NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / AP Paddy Procurement WhatsApp : ఆంధ్రప్రదేశ్‌లో ధాన్యం కొనుగోళ్లలో టెక్నాలజీ వినియోగం 
    తదుపరి వార్తా కథనం
    AP Paddy Procurement WhatsApp : ఆంధ్రప్రదేశ్‌లో ధాన్యం కొనుగోళ్లలో టెక్నాలజీ వినియోగం 
    ఆంధ్రప్రదేశ్‌లో ధాన్యం కొనుగోళ్లలో టెక్నాలజీ వినియోగం

    AP Paddy Procurement WhatsApp : ఆంధ్రప్రదేశ్‌లో ధాన్యం కొనుగోళ్లలో టెక్నాలజీ వినియోగం 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 18, 2024
    11:26 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లను సులభతరం చేసేందుకు టెక్నాలజీని వినియోగిస్తోంది.

    వాట్సాప్ సేవలను అనుసంధానం చేసి, రైతుల పనులను మరింత సులభతరం చేసింది.

    ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని విక్రయించేందుకు ఎలాంటి అవాంతరాలు లేకుండా, ఏకకాలంలో సులభమైన విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది.

    వాట్సాప్ ద్వారా సేవల అందుబాటు

    రైతులు తమ మొబైల్ ఫోన్‌లో 73373 59375 నంబర్ సేవ్ చేసి, వాట్సాప్‌లో Hi అని మెసేజ్ పంపితే సరిపోతుంది.

    పౌర సరఫరాల శాఖ నుండి వచ్చే మెసేజ్‌లను అనుసరించి, రైతులు తమ ధాన్యం విక్రయాలను షెడ్యూల్ చేసుకోవచ్చు.

    వివరాలు 

    వాట్సాప్ ద్వారా ధాన్యం విక్రయ విధానం ఎలా ఉంటుంది? 

    మొదటగా 73373 59375 నంబర్‌ను సేవ్ చేసుకుని, వాట్సాప్‌లో Hi అని మెసేజ్ పంపండి.

    "ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థకు స్వాగతం. ధాన్యం అమ్మడానికి షెడ్యూల్ చేసుకోండి" అనే మెసేజ్ వస్తుంది. అందులోని షెడ్యూల్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.

    రైతు తన ఆధార్ నంబర్ ను నమోదు చేయాలి.

    ఆధార్ వివరాలను నమోదు చేసిన తర్వాత, రైతు పేరు,ధాన్యం కొనుగోలు కేంద్రం పేరు డిస్‌ప్లే అవుతుంది.

    ధాన్యం విక్రయించే తేదీ, సమయం ఎంచుకోవచ్చు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మూడు స్లాట్‌లు అందుబాటులో ఉంటాయి.

    అనంతరం రైతు విక్రయించదలచిన ధాన్యం రకం,బ్యాగ్‌ల సంఖ్య నమోదు చేయాలి.

    చివరగా,రైతు వివరాలతో పాటు కూపన్ కోడ్ కూడా క్రియేట్ అవుతుంది.

    వివరాలు 

    ప్రభుత్వం అందించిన సులభతర సేవలు 

    ఈ ప్రోగ్రాంలో ఏఐ వాయిస్ గైడెన్స్ సదుపాయాన్ని చేర్చడం ద్వారా, వాట్సాప్‌లో వ్యవస్థను తేలికగా వినియోగించేందుకు అవకాశం కల్పించారు. రైతులు ఎలాంటి సాంకేతిక అవగాహన లేకుండానే ధాన్యం కొనుగోలు షెడ్యూల్ చేసుకోవడానికి ఈ విధానం ఉపయోగపడుతుంది.

    ఈ సేవలను గురించి మరింత స్పష్టత కోసం, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఎక్స్‌(ట్విట్టర్) లో వీడియోను పంచుకున్నారు. ఈ యాప్ ద్వారా రైతుల జీవితాలను సులభతరం చేసే దిశగా ప్రభుత్వం చేపట్టిన చర్యలు ప్రశంసనీయం.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    నాదెండ్ల మనోహర్ ట్వీట్ చేసిన వీడియో 

    రైతులు చెమటోడ్చి పండించిన ధాన్యం విక్రయించుకొనేందుకు ప్రయాస అవసరం లేదు. 73373 59375 నెంబర్ కి వాట్సాప్ నుంచి Hi చెబితే చాలు... సేవలు అందుబాటులోకి వస్తాయి. మీరు ఏ కేంద్రంలో, ఏ రోజు, ఏ టైములో, ఏ రకం ధాన్యం, ఎన్ని బస్తాలు అమ్మదలుచుకున్నారో మెసేజ్ ఇస్తే స్లాట్ బుక్ అవుతుంది. సులభంగా… pic.twitter.com/TPXmSVDCSp

    — Manohar Nadendla (@mnadendla) November 17, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    SRH vs KKR: కోల్‌కతా ఘోర ఓటమి.. హ్యాట్రిక్ విజయాలతో టోర్నీ నుంచి నిష్క్రమించిన సన్ రైజర్స్ సన్ రైజర్స్ హైదరాబాద్
    Sunrisers Hyderabad: ఐపీఎల్ చరిత్రనే తిరగరాసిన హైద‌రాబాద్.. అత్య‌ధిక స్కోర్ల జాబితా ఆరంజ్ ఆర్మీదే! సన్ రైజర్స్ హైదరాబాద్
    Kakani Govardhan: క్వార్ట్జ్‌ అక్రమాల కేసు.. మాజీ మంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డి అరెస్టు కాకాణి గోవర్ధన్ రెడ్డి
    GT vs CSK : గుజరాత్ ఓటమి.. చివరి మ్యాచును విజయంతో ముగించిన సీఎస్కే చైన్నై సూపర్ కింగ్స్

    ఆంధ్రప్రదేశ్

    Free Bus: మహిళలకు శుభవార్త.. సంక్రాంతి కానుకగా ఉచిత బస్సు ప్రయాణం ఇండియా
    Chandrababu: 'ఉచిత గ్యాస్ సిలిండర్' పథకం ప్రారంభం..  టీ చేసిన సీఎం  చంద్రబాబు నాయుడు
    IMD : నవంబర్‌లో చలి తక్కువే.. వాతావరణ శాఖ నివేదిక వాతావరణ శాఖ
    Nara Lokesh: ముగిసిన నారా లోకేశ్ అమెరికా పర్యటన.. 100 కంపెనీలతో కీలక చర్చలు నారా లోకేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025