NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Pahalgam Terror Attack: పహల్గాం ఉగ్రదాడి.. పార్లమెంట్‌ ప్రాగణంలో అత్యవసర భేటీ!
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Pahalgam Terror Attack: పహల్గాం ఉగ్రదాడి.. పార్లమెంట్‌ ప్రాగణంలో అత్యవసర భేటీ!
    పహల్గాం ఉగ్రదాడి.. పార్లమెంట్‌ ప్రాగణంలో అత్యవసర భేటీ!

    Pahalgam Terror Attack: పహల్గాం ఉగ్రదాడి.. పార్లమెంట్‌ ప్రాగణంలో అత్యవసర భేటీ!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Apr 28, 2025
    05:14 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పహల్గాం ఉగ్రదాడి (Pahalgam Terror Attack)తో దేశం మొత్తం షాక్‌కు లోనైంది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దాయాదికి తగిన బుద్ధి చెప్పేందుకు భారత్‌ సిద్ధమవుతోంది.

    ఈ నేపథ్యంలో దేశంలో కీలక భేటీలు జరుగుతున్నాయి. తాజాగా పార్లమెంట్ ప్రాంగణంలో రక్షణ వ్యవహారాలపై స్టాండింగ్‌ కమిటీ సమావేశమైంది.

    ఈ సమావేశానికి ఎంపీలు రాధా మోహన్ సింగ్, రాహుల్ గాంధీ, విష్ణుపాల్ రే, జగన్నాథ్‌ సర్కార్, శక్తి సింగ్‌ గోహిల్, సంజయ్‌ సింగ్ హాజరయ్యారు.

    ఈ ఉదయం ప్రధాని నరేంద్రమోదీతో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ భేటీ అయ్యారు.

    పహల్గాంలో పరిస్థితులు, భద్రతా రంగంలో సైన్యం తీసుకున్న చర్యలపై ప్రధానికి సమగ్ర నివేదిక ఇచ్చారు.

    Details

    40 నిమిషాల పాటు భేటీ

    దాదాపు 40 నిమిషాల పాటు ఈ భేటీ కొనసాగింది. ఆదివారం రోజుననే రాజ్‌నాథ్‌ సింగ్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్‌తో భేటీ అయి, భారత్‌ తీసుకోవాల్సిన తదుపరి చర్యలపై చర్చించారు.

    ఆ భేటీలో తీసుకున్న కీలక నిర్ణయాల వివరాలను కూడా రాజ్‌నాథ్‌ ఈరోజు మోదీకి వివరించారు. ఈ సమావేశానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ఢోబాల్ కూడా హాజరయ్యారు.

    ఉగ్రదాడి నేపథ్యంలో ఇప్పటికే కేంద్రం అఖిలపక్ష భేటీ నిర్వహించిన విషయం తెలిసిందే. దాడి జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించలేదని, భద్రతా లోపం కనిపించిందని విపక్షాలు ఆరోపించాయి.

    దాడి జరిగిన సమయంలో భద్రతా బలగాలు, సీఆర్పీఎఫ్‌ ఎక్కడున్నాయంటూ పలు నేతలు ప్రశ్నలు సంధించారు.

    Details

    కేంద్ర ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేసిన రాహుల్ గాంధీ

    దీనిపై కేంద్రం తరఫు నుంచి ఓ మంత్రి స్పందిస్తూ, ''సాధారణంగా జూన్‌లో ప్రారంభమయ్యే అమర్‌నాథ్‌ యాత్ర వరకు పహల్గాం ప్రాంతంలో పర్యాటక ప్రవర్తనపై ఆంక్షలు అమలులో ఉంటాయి.

    కానీ ఈసారి స్థానిక అధికారులు భద్రతా సంస్థలకు సమాచారం ఇవ్వకుండానే బైసరన్‌కు పర్యాటకులను అనుమతించారని వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే.

    ఇక కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ కేంద్ర ప్రభుత్వ స్పందనపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పార్లమెంట్
    ఉగ్రవాదులు
    జమ్ముకశ్మీర్

    తాజా

    Covid 19 : హాంకాంగ్, సింగపూర్ లో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు కోవిడ్
    India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే.. బీసీసీఐ
    Turkey: టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం.. ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న భారత యూనివర్సిటీలు.. బాయ్‌కాట్‌ టర్కీ
    India Turkey: టర్కీకి బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. విమానయాన సంస్థతో ఒప్పందం రద్దు.. కేంద్ర ప్రభుత్వం

    పార్లమెంట్

    Interim Budget 2024: ఈ 'మినీ బడ్జెట్‌'లో దేశం ఏం ఆశిస్తోందో తెలుసుకుందాం  బడ్జెట్
    Maldives: పార్లమెంటులో మాల్దీవుల అధ్యక్షుడి ప్రసంగాన్ని బహిష్కరించిన ప్రతిపక్షాలు  మాల్దీవులు
    congress v/s BJP: పార్లమెంట్ సాక్షిగా 'శ్వేతపత్రం' v/s 'బ్లాక్‌ పేపర్‌' వార్  భారతదేశం
    పబ్లిక్ ఎగ్జామినేషన్ మాల్‌ప్రాక్టీస్ నిరోధక బిల్లుకు రాష్ట్రపతి ఆమోద ముద్ర  ద్రౌపది ముర్ము

    ఉగ్రవాదులు

    ఖలిస్థానీ ఉగ్రవాదులు-గ్యాంగ్‌స్టర్ల బంధంపై ఎన్ఐఏ ఫోకస్.. దేశవ్యాప్తంగా 50చోట్ల సోదాలు  ఎన్ఐఏ
    ముగ్గురు ఐసీస్ ఉగ్రవాదులపై రూ.3లక్షల రివార్డు ప్రకటించిన ఎన్ఐఏ ఎన్ఐఏ
    26/11 సూత్రధారి హఫీజ్ సయీద్ ప్రధాన అనుచరుడు కరాచీలో కాల్చివేత  పాకిస్థాన్
    Delhi : ఆ ఉగ్రవాదులంతా ఉన్నత విద్యావంతులే.. బైక్ దొంగల వెనుక భారీ ఉగ్ర నెట్‌వర్క్  దిల్లీ

    జమ్ముకశ్మీర్

    Jammu and Kashmir: వక్ఫ్ సవరణ చట్టంపై జమ్మూ కాశ్మీర్‌ అసెంబ్లీలో ఆందోళనలు.. ప్రతులను చింపివేసిన నేషనల్ కాన్ఫరెన్స్ ఎమ్మెల్యేలు.. భారతదేశం
    Encounter: జమ్ముకశ్మీర్‌లో ఉద్రిక్తత.. ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఎన్‌కౌంటర్ ఎన్‌కౌంటర్
    Encounter : కిష్త్వార్‌లో భారీ ఆపరేషన్.. ఉగ్రవాదిని హతమార్చిన భద్రతా దళాలు! భారతదేశం
    Jammu Kashmir: జమ్మూ-కశ్మీర్‌లో ప్రొఫెసర్‌పై సైనికుల దాడి ఆరోపణలు.. విచారణ ప్రారంభించిన సైన్యం  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025