
Kartik Maharaj: పద్మశ్రీ గ్రహీతపై అత్యాచార ఆరోపణలు.. ఉద్యోగ హామీతో మోసం..?
ఈ వార్తాకథనం ఏంటి
పద్మశ్రీ అవార్డు గ్రహీత, భారత్ సేవాశ్రమ సంఘానికి చెందిన సన్యాసి కార్తీక్ మహారాజ్పై సంచలన ఆరోపణలోచ్చాయి. తనపై 2013లో పదేపదే అత్యాచారం జరిగిందని ఓ మహిళ తీవ్ర ఆరోపణలు చేసింది. ప్రస్తుతం బీజేపీకి అనుకూలంగా ఉన్న మహారాజ్పై వచ్చిన ఈ ఆరోపణలు రాజకీయంగా కలకలం రేపుతున్నాయి. ముర్షిదాబాద్లోని ఓ ఆశ్రమంలోని పాఠశాలలో టీచర్ ఉద్యోగం ఇప్పిస్తానంటూ తనను తీసుకెళ్లిన కార్తీక్ మహారాజ్ అక్కడే ఆమెకు వసతి కల్పించినట్లు మహిళ తెలిపింది. అనంతరం ఓ రాత్రి తన గదిలోకి ప్రవేశించి బలవంతంగా అత్యాచారం చేశాడని ఆరోపించారు. 2013 జనవరి నుంచి జూన్ వరకు ఆరు నెలల పాటు అదే తరహా ఘటనలు పునరావృతమైనట్లు వెల్లడించారు.
Details
పలు సెక్షన్ల కింద కేసు నమోదు
భయం, నిస్సహాయత కారణంగా ఇన్నాళ్లూ మౌనంగా ఉన్నానని ఆమె పేర్కొన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరించినట్లు కూడా ఆమె ఆరోపణ చేశారు. ఈ మేరకు మహిళ ఫిర్యాదుతో పోలీసులు కార్తీక్ మహారాజ్పై సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు వెల్లడించారు. మరోవైపు, కార్తీక్ మహారాజ్ తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. తాను సన్యాసి జీవితం అనుసరిస్తున్నానని, ఇటువంటి అడ్డంకులు అలవాటైనవే అని వ్యాఖ్యానించారు. తన న్యాయ బృందం కోర్టులో దీనికి సమాధానం చెబుతుందని పేర్కొన్నారు. గతంలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మాట్లాడుతూ, కార్తీక్ మహారాజ్ బీజేపీకి సహాయపడుతున్నారని, టీఎంసీ వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు