NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Telangana: టీజీఎస్పీడీసీఎల్ లో 2263 మందికి పదోన్నతులు
    తదుపరి వార్తా కథనం
    Telangana: టీజీఎస్పీడీసీఎల్ లో 2263 మందికి పదోన్నతులు
    టీజీఎస్పీడీసీఎల్ లో 2263 మందికి పదోన్నతులు

    Telangana: టీజీఎస్పీడీసీఎల్ లో 2263 మందికి పదోన్నతులు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Aug 19, 2024
    09:07 am

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (TGSPDCL)లోని 2263 మంది ఉద్యోగులకు ఆదివారం ఏకకాలంలో పదోన్నతులు లభించాయి.

    ఈ మేరకు కంపెనీ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫరూఖీ ఉత్తర్వులు జారీ చేశారు.

    కంపెనీ యాజమాన్యం జూనియర్‌ లైన్‌మెన్‌ నుంచి చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ ర్యాంక్‌ అధికారుల వరకు ప్రమోషన్‌ ఉత్తర్వులు జారీ చేసింది.

    ఇందులో 16 మంది పి అండ్​ జి(P&G) ఆఫీసర్లు కాగా, 47 మంది అకౌంట్స్​నుండి, 2099 మంది ఉద్యోగులు ఆపరేషన్స్​ అండ్​ మెయిన్​టెనెన్స్(O&M)​ నుండి ఉన్నారు.

    వివరాలు 

    ఇద్దరు సూపరింటెండెంట్ ఇంజనీర్లు (SE) చీఫ్ ఇంజనీర్లుగా  పదోన్నతి 

    సమాచారం ప్రకారం, ఇద్దరు సూపరింటెండెంట్ ఇంజనీర్లు (SE) చీఫ్ ఇంజనీర్లుగా, ఒక జనరల్ మేనేజర్ జాయింట్ సెక్రటరీగా పదోన్నతి పొందారు.

    8 మంది డివిజనల్ ఇంజనీర్లకు (డీఈ) ఎస్‌ఈలుగా, 30 మంది అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్లకు డీఈలుగా, 58 మంది అసిస్టెంట్ ఇంజనీర్లు/అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లకు ఏడీఈలుగా, 1650 మంది జూనియర్ లైన్‌మెన్‌లకు అసిస్టెంట్ లైన్‌మెన్‌లుగా పదోన్నతి కల్పించారు.

    పదోన్నతుల అంశాన్ని ఇటీవల ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క దృష్టికి తీసుకెళ్లి పదోన్నతి ఉత్తర్వులు జారీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఎస్పీడీసీఎల్ సీఎండీని కోరారు. ఈ మేరకు ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది.

    వివరాలు 

    ఖాళీ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు

    2017 నుండి ప్రమోషన్ పెండింగ్‌లో ఉంది. చాలా మంది ఉద్యోగులు పదోన్నతులు పొందకుండా పదవీ విరమణ చేశారు.

    2263 మంది సిబ్బందికి పదోన్నతుల కారణంగా ఏర్పడిన ఖాళీ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని సీఎండీ తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ

    తాజా

    CSK vs RR : చైన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజయం రాజస్థాన్ రాయల్స్
    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ

    తెలంగాణ

    kerala: రైలు మిడిల్ బెర్త్ పడి  కేరళ వ్యక్తి మృతి   కేరళ
    Telangana: కేసీఆర్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ వాయిదా   కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు
    Telangana:కాంగ్రెస్‌లో చేరిన  చేవెళ్ల బీఆర్‌ఎస్‌ ఎమ్యెల్యే   భారతదేశం
    Dharmapuri Srinivas: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ధర్మపురి శ్రీనివాస్‌ గుండెపోటుతో మృతి  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025