Page Loader
AP Paddy Procurement WhatsApp : ఆంధ్రప్రదేశ్‌లో ధాన్యం కొనుగోళ్లలో టెక్నాలజీ వినియోగం 
ఆంధ్రప్రదేశ్‌లో ధాన్యం కొనుగోళ్లలో టెక్నాలజీ వినియోగం

AP Paddy Procurement WhatsApp : ఆంధ్రప్రదేశ్‌లో ధాన్యం కొనుగోళ్లలో టెక్నాలజీ వినియోగం 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 18, 2024
11:26 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లను సులభతరం చేసేందుకు టెక్నాలజీని వినియోగిస్తోంది. వాట్సాప్ సేవలను అనుసంధానం చేసి, రైతుల పనులను మరింత సులభతరం చేసింది. ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని విక్రయించేందుకు ఎలాంటి అవాంతరాలు లేకుండా, ఏకకాలంలో సులభమైన విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. వాట్సాప్ ద్వారా సేవల అందుబాటు రైతులు తమ మొబైల్ ఫోన్‌లో 73373 59375 నంబర్ సేవ్ చేసి, వాట్సాప్‌లో Hi అని మెసేజ్ పంపితే సరిపోతుంది. పౌర సరఫరాల శాఖ నుండి వచ్చే మెసేజ్‌లను అనుసరించి, రైతులు తమ ధాన్యం విక్రయాలను షెడ్యూల్ చేసుకోవచ్చు.

వివరాలు 

వాట్సాప్ ద్వారా ధాన్యం విక్రయ విధానం ఎలా ఉంటుంది? 

మొదటగా 73373 59375 నంబర్‌ను సేవ్ చేసుకుని, వాట్సాప్‌లో Hi అని మెసేజ్ పంపండి. "ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థకు స్వాగతం. ధాన్యం అమ్మడానికి షెడ్యూల్ చేసుకోండి" అనే మెసేజ్ వస్తుంది. అందులోని షెడ్యూల్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. రైతు తన ఆధార్ నంబర్ ను నమోదు చేయాలి. ఆధార్ వివరాలను నమోదు చేసిన తర్వాత, రైతు పేరు,ధాన్యం కొనుగోలు కేంద్రం పేరు డిస్‌ప్లే అవుతుంది. ధాన్యం విక్రయించే తేదీ, సమయం ఎంచుకోవచ్చు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మూడు స్లాట్‌లు అందుబాటులో ఉంటాయి. అనంతరం రైతు విక్రయించదలచిన ధాన్యం రకం,బ్యాగ్‌ల సంఖ్య నమోదు చేయాలి. చివరగా,రైతు వివరాలతో పాటు కూపన్ కోడ్ కూడా క్రియేట్ అవుతుంది.

వివరాలు 

ప్రభుత్వం అందించిన సులభతర సేవలు 

ఈ ప్రోగ్రాంలో ఏఐ వాయిస్ గైడెన్స్ సదుపాయాన్ని చేర్చడం ద్వారా, వాట్సాప్‌లో వ్యవస్థను తేలికగా వినియోగించేందుకు అవకాశం కల్పించారు. రైతులు ఎలాంటి సాంకేతిక అవగాహన లేకుండానే ధాన్యం కొనుగోలు షెడ్యూల్ చేసుకోవడానికి ఈ విధానం ఉపయోగపడుతుంది. ఈ సేవలను గురించి మరింత స్పష్టత కోసం, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఎక్స్‌(ట్విట్టర్) లో వీడియోను పంచుకున్నారు. ఈ యాప్ ద్వారా రైతుల జీవితాలను సులభతరం చేసే దిశగా ప్రభుత్వం చేపట్టిన చర్యలు ప్రశంసనీయం.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నాదెండ్ల మనోహర్ ట్వీట్ చేసిన వీడియో