NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Pak airspace shutdown: పాక్‌ తన గగనతలాన్ని మూసివేసిన నేపథ్యంలో.. భారత విమాన ప్రయాణికులకు ఏమవుతుంది?
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Pak airspace shutdown: పాక్‌ తన గగనతలాన్ని మూసివేసిన నేపథ్యంలో.. భారత విమాన ప్రయాణికులకు ఏమవుతుంది?
    పాక్‌ తన గగనతలాన్ని మూసివేసిన నేపథ్యంలో.. భారత విమాన ప్రయాణికులకు ఏమవుతుంది?

    Pak airspace shutdown: పాక్‌ తన గగనతలాన్ని మూసివేసిన నేపథ్యంలో.. భారత విమాన ప్రయాణికులకు ఏమవుతుంది?

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 25, 2025
    02:45 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత దేశానికి చెందిన ప్రముఖ విమానయాన సంస్థ అయిన ఎయిరిండియా (టాటా గ్రూప్‌ ఆధ్వర్యంలో) కీలక ప్రకటన చేసింది.

    భారత్‌కు చెందిన విమానాలకు తమ గగనతలాన్ని మూసివేస్తున్నట్లు పాకిస్థాన్ ప్రకటించడంతో, ఎయిరిండియా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకునే దిశగా చర్యలు ప్రారంభించింది.

    దీనివల్ల విమానాల ప్రయాణ సమయం పెరగనుండగా, వ్యయ భారం కూడా పెరగే అవకాశముందని విమానయాన రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

    వివరాలు 

    ప్రయాణికులు, సిబ్బంది భద్రతకు మేము ప్రాధాన్యత ఇస్తాము

    ఎయిరిండియా సోషల్ మీడియా వేదికగా ఇచ్చిన ప్రకటనలో, ''పాకిస్తాన్ తన గగనతలాన్ని భారతీయ విమానాలకు తాత్కాలికంగా మూసివేసింది. ఫలితంగా ఉత్తర అమెరికా,యునైటెడ్ కింగ్‌డమ్‌, యూరప్‌, పశ్చిమాసియా దేశాలకు వెళ్లే లేదా అక్కడి నుంచి వచ్చే విమానాలు ఇప్పుడు పొడవైన ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించాల్సి వస్తోంది. ప్రయాణికులు ఎదుర్కొంటున్న అసౌకర్యానికి మేము బాధపడుతున్నాం. అయితే ఈ గగనతల పరిమితి మన ఆధీనంలో లేని పరిణామం. ఎయిరిండియా ప్రయాణికులు, సిబ్బంది భద్రతకు మేము ప్రాధాన్యత ఇస్తాము'' అని వివరించింది.

    వివరాలు 

    ఇండిగో నుంచి ప్రయాణికులకు ముఖ్య సూచనలు 

    పాకిస్తాన్ ఎయిర్‌స్పేస్ మూసివేత ప్రభావం తమ నిర్వహణలో ఉన్న కొన్ని అంతర్జాతీయ సర్వీసులపై పడిందని ఇండిగో సంస్థ ప్రకటించింది.

    ఈ ప్రభావం ఎంత తగ్గించవచ్చో అన్న దిశగా తమ సిబ్బంది యథాశక్తి ప్రయత్నిస్తున్నారని స్పష్టం చేసింది.

    ఈ మార్పుల వల్ల ప్రయాణానికి ముందు మీ ఫ్లైట్‌ స్టేటస్‌ను తనిఖీ చేయాలని, అవసరమైతే రీబుకింగ్‌ లేదా రిఫండ్‌ కోసం తమ అధికారిక వెబ్‌సైట్‌ను ఉపయోగించాలని ప్రయాణికులకు సూచించింది.

    దీనికి సంబంధించి 'ఎక్స్‌' వేదికగా ఒక ట్రావెల్ అడ్వైజరీను కూడా విడుదల చేసింది.

    వివరాలు 

    ఇతర సంస్థలపై కూడా ప్రభావం 

    ఎయిరిండియా,ఇండిగోతో పాటు, స్పైస్‌జెట్‌ మరియు ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ వంటి ఇతర భారతీయ విమానయాన సంస్థలు కూడా అంతర్జాతీయ సర్వీసులు నిర్వహిస్తున్నాయి.

    ముఖ్యంగా ఉత్తర భారతదేశం నుంచి పశ్చిమ దేశాలకు వెళ్లే విమానాలపై ఈ గగనతల ఆంక్షల ప్రభావం స్పష్టంగా కనిపించనుంది.

    ఈ మార్పులు ప్రయాణికుల అనుభవంపై తాత్కాలిక ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    విమానం

    తాజా

    Pawan Kalyan: గతంలోని చేదు అనుభవాలు మరచిపోతే ఎలా..? సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ అసహనం! పవన్ కళ్యాణ్
    #NewsBytesExplainer: కరోనా రీ ఎంట్రీ.. కొత్త వేరియంట్‌తో మళ్లీ ఊహించని పరిస్థితులు వస్తాయా?  కోవిడ్
    Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో) సోషల్ మీడియా
    Varin Tej 15: 'కొరియన్ కనకరాజు' చిత్రానికి అనంతపురంలో తొలి షెడ్యూల్ పూర్తి! వరుణ్ తేజ్

    విమానం

    Qantas flight: ప్రయాణికుల ఎంటర్‌టైన్‌మెంట్‌ కోసం ఎయిర్‌లైన్స్‌ సిబ్బంది నిర్వాకం.. నెట్టింట తీవ్ర విమర్శలు  జపాన్
    Boeing 737: బోయింగ్‌ విమానాల్లో కీలకమైన రడ్డర్‌ వ్యవస్థలు మోరాయిస్తున్నాయి: డీజీసీఏ హెచ్చరికలు  బోయింగ్
    Turkish Airlines: విమానం నడుపుతుండగా పైలట్ మృతి.. అత్యవసరంగా ల్యాండింగ్‌. న్యూయార్క్
    Boeing: సమ్మె ప్రభావం.. బోయింగ్‌ సంస్థలో 17వేల ఉద్యోగాలపై వేటు బోయింగ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025