Page Loader
Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడి.. లష్కరే తోయిబా ఉగ్రవాదుల ఇళ్లు ధ్వంసం
పహల్గామ్ ఉగ్రదాడి.. లష్కరే తోయిబా ఉగ్రవాదుల ఇళ్లు ధ్వంసం

Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడి.. లష్కరే తోయిబా ఉగ్రవాదుల ఇళ్లు ధ్వంసం

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 27, 2025
10:36 am

ఈ వార్తాకథనం ఏంటి

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భద్రతా దళాలు ఉగ్రవాదులను పట్టుకునేందుకు గాలింపు చర్యలను మరింతగా పెంచాయి. లష్కరే తోయిబా ఉగ్రవాదుల ఇళ్లను ధ్వంసం చేస్తూ, వారిని నిలువరించేందుకు ప్రయత్నాలు చేపడుతున్నాయి. శనివారం రాత్రి ఉత్తర కశ్మీర్‌లోని కుప్వారా జిల్లా, కలరూస్, బందిపొరా ప్రాంతాల్లో ఉన్న ఉగ్రవాదుల ఫరూఖ్ అహ్మద్ తద్వా, జమీల్ అహ్మద్ షీర్, అమీర్ నాజిర్‌ల ఇళ్లను పేల్చివేశారు. ఐదుగురు ఉగ్రవాదుల ఇళ్లను ఇప్పటికే ధ్వంసం చేసిన భద్రతా బలగాలు, మిగిలిన ఉగ్రవాదుల ఇళ్లపై కూడా ఇదే చర్యలు కొనసాగించాలని సూచించాయి. శ్రీనగర్‌లోని 60కి పైగా ప్రదేశాల్లో దాడులు నిర్వహించి ఉగ్రవాదుల స్థావరాలను గుర్తిస్తున్నారు. వారి ఇళ్లలో ఆయుధాలు, డిజిటల్ పరికరాలు, ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకుంటున్నారు.

Details

ముమ్మరంగా గాలింపు చర్యలు

భద్రతా అధికారులు, దేశంలో హింసాత్మక చర్యలు చేపట్టేందుకు యత్నించే ఎవరినీ వదిలిపెట్టమని, వారంతా కఠినమైన పరిస్థితుల్ని ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించారు. పహల్గామ్ దాడి తర్వాత, ఉగ్రవాదుల ఇళ్లలో సోదాలు నిర్వహించిన సమయంలో ఆదిల్ హుస్సేన్ థోకర్, ఆసిఫ్ షేక్ వంటి ఉగ్రవాదుల ఇళ్లలో బాంబులు యాక్టివేట్ అయినట్లు గుర్తించి, భద్రతా బలగాలు చక్కదిద్దినట్లు తెలుస్తోంది. అంతేగాక శుక్రవారం లష్కరే తోయిబా కమాండర్ షాహిద్ అహ్మద్, ఇతర యాక్టివ్ టెర్రరిస్టుల ఇళ్లను కూడా పేల్చివేశారు. ఈ దాడులు తర్వాత ఐదు ఏకే 47 తుపాకులు, పిస్తోళ్లు, భారీ సంఖ్యలో తూటాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు ప్రకటించారు. గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.