NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Pahalgam Terror Attack: సౌదీ పర్యటనను కుదించుకుని దిల్లీ చేరుకున్న మోదీ.. ఉగ్రదాడిపై ఎయిర్‌పోర్టులో అత్యవసర భేటీ
    తదుపరి వార్తా కథనం
    Pahalgam Terror Attack: సౌదీ పర్యటనను కుదించుకుని దిల్లీ చేరుకున్న మోదీ.. ఉగ్రదాడిపై ఎయిర్‌పోర్టులో అత్యవసర భేటీ
    సౌదీ పర్యటనను కుదించుకుని దిల్లీ చేరుకున్న మోదీ.. ఉగ్రదాడిపై ఎయిర్‌పోర్టులో అత్యవసర భేటీ

    Pahalgam Terror Attack: సౌదీ పర్యటనను కుదించుకుని దిల్లీ చేరుకున్న మోదీ.. ఉగ్రదాడిపై ఎయిర్‌పోర్టులో అత్యవసర భేటీ

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 23, 2025
    08:16 am

    ఈ వార్తాకథనం ఏంటి

    జమ్ముకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో పర్యాటకులపై జరిగిన భయానక ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన సౌదీ అరేబియా పర్యటనను తక్షణమే ముగించి భారతదేశానికి వెంటనే తిరిగొచ్చారు.

    బుధవారం ఉదయం ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న మోదీ, అక్కడే అత్యవసర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.

    ఈ సమావేశంలో విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ పాల్గొన్నారు.

    వారు ఈ ఉగ్రదాడికి సంబంధించిన వివరాలను ప్రధానికి సమర్పించారు. దాడి పరిస్థితులు, దాని పరిణామాలు గురించి ప్రధానితో చర్చించారు.

    అలాగే, ఉదయం 11 గంటలకు ప్రధాని అధ్యక్షతన భద్రతా అంశాలపై కేబినెట్ కమిటీ అత్యవసర సమావేశం నిర్వహించనుంది.

    వివరాలు 

    సైనిక దుస్తుల్లో వచ్చిన ముష్కరులు..

    ఇక ఇదిలా ఉంటే,ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా శ్రీనగర్‌కు చేరుకున్నారు.అక్కడ భద్రతా సంస్థల ఉన్నతాధికారులతో సమావేశమై ప్రస్తుత పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు.

    ఇవాళ ఆయన స్వయంగా దాడి జరిగిన ప్రదేశమైన పహల్గాం ప్రాంతానికి వెళ్లి పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించనున్నారు.

    కశ్మీర్‌లోని మినీస్విట్జర్లాండ్‌గా పేరొందిన పహల్గాం సమీపంలోని బైసరన్ లోయ వద్ద మంగళవారం ఉగ్రవాదులు నరమేధానికి పాల్పడ్డారు.

    మద్యం మధ్యాహ్నం 3గంటల ప్రాంతంలో సైనిక దుస్తుల్లో వచ్చిన ముష్కరులు అక్కడ ఉన్న పర్యాటకుల చుట్టూ చేరి అత్యంత సమీపం నుంచి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.

    ఈదారుణ ఘటనలో 28మంది ప్రాణాలు కోల్పోగా,పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

    దాడి అనంతరం ఉగ్రవాదులు అటవీ ప్రాంతంలోకి పారిపోవడంతో,వారిని పట్టుకోవడానికి భద్రతా బలగాలు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జమ్ముకశ్మీర్

    తాజా

    Royal Enfield EV: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ఎలక్ట్రిక్‌ మోటార్‌ సైకిల్‌.. ఈ ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో విడుదల రాయల్ ఎన్‌ఫీల్డ్
    Akashteer: దాయాది పాక్ కి దడ పుట్టించిన 'ఆకాష్‌టీర్'.. దీని ప్రత్యేకతలు ఇవే.. ఐరన్‌ డోమ్‌
    Indus treaty: 'ఇలా అయితే తీవ్ర దుర్భిక్షం నెలకుంటుంది': సింధూ జలాలపై పునఃసమీక్షించండి.. భారత్‌కు పాకిస్థాన్‌ విజ్ఞప్తి పాకిస్థాన్
    Hit3 : ఆ రోజు నుంచే హిట్-3 ఓటీటీ స్ట్రీమింగ్.. నెట్ ఫ్లిక్స్

    జమ్ముకశ్మీర్

    Jammu Kashmir Encounter: జమ్ముకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. 5 మంది ఉగ్రవాదులు హతం.. ఇద్దరు సైనికులుకు గాయాలు  ఎన్‌కౌంటర్
    Tashi Namgyal: కార్గిల్ యుద్ధంలో పాక్ కుట్రను భగ్నం చేసిన ఆ గొర్రెల వ్యాపారి ఇక లేరు ఇండియా
    West Bengal: కశ్మీరీ ఉగ్రవాది జావేద్ మున్షీ అరెస్ట్.. సంచలన నిజాలు వెలుగులోకి! పశ్చిమ బెంగాల్
    Jammu and Kashmir: జీతం కోసం ఎదురుచూస్తున్న జమ్మూకశ్మీర్‌ ఎమ్మెల్యేలు  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025