NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Delhi Pollution: దిల్లీని కమ్మేసిన పొగమంచు.. 300లకు పైగా విమాన సర్వీసులు ఆలస్యం
    తదుపరి వార్తా కథనం
    Delhi Pollution: దిల్లీని కమ్మేసిన పొగమంచు.. 300లకు పైగా విమాన సర్వీసులు ఆలస్యం
    దిల్లీని కమ్మేసిన పొగమంచు.. 300లకు పైగా విమాన సర్వీసులు ఆలస్యం

    Delhi Pollution: దిల్లీని కమ్మేసిన పొగమంచు.. 300లకు పైగా విమాన సర్వీసులు ఆలస్యం

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 14, 2024
    03:21 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దిల్లీలో (Delhi) కమ్ముకున్న దట్టమైన పొగమంచు అలముకుంది. వరుసగా రెండోరోజు వాయు నాణ్యతా సూచీ అత్యధికంగా 400కు పైగా నమోదైంది (severe category).

    దాంతో దృశ్యమానం (visibility) పూర్తిగా క్షీణించిపోయింది. ఈ కారణంగా విమాన రాకపోకలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి.

    ఫ్లైట్‌రాడార్‌ 24 సంస్థ ప్రకారం, 300కు పైగా విమాన సర్వీసులు ఆలస్యమయ్యాయి.

    దిల్లీకి రావాల్సిన 115 విమానాలు, అక్కడి నుంచి బయలుదేరాల్సిన 226 సర్వీసులకు అంతరాయం ఏర్పడింది.

    దీనిపై దిల్లీ ఎయిర్‌పోర్ట్‌, విమానయాన సంస్థలు ప్రయాణికులను అప్రమత్తం చేశాయి.

    వివరాలు 

    ఐదులోపు తరగతుల విద్యార్థులకు సెలవు

    ఈ కాలుష్యంపై దిల్లీ మంత్రి గోపాల్‌రాయ్ స్పందించారు. "ఈ సీజన్‌లో మొదటిసారి వరుసగా రెండురోజులుగా వాయు నాణ్యతా సూచీ 400 పైనే ఉంది. అక్టోబర్ 14 నుంచి ఇది 400 దిగువన ఉన్నప్పటికీ, ఇప్పుడు ఎందుకు పెరిగిందనే ప్రశ్న అందరినీ కలవరపెడుతోంది. వాతావరణ శాఖ నిపుణులు దీని కారణంగా దిల్లీలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయని చెప్పారు. రేపటినుంచి కాలుష్య స్థాయిలు తగ్గవచ్చని అంచనా వేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కాలుష్య నియంత్రణకు 'గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (Grap)-3'ని అమలు చేయడం లేదు," అని మంత్రి వివరించారు.

    ఈ ప్లాన్‌ అమలులో ఉంటే అత్యవసరం కాని నిర్మాణాలు, కూల్చివేతలు నిలిపివేయబడతాయి. అలాగే, ఐదులోపు తరగతుల విద్యార్థులకు సెలవు ఇస్తారు.

    వివరాలు 

    గ్యాస్‌ చాంబర్‌లోకి వచ్చినట్టుగా..: ప్రియాంక 

    దిల్లీలో పరిస్థితి గ్యాస్ చాంబర్‌లోకి వచ్చినట్లుగా ఉందని ప్రియాంకాగాంధీ (Priyanka Gandhi) తన ఆందోళన వ్యక్తం చేశారు.

    "కేరళలోని వయనాడ్ నుంచి దిల్లీకి వచ్చాను. అక్కడ వాయు నాణ్యత 35గా ఉండగా ఇక్కడ గ్యాస్ చాంబర్‌లో ఉన్నట్టుగా అనిపిస్తోంది. ప్రతి రోజు కాలుష్యం పెరుగుతూనే ఉంది. పిల్లలు, వృద్ధులు, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నవారికి ఇది తీవ్రమైన సమస్య. పరిశుభ్రమైన గాలి కోసం అందరూ కలిసి పార్టీలను దాటి పనిచేయాలి," అన్నారు.

    మరోవైపు దట్టమైన పొగమంచు కారణంగా వాహనాలు కనిపించక రోడ్డు ప్రమాదాలు సంభవించాయి.

    హర్యానాలోని రోహ్‌తక్‌ సమీపంలోని జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌9)పై ఎనిమిది వాహనాలు ఢీకొన్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    దిల్లీ

    Delhi CM Atishi: అతిషి నేతృత్వంలో దిల్లీలో రోడ్ల పరిశీలన.. దీపావళిలోగా గుంతల రహిత రోడ్లు! అతిషి మార్లెనా
    PM E-DRIVE: పీఎం ఇ- డ్రైవ్‌ పథకం ద్వారా టూ వీలర్‌కు గరిష్ఠంగా రూ.10 వేలు సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం
    Cocaine Seized: దిల్లీలో కలకలం రేపిన డ్రగ్స్.. రూ.2వేల కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం ఇండియా
    Delhi: ఢిల్లీలోని జైత్‌పూర్‌లో దారుణ ఘటన.. వైద్యుడిని కాల్చిచంపిన ఇద్దరు మైనర్లు.. హత్య
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025