రెస్‌ సమావేశానికి హాజరు కాకపోవడం వివాదాస్పదంగా మారింది.

    వివరాలు 

    ఇండియా కూటమిలోని పార్టీలు మధ్య విభేదాలు

    తృణమూల్‌ వర్గాల సమాచారం ప్రకారం, ధరల పెరుగుదల, నిరుద్యోగం, నిధుల కొరత, మణిపూర్‌ సమస్య తదితర ఆరు కీలక అంశాలపై మాత్రమే పార్లమెంట్‌లో చర్చ జరగాలని ఆ పార్టీ కోరుతోంది.

    అయితే, కాంగ్రెస్‌ అధికంగా అదానీ వ్యవహారంపైనే దృష్టి సారించాలనుకుంటోందని పేర్కొంటూ తృణమూల్‌ నేతలు, ఎజెండాలో తమ ప్రధాన అంశాలు లేవని, అందుకే సమావేశానికి హాజరుకాలేదని స్పష్టం చేశారు.

    ఈ పరిణామాలు ఇండియా కూటమిలోని పార్టీలు మధ్య విభేదాలను మరింత కరుడుగట్టించాయని విశ్లేషకులు చెబుతున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఇండియా కూటమి

    తాజా

    Jasprit Bumrah: బుమ్రాకు కెప్టెన్సీ ఇవ్వకూడదంటూ రవిశాస్త్రి కీలక సూచన! జస్పిత్ బుమ్రా
    Narne Nithin : సతీష్ వేగేశ్న - నార్నే నితిన్ కాంబోలో 'శ్రీ శ్రీ శ్రీ రాజావారు', రిలీజ్ డేట్ లాక్ టాలీవుడ్
    USA: కాలిఫోర్నియాలో బాంబు పేలుడు కలకలం.. ఒకరు మృతి.. నలుగురికి గాయాలు అమెరికా
    Earthquake: అరుణాచల్ ప్రదేశ్‌లో ఉదయాన్నే భూకంపం.. రిక్టర్ స్కేలుపై 3.8 తీవ్రత! అరుణాచల్ ప్రదేశ్

    ఇండియా కూటమి

    అవిశ్వాసంపై నిర్మలా సీతారామన్ ప్రసంగం.. లోక్‌సభ నుంచి వాకౌట్  చేసిన విపక్షాలు  లోక్‌సభ
    ఇవాళ ఇండియా కూటమి మూడో  కీలక సమావేశం..ఖరారు కానున్న ప్రచార వ్యూహం, లోగో ముంబై
    ముంబై : ఇవాళ రెండో రోజు కొనసాగనున్న ఇండియా కూటమి కీలక సమావేశం ముంబై
    "సాధ్యమైనంత వరకు ఎన్నికలలో కలిసి పోటీ చేస్తాం": ఇండియా బ్లాక్ రిజల్యూషన్ భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025