NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Pakistan: భారీ దాడులకు భారత్ ప్లాన్ చేస్తోంది..భారతీయులు మూల్యం చెల్లించుకుంటారని ..పాక్ రక్షణ మంత్రి హెచ్చరిక
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Pakistan: భారీ దాడులకు భారత్ ప్లాన్ చేస్తోంది..భారతీయులు మూల్యం చెల్లించుకుంటారని ..పాక్ రక్షణ మంత్రి హెచ్చరిక
    భారీ దాడులకు భారత్ ప్లాన్ చేస్తోంది..భారతీయులు మూల్యం చెల్లించుకుంటారని ..పాక్ రక్షణ మంత్రి హెచ్చరిక

    Pakistan: భారీ దాడులకు భారత్ ప్లాన్ చేస్తోంది..భారతీయులు మూల్యం చెల్లించుకుంటారని ..పాక్ రక్షణ మంత్రి హెచ్చరిక

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 25, 2025
    03:21 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి తరువాత పాకిస్థాన్ అంతర్గతంగా ఆందోళనకు లోనై, భారత్ నుండి వచ్చే ప్రతీకార చర్యలను ఎదుర్కొనడానికి సిద్ధమవుతోంది.

    ఇప్పటికే నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వద్ద తన సైనిక దళాలను మోహరించింది.

    ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలో అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.

    ఈ సమావేశం అనంతరం, పాకిస్తాన్ భారత్‌పై ప్రతికారాత్మక చర్యలకు దిగింది.

    భారత విమానాలకు తమ గగనతలాన్ని మూసివేయడంతో పాటు, భారత్‌తో ఉన్న ద్వైపాక్షిక ఒప్పందాలను నిలిపివేస్తూ, వాణిజ్య సంబంధాలను కూడా రద్దు చేసినట్లు ప్రకటించింది.

    వివరాలు 

    భారత పౌరులు సురక్షితంగా ఉండరు

    ఈ పరిణామాల మధ్య,పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

    ఆయన మాట్లాడుతూ, ''భారతదేశం సంపూర్ణ యుద్ధాన్ని చేపట్టే బదులుగా, పాకిస్తాన్ అంతటా విస్తృత స్థాయిలో ఉగ్రదాడులకు సన్నద్ధమవుతోంది'' అని ఆరోపించారు.

    భారత్ సంపూర్ణ యుద్ధం మార్గాన్ని విడిచి ఉగ్రవాద చర్యలకే ప్రాధాన్యత ఇస్తోందని,అలాంటి దాడుల విషయంలో తమ దేశం పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.అయితే, అలాంటి చర్యలకు ప్రతిక్రియ తప్పదని హెచ్చరించారు.''పాకిస్తాన్ పౌరులకు ఏదైనా ప్రమాదం వాటిల్లితే ,భారత పౌరులు సురక్షితంగా ఉండరు. భారత్ దాడుల వల్ల ఒక్క పాకిస్తాన్ పౌరుడైన ప్రాణాలు కోల్పోతే, భారతదేశం తీవ్ర మూల్యం చెల్లించాల్సి వస్తుంది'' అని ఖ్వాజా ఆసిఫ్ ఘాటు హెచ్చరిక జారీ చేశారు.

    వివరాలు 

    సింధు జలాల ఒప్పందం రద్దు..''యుద్ధ చర్య'

    ఇక పాకిస్తాన్ తన సార్వభౌమాధికారంపై లేదా జాతీయ భద్రతపై ఏవైనా ముప్పులు ఏర్పడితే, తాము తగినంత దృఢమైన ప్రతిస్పందన ఇవ్వకుండా ఉండమని భారత్‌కు హెచ్చరించింది.

    పహల్గామ్ వంటి సంఘటనలను భారత ప్రభుత్వం తమ రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించుకుంటోందని పాకిస్తాన్ జాతీయ భద్రతా కమిటీ సమావేశం అనంతరం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.

    అంతేకాక, సింధు జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేయాలని భావిస్తే, దానిని ఒక ''యుద్ధ చర్య''గా పరిగణిస్తామని పాకిస్తాన్ స్పష్టంచేసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పాకిస్థాన్

    తాజా

    Royal Enfield EV: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ఎలక్ట్రిక్‌ మోటార్‌ సైకిల్‌.. ఈ ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో విడుదల రాయల్ ఎన్‌ఫీల్డ్
    Akashteer: దాయాది పాక్ కి దడ పుట్టించిన 'ఆకాష్‌టీర్'.. దీని ప్రత్యేకతలు ఇవే.. ఐరన్‌ డోమ్‌
    Indus treaty: 'ఇలా అయితే తీవ్ర దుర్భిక్షం నెలకుంటుంది': సింధూ జలాలపై పునఃసమీక్షించండి.. భారత్‌కు పాకిస్థాన్‌ విజ్ఞప్తి పాకిస్థాన్
    Hit3 : ఆ రోజు నుంచే హిట్-3 ఓటీటీ స్ట్రీమింగ్.. నెట్ ఫ్లిక్స్

    పాకిస్థాన్

    PSL : పాకిస్థాన్ సూపర్ లీగ్ 10వ సీజన్ షెడ్యూల్ వచ్చేసింది.. మొత్తం 34 మ్యాచ్‌లు! క్రికెట్
    Pakistan: మసీదులో ఆత్మాహుతి దాడి.. 5 మంది మృతి, 20 మందికి గాయాలు అంతర్జాతీయం
    Space Station: చైనా స్పేస్ స్టేషన్‌కు తొలి విదేశీ అతిథిగా పాక్ వ్యోమగామి! అంతరిక్షం
    Pakistan: పాకిస్థాన్‌లో మరో ఉగ్రదాడి.. 12 మంది మృతి ప్రపంచం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025