NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / INDIA: వక్ఫ్‌ బోర్డు సవరణ బిల్లు పై చర్చలో పాల్గొంటాం.. కానీ! 'ఇండియా' కూటమి కీలక నిర్ణయం 
    తదుపరి వార్తా కథనం
    INDIA: వక్ఫ్‌ బోర్డు సవరణ బిల్లు పై చర్చలో పాల్గొంటాం.. కానీ! 'ఇండియా' కూటమి కీలక నిర్ణయం 
    వక్ఫ్‌ బోర్డు సవరణ బిల్లు పై చర్చలో పాల్గొంటాం.. కానీ! 'ఇండియా' కూటమి కీలక నిర్ణయం

    INDIA: వక్ఫ్‌ బోర్డు సవరణ బిల్లు పై చర్చలో పాల్గొంటాం.. కానీ! 'ఇండియా' కూటమి కీలక నిర్ణయం 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 01, 2025
    10:23 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    వక్ఫ్‌ బోర్డు సవరణ బిల్లు (Waqf Bill)ను బుధవారం లోక్‌సభలో ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో, 'ఇండియా' కూటమికి చెందిన ప్రతిపక్ష పార్టీలు కీలక సమావేశాన్ని నిర్వహించాయి.

    ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు సమాచారం.

    ఈ సమావేశం సాయంత్రం ఢిల్లీలో జరిగింది, ఇందులో కాంగ్రెస్‌, శివసేన (యూబీటీ), సీపీఎం సహా ఇతర ప్రతిపక్ష పార్టీల నేతలు పాల్గొన్నారు.

    లోక్‌సభలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించడంతో పాటు, ఈ బిల్లుపై చర్చలో క్రియాశీలంగా పాల్గొనాలని కానీ, చివరికి వ్యతిరేకంగా ఓటు వేయాలని నిర్ణయించుకున్నారు.

    ఈ భేటీ అనంతరం, లోక్‌సభలో ప్రతిపక్షాలు చర్చలో పాల్గొంటాయని, అయితే బిల్లుకు వ్యతిరేకంగా ఓటేయనున్నట్లు శివసేన (యూబీటీ) ఎంపీ ప్రియాంకా చతుర్వేది తెలిపారు.

    వివరాలు 

    ప్రతిపక్ష ఐక్యత 

    వక్ఫ్ (సవరణ)బిల్లుపై మోదీ సర్కార్‌ రాజ్యాంగ విరుద్ధమైన విధానాన్ని అనుసరిస్తోందని,విభజనశీల అజెండాను ఓడించేందుకు అన్ని ప్రతిపక్ష పార్టీలు ఐక్యంగా ఉన్నాయని కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు.

    పార్లమెంటులో ప్రతిపక్ష పార్టీలు ఐక్యంగా పనిచేస్తాయని ఆయన 'ఎక్స్‌'లో పోస్టు చేశారు.

    భద్రతా ఏర్పాట్లు

    ఇక కాంగ్రెస్ పార్టీ తన ఎంపీలకు విప్‌ జారీ చేసింది. వచ్చే మూడు రోజులు సభకు తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించింది.

    వక్ఫ్‌(సవరణ)బిల్లును కేంద్రం లోక్‌సభలో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు.

    అసాంఘిక శక్తుల వల్ల శాంతిభద్రతలకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా ఉండేందుకు పలు సున్నితమైన ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.

    శాంతి భద్రతలను కాపాడేందుకు రాత్రి గస్తీని పెంచారు. అదనపు భద్రతా బలగాలను మోహరించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఇండియా కూటమి

    తాజా

    KKR vs RCB : బెంగళూరులో మ్యాచ్ రద్దు.. కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ

    ఇండియా కూటమి

    అవిశ్వాసంపై నిర్మలా సీతారామన్ ప్రసంగం.. లోక్‌సభ నుంచి వాకౌట్  చేసిన విపక్షాలు  లోక్‌సభ
    ఇవాళ ఇండియా కూటమి మూడో  కీలక సమావేశం..ఖరారు కానున్న ప్రచార వ్యూహం, లోగో ముంబై
    ముంబై : ఇవాళ రెండో రోజు కొనసాగనున్న ఇండియా కూటమి కీలక సమావేశం ముంబై
    "సాధ్యమైనంత వరకు ఎన్నికలలో కలిసి పోటీ చేస్తాం": ఇండియా బ్లాక్ రిజల్యూషన్ భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025