NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టు అభివృద్ధిలో కీలకమైన ముందడుగు.. సిటీ సైడ్‌ డెవలప్‌మెంట్‌ కోసం 500 ఎకరాల భూ కేటాయింపు 
    తదుపరి వార్తా కథనం
    Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టు అభివృద్ధిలో కీలకమైన ముందడుగు.. సిటీ సైడ్‌ డెవలప్‌మెంట్‌ కోసం 500 ఎకరాల భూ కేటాయింపు 
    సిటీ సైడ్‌ డెవలప్‌మెంట్‌ కోసం 500 ఎకరాల భూ కేటాయింపు

    Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టు అభివృద్ధిలో కీలకమైన ముందడుగు.. సిటీ సైడ్‌ డెవలప్‌మెంట్‌ కోసం 500 ఎకరాల భూ కేటాయింపు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 22, 2025
    04:34 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఏవియేషన్‌ హబ్‌గా తీర్చిదిద్దే యోజనలో భాగంగా, సిటీ సైడ్‌ డెవలప్‌మెంట్‌ కోసం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

    ఇందుకు సంబంధించినగా 500 ఎకరాల భూమిని కేటాయిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

    ఈ భూమిని జీవీఐఏఎల్‌ (GVIAL) సంస్థకు అప్పగించేందుకు ఇటీవలే రాష్ట్ర క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది.

    మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం, విమానాశ్రయ అభివృద్ధికి మొత్తం 1,733 ఎకరాలు అవసరమవుతాయని అంచనా వేయగా, జాతీయ రహదారి నుండి విమానాశ్రయం వరకు అనుసంధాన సౌకర్యం కోసం అదనంగా 92 ఎకరాలను ప్రతిపాదించారు.

    వివరాలు 

    అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూడు దశల్లో నిర్మించేందుకు మాస్టర్‌ ప్లాన్‌

    విమానాశ్రయం లోపల కార్గో సేవల విస్తరణ కోసం 83.5ఎకరాలు,నార్త్‌ టెర్మినల్‌ భవన నిర్మాణానికి 98 ఎకరాలు,అలాగే విమానాశ్రయ పరిమితిని ఏర్పాటు చేయడానికి 494ఎకరాలు అవసరమవుతాయని ప్రణాళికలు రూపొందించారు.

    నివాస ప్రాంతాలు,ఇతర మౌలిక అవసరాల కోసం 201 ఎకరాల భూమిని కేటాయించాలని నిర్ణయించారు.

    ఏటా సుమారు 36 మిలియన్ల ప్రయాణికుల రాకపోకలను దృష్టిలో ఉంచుకుని,ఈ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూడు దశల్లో నిర్మించేందుకు మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించారు.

    ఈ ప్రణాళిక ప్రకారం మొత్తం 2,703ఎకరాలు అవసరమవుతాయని భావించినా,గత వైసీపీ ప్రభుత్వం కేవలం 2,203ఎకరాల భూమినే కేటాయించింది.

    ప్రస్తుతం ఈప్రాజెక్ట్‌ ఆర్థిక స్థిరత్వాన్ని(వయబిలిటీ)పరిగణనలోకి తీసుకుని భవిష్యత్తు అవసరాలు, సిటీ సైడ్‌ డెవలప్‌మెంట్‌ దృష్ట్యా మిగిలిన 500ఎకరాలను కేటాయిస్తూ కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టు అభివృద్ధిలో కీలకమైన ముందడుగు.. సిటీ సైడ్‌ డెవలప్‌మెంట్‌ కోసం 500 ఎకరాల భూ కేటాయింపు  ఆంధ్రప్రదేశ్
    Jyoti Malhotra: పాకిస్తాన్‌కి 'జ్యోతి మల్హోత్రా' ప్రయాణాన్ని స్పాన్సర్ చేసింది యూఏఈ కంపెనీ..! జ్యోతి మల్హోత్రా
    S Jaishankar: పహల్గామ్‌ ఉగ్రదాడి ఘటన.. పాక్‌ ఆర్మీ చీఫ్‌ మునీర్‌పై జైశంకర్‌ సంచలన ఆరోపణలు సుబ్రమణ్యం జైశంకర్
    Stock Market: కుదేలైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 1000 పాయింట్లు డౌన్, నిఫ్టీ 24,550 దిగువకు! స్టాక్ మార్కెట్

    ఆంధ్రప్రదేశ్

    Andhra Pradesh: క్వాంటం వ్యాలీగా అమరావతి.. ఐబీఎం, టీసీఎస్ , ఎల్ అండ్ టీలతో ఒప్పందం ! భారతదేశం
    Chandrababu: క్రియేటివ్‌ ల్యాండ్ ఆసియాతో ఒప్పందం.. 25వేల ఉద్యోగావకాశాలు! చంద్రబాబు నాయుడు
    Andhrapradesh: కౌలు రైతులకూ 'అన్నదాత సుఖీభవ'.. 20వ తేదీలోగా అర్హుల జాబితాలు సిద్ధం చేయాలన్న ప్రభుత్వం  భారతదేశం
    AP Rains: గాలివాన బీభత్సం.. ఏడుగురు మృతి.. వందల ఎకరాల పంట నష్టం భారీ వర్షాలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025