NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / operation sindoor: పాక్ తప్పుడు ప్రచారాలను వ్యాప్తి చేస్తోంది : పీఐబీ
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    operation sindoor: పాక్ తప్పుడు ప్రచారాలను వ్యాప్తి చేస్తోంది : పీఐబీ
    పాక్ తప్పుడు ప్రచారాలను వ్యాప్తి చేస్తోంది : పీఐబీ

    operation sindoor: పాక్ తప్పుడు ప్రచారాలను వ్యాప్తి చేస్తోంది : పీఐబీ

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 10, 2025
    10:18 am

    ఈ వార్తాకథనం ఏంటి

    పాకిస్థాన్‌ ఇటీవల ఎక్స్‌పై (ఒకప్పటి ట్విటర్‌) నిషేధం విధించినప్పటికీ, భారత్‌ 'ఆపరేషన్‌ సిందూర్‌' చేపట్టగానే అది రద్దు చేసి, ఫేక్‌న్యూస్‌ యుద్ధానికి తెరతీసింది.

    దురదృష్టవశాత్తు, ఆ దేశం తప్పుడు ప్రచారాన్ని ప్రారంభించింది, కానీ భారత్‌ ఈ సృష్టించిన అబద్ధాలను ఫ్యాక్ట్‌ చెక్‌ ద్వారా తిరస్కరించింది.

    శనివారం పాకిస్థాన్‌ స్ట్రాటజిక్‌ ఎనలిస్ట్‌ కమర్‌ చీమా, గ్లోబల్‌ డిఫెన్స్‌ ఇన్‌సైట్‌ అనే హ్యాండిల్స్‌ ద్వారా భారత్‌పై మరో దుష్ప్రచారం ప్రారంభించారు.

    ఈసారి పాక్‌ సైబర్‌ సైన్యం భారత్‌ పవర్‌గ్రిడ్‌ 70శాతం వర్కింగ్‌ లేకుండా చేసినట్లు ఆరోపణలు మోపారు. కానీ, పీఐబీ (ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో) ఈ వార్తను ఫ్యాక్ట్‌ చెక్‌ చేసి, ఇది పూర్తిగా తప్పు అని నిర్ధారించింది.

    Details

    ఫేక్ వార్తలను 16 ఆధారాలతో నిరూపించిన పీఐబీ

    పీఐబీ దీనిని తిరస్కరించి, ప్రజలకు ఇలాంటి తప్పుడు ప్రచారాల నుండి దూరంగా ఉండాలని సూచించింది.

    అంతేకాకుండా, పాకిస్థాన్‌ గుజరాత్‌ పోర్టుపై దాడి, భారత సైనికుల మృతి వంటి అంశాలను కూడా ప్రచారం చేసింది.

    అయితే, పీఐబీ ఈ ఫేక్‌ వార్తలను 16 ఆధారాలతో నిరూపించింది.

    గుజరాత్‌లోని హజీరా పోర్టుపై దాడి జరిగినట్లు ఒక వీడియో వైరల్‌ అయినా, అది 2021 లో జరిగిన ఆయిల్‌ ట్యాంకర్‌ పేలుడు వీడియో అని వెల్లడైంది.

    Details

    నకిలీ ప్రచారాలను నమ్మొద్దు

    అలాగే, జలంధర్‌ లో డ్రోన్‌ దాడి, అమృత్‌సర్‌లో సైనిక స్థావరంపై దాడి వంటి వీడియోలు కూడా పాకిస్థాన్‌ రూపొందించిన నకిలీ ప్రచారమనే విషయం ఎండగట్టింది.

    పాక్‌ ఆర్మీ ద్వారా భారతీయ డ్రోన్‌ కూల్చినట్లు వ్యాప్తి చేసిన వీడియో కూడా సరైనదేమీ కావడం లేదు.

    జమ్ముకశ్మీర్‌ ఎయిర్‌బేస్‌ పై పాక్‌ దాడి జరిపిందని పాకిస్థాన్‌ అనుకూల 'ఎక్స్' ఖాతాల్లో పోస్ట్‌ చేసిన దృశ్యాలు కూడా పూర్తిగా తప్పుడు సమాచారమని పీఐబీ నిరూపించింది.

    2021లో అఫ్గానిస్థాన్‌లో కాబూల్‌ విమానాశ్రయంలో జరిగిన పేలుడు ఫోటోను కూడా సరిగ్గా ఉపయోగించారని పేర్కొంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆపరేషన్‌ సిందూర్‌
    పాకిస్థాన్

    తాజా

    operation sindoor: పాక్ తప్పుడు ప్రచారాలను వ్యాప్తి చేస్తోంది : పీఐబీ ఆపరేషన్‌ సిందూర్‌
    LIC: ఎల్‌ఐసీ సరికొత్త సదుపాయం.. వాట్సప్‌ బాట్‌లో ప్రీమియం చెల్లింపు! లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
    Pakistan: పాక్‌లో పెట్రోల్‌ కొరత.. 48 గంటలు బంక్‌ల మూసివేత పాకిస్థాన్
    Balochistan: పాకిస్థాన్‌కు నెత్తిన మరో బాంబు.. స్వతంత్య్ర దేశంగా ప్రకటించుకున్న బలూచిస్థాన్! పాకిస్థాన్

    ఆపరేషన్‌ సిందూర్‌

    Operation Sindoor: ఆత్మాహుతి డ్రోన్లు, స్కాల్ప్ క్షిపణులతో విరుచుకుపడ్డ భారత్ భారతదేశం
    Operation Sindoor: పాక్‌లోని ఉగ్రవాద శిబిరాలపై 'ఆపరేషర్‌ సిందూర్‌'.. దేశవ్యాప్తంగా అప్రమత్తమైన భద్రతా బలగాలు, పోలీసులు  భారతదేశం
    Vyomika Singh and Sophia Qureshi:ఆపరేషన్ సింధూర్..ఎవరి..సోఫియా ఖురేషి, వ్యోమికా సింగ్ ? భారతదేశం
    Operation Sindoor: పాక్‌లో ఉగ్ర స్థావరాలపై మెరుపుదాడి.. మాజీ, ప్రస్తుత క్రికెటర్ల స్పందనలివే!  క్రీడలు

    పాకిస్థాన్

    Pakistan: ఖరీఫ్‌ సీజన్‌ నుంచే పాకిస్తాన్ 21% నీటి కొరతను ఎదుర్కొనే అవకాశం అంతర్జాతీయం
    Baglihar Dam: ఈ ప్రాజెక్టు ఎందుకు పాకిస్తాన్‌కు ఆందోళన కలిగిస్తోంది? భారతదేశం
    Operation Sindoor: భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌లో.. 80 మంది ఉగ్రవాదులు మృతి..? ఉగ్రవాదులు
    Operation Sindoor: సోషల్ మీడియాలో పాకిస్థాన్ 'ఫేక్ న్యూస్' వార్.. వాస్తవాలతో స్పందించిన భారతదేశం  సోషల్ మీడియా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025